అవసరమెంతో..ఇచ్చింది కొంతే..
జిల్లాలోని పలు పట్టణాల్లో భారీ ఎత్తున టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా చాలాచోట్ల పునాదులదశలోనే ఆగిపోయాయి. పూర్తయిన వాటికి సైతం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో
రూ.679 కోట్లకు వచ్చింది రూ.35 కోట్లు
జీప్లస్త్రీ ఇళ్ల కేటాయింపునకు రుణ మంజూరు సమస్య
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే : జిల్లాలోని పలు పట్టణాల్లో భారీ ఎత్తున టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా చాలాచోట్ల పునాదులదశలోనే ఆగిపోయాయి. పూర్తయిన వాటికి సైతం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను సత్వరం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో అధికారులు రుణాలు అందించాలని నిర్ణయించారు. రుణ మంజూరు ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రభుత్వ ఆశయం నెరవేరకపోవడంతో పాటు లబ్ధిదారులు సైతం ఇళ్లు ఎప్పుడు అప్పగిస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
పూర్తయినవే కేటాయింపు
మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నూజివీడు, పెడన, జగ్గయ్యపేట పట్టణాలకు జనాభా ప్రాతిపదికన ఇళ్లు కేటాయించారు. పెడనలో స్థల సేకరణ సమస్య కారణంగా పనులు ప్రారంభం కాలేదు. మిగిలిన వాటిల్లో నిర్మాణాలు చేపట్టినా వివిధ కారణాలతో చాలా వరకు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. జీప్లస్త్రీ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మచిలీపట్నంలోని దేశాయిపేట గోసంఘం ప్రాంతంలో 11 ఎకరాలు, మండల పరిధిలోని రుద్రవరంలో 25 ఎకరాల భూమి సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించారు. రుద్రవరంలో చేపట్టిన వాటిలో చాలావరకు పునాదుల దశలోనే ఆగిపోయాయి. అలా మచిలీపట్నంలో మొత్తం 6,400 గృహాలు నిర్మించాలని సంకల్పిస్తే ప్రస్తుతం కేవలం 960 మాత్రమే లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడ ఎన్ని పూర్తయ్యాయో గుర్తించి వాటిని లబ్ధిదారులకు కేటాయించడానికి ఏర్పాట్లు చేశారు. తొలివిడతలో భాగంగా మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల్లో ఇళ్ల పనులు పూర్తిచేసి వారికి అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రుణ మేళాలో లబ్ధిదారులు, ఉద్యోగులు
సక్రమంగా అందేనా..?
పట్టణాల్లో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాట్లు నిర్మిస్తున్నారు. మొత్తం మూడు కేటగిరీలు ఏర్పాటు చేశారు. ఎ కేటగిరీలో రూ.500ల చొప్పున చెల్లించిన లబ్ధిదారులకు బ్యాంకు రుణం అవసరం లేకుండానే కేటాయిస్తున్నారు. బి కేటగిరీలో రూ.3.15లక్షలు, సి విభాగం వారికి రూ.3.65లక్షల రుణం మంజూరు చేయాల్సి ఉంది. దీన్ని లబ్ధిదారులు వాయిదాల పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అర్హులందరికీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టినా ఆశించిన పురోగతి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. పట్టణాల వారీగా మెప్మా అధికారులకు బాధ్యతలు కేటాయించారు. మెప్మా సిబ్బంది లబ్ధిదారులతో ఇళ్లకు సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేయించి బ్యాంకులు రుణం అందించేలా చర్యలు తీసుకోవాలి. దీనిలో భాగంగానే ఇటీవల మచిలీపట్నంలో టిడ్కో ఇళ్ల ప్రాంగణంలోనే రుణ మేళా నిర్వహించి పలువురికి ఇప్పించినా లక్ష్యం పూర్తికాని పరిస్థితి. నగరంలో 960మంది లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 117మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఇదే పరిస్థితి. జగ్గయ్యపేటలో రూ.55.96కోట్లు, మ,చిలీపట్నంలో రూ.33.84కోట్లు. తిరువూరులో రూ13.29, నూజివీడులో రూ.60.50కోట్లతో కలిపి జిల్లా వ్యాప్తంగా రూ.679 కోట్లకుపైగా రుణాలు అవసరం.
అన్ని వసతులతో ఇళ్లు
జీప్లస్త్రీ ఇళ్లను అన్ని వసతులతో లబ్ధిదారులకు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. వసతుల కల్పనకు రుణాలు అవసరం. దీనిలో భాగంగానే పట్టణాల్లో పలువురు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి రుణాలు మంజూరు చేసే ప్రక్రియ జరుగుతోంది.దీనిపై క్షేత్రస్థాయిలో సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్య సాధనకు చర్యలు తీసుకుంటున్నాం. - చిన్నోడు, ఏపీ టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!