మాకో మాస్టారు కావాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ‘నాడు-నేడు’, ‘అమ్మఒడి’ వంటి పథకాల పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు నిధులు వెచ్చిస్తున్నా కొన్నిచోట్ల కనీస విద్య సైతం అందని పరిస్థితి నెలకొంది. మండలంలో పేరూరు శివారు తేరగూడెం ప్రాథమిక పాఠశాల
తేరగూడెం విద్యార్థుల ఎదురుచూపు
పేరూరు (ముదినేపల్లి), న్యూస్టుడే : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ‘నాడు-నేడు’, ‘అమ్మఒడి’ వంటి పథకాల పేరుతో ప్రభుత్వం రూ.కోట్లు నిధులు వెచ్చిస్తున్నా కొన్నిచోట్ల కనీస విద్య సైతం అందని పరిస్థితి నెలకొంది. మండలంలో పేరూరు శివారు తేరగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడి కోసం నిత్యం ఎదురుచూపు తప్పడం లేదు. పక్క పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు డిప్యుటేషన్లపై వస్తారో రారో తెలియని అయోమయ పరిస్థితిలో కాలం గడుపుతున్నారు. దాదాపు నెల రోజులుగా ఈ పరిస్థితి ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ పోస్టూ లేదు
ఈ పాఠశాలను ఐదేళ్ల క్రితం మూసేశారు. దీంతో విద్యార్థులు పేరూరు లేదా గుడివాడ రూరల్ మండలం పర్నాసకు వెళ్లాల్సి వచ్చేది. దీనిపై గ్రామస్థుల అభ్యర్థన మేరకు ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలను తిరిగి తెరిచారు. ఇటీవల బదిలీల్లో ఈ పాఠశాలలో పోస్టును చూపకపోవటంతో ఉపాధ్యాయుడు లేకుండా పోయారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఒత్తిళ్ల కారణంగా నిబంధనల ప్రకారం అధికారులు డిప్యుటేషన్లు వేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కోసారి పాఠశాల తెరవకపోయినా పట్టించుకునే వారే లేరని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
కనీస సౌకర్యాలూ కరవు
పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవటంతో డిప్యుటేషన్లపై వెళ్లేందుకు ఉపాధ్యాయినులతో పాటు కొందరు ఉపాధ్యాయులు నిరాకరిస్తున్నారు. మౌలిక వసతులు లేనిచోట ఎలా విధులు నిర్వహించాలని వారు ప్రశ్నిస్తున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులతో పాటు ఇక్కడ డిప్యుటేషన్పై విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు రోజంతా అవస్థలు తప్పడం లేదు. ఈ విద్యా సంవత్సరంలోనే తిరిగి ప్రారంభించడంతో ‘నాడు-నేడు’ పథకం కింద మౌలిక వసతుల కల్పనకూ నోచుకోలేదు. అదీకాక శివారు ప్రాంతం కావడం కనీసం బస్సు, ఆటో వంటి రవాణా సౌకర్యం లేకపోవటంతో సకాలంలో అక్కడి చేరుకోవటం కష్టంగా ఉంటుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజనం వండేవారు సైతం లేకపోవటంతో పేరూరు పాఠశాల నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన దుస్థితి. పాఠశాలలో నేలంతా కుంగిపోయింది. పూర్తిస్థాయి ఉపాధ్యాయుడిని నియమించి, కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు
దీనిపై ఎంఈవో కె.నరేశ్కుమార్ను వివరణ కోరగా డిప్యుటేషన్లతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. పాఠశాలకు రవాణా సౌకర్యం లేకపోవటం, మౌలిక వసతుల కొరతతో ఉపాధ్యాయినులు అక్కడకు వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయుడి నియామకం, కనీస సౌకర్యాల కల్పన ఆవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆయన వివరించారు.
వినియోగంలో లేని మరుగుదొడ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!