ఇకనైనా పనులు సాగేనా..!
నగరపాలికలు, పురపాలికల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన అమృత్ పథకం పెండింగ్ బిల్లులు ఎట్టకేలకు ఇటీవల విడుదల అయ్యాయి. జిల్లాలోని పలు పురపాలికల్లో ఈ పథకం కింద చేపట్టిన పనులు గత కొంత కాలంగా గుత్తేదారులు నిలిపారు. చేసిన పనులు
ఎట్టకేలకు అమృత్ బకాయిల విడుదల
నగరపాలికలు, పురపాలికల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన అమృత్ పథకం పెండింగ్ బిల్లులు ఎట్టకేలకు ఇటీవల విడుదల అయ్యాయి. జిల్లాలోని పలు పురపాలికల్లో ఈ పథకం కింద చేపట్టిన పనులు గత కొంత కాలంగా గుత్తేదారులు నిలిపారు. చేసిన పనులు తాలూకూ బిల్లులు ప్రభుత్వం వద్ద పేరుకుపోయాయి. అప్పోసొప్పో చేసి ఖర్చు చేసినా డబ్బులు రావడం లేదని ఆపేశారు. ఈ ప్రభావం పనులపై పడడంతో ఎంతకూ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పురపాలక శాఖ పాత బకాయిల విడుదలకు ఆమోదం తెలిపింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 18 కోట్ల వరకు బిల్లులు గుత్తేదారులకు విడుదల అయ్యాయి.
నిలిచిన పనులకు మోక్షం : అమృత్ పథకం కింద తాగునీటి పథకాలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, వర్షపు నీటి మళ్లింపు పనులను జిల్లాలో చేపట్టారు. బందరు నగరంలో అమృత్ రెండో దశ కింద రూ. 21 కోట్ల స్టామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులకు కేటాయించారు. ఈ నిధులతో అంతకు ముందు అసంపూర్తిగా వదిలేసిన ఓపెన్ డ్రెయిన్ పనులు పూర్తి చేయడంతో పాటు మొత్తం 11 కి.మీ పైగా పనులు చేపట్టేందుకు వీలుగా పనులు ప్రారంభించారు. 2018లో ప్రారంభం అయిన పనులు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. కేవలం 8 కి.మీ మాత్రమే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రూ. 3 కోట్లు విడుదల అయ్యాయి. మచిలీపట్నం నగరానికి తాగునీటిని అందించే రక్షిత నీటి పథకాన్ని అమృత్ పథకం కింద చేపట్టారు. ఈ పనులు పూర్తయి ఏడాది గడిచింది. దీనికి సంబంధించి రూ. 5 కోట్ల బిల్లుకు మోక్షం కలగలేదు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 2018లోనే శంకుస్థాపన చేశారు. రూ. 16 కోట్లతో చేపట్టిన పనులు కూడా అసంపూర్తిగానే మిగిలాయి.
విజయవాడ నగరంలో ఈ పథకం కింద యూజీడీ, తాగునీటి పైపులైన్ల మార్పు, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. బల్లులు రాక నెమ్మదించాయి. ఇటీవల వీటికి సంబంధించి రూ. 3 కోట్లు వచ్చాయి. గుడివాడ పట్టణంలో తాగునీటి సరఫరా ప్రాజెక్టును 2019లో రూ.20 కోట్లతో ప్రారంభించారు. పనులు 50 శాతం మేర పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు అయిన పనులకు సంబంధించి రూ. 5.72 కోట్ల వరకు బిల్లులు మంజూరయ్యాయి. ఇక్కడే ఎస్టీపీ నిర్మాణం కూడా పురోగతి లోపించింది. ఈ పనుల బిల్లు రూ. 1.20 కోట్లు వచ్చింది.
మంత్రి దిశానిర్దేశం
పెండింగ్ బిల్లులు మంజూరు కావడంతో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, గుత్తేదారులతో సమావేశం నిర్వహించారు. గడువు దాటినా పూర్తి కాని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. చెల్లింపులు పూర్తి అయ్యాయి కాబట్టి.. వెంటనే నిలిచిన పనులను ప్రారంభించాలన్నారు. వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గుడివాడ పట్టణానికి తాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు గడువు దాటినా పూర్తికి నోచుకోలేదు. దీని వల్ల దాదాపు వేల మందికి రక్షిత నీరు అందని పరిస్థితి నెలకొంది. వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే వేసవి నాటికి పూర్తి చేయాలని మంత్రి బొత్స గడువు నిర్దేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు