సాధన చేశారు..సత్తా చాటారు
వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద కుటుంబాలకు చెందిన బాలికలు. పట్టుదల ఉంటే ప్రతిభ చాటుకోవడానికి ఏవీ అడ్డు కావని నిరూపిస్తున్నారు. గూడూరుకు చెందిన పలువురు విద్యార్థినులు ఇటీవల ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో
కబడ్డీలో రాణిస్తున్న బాలికలు
మచిలీపట్నం(గొడుగుపేట), గూడూరు, న్యూస్టుడే : వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద కుటుంబాలకు చెందిన బాలికలు. పట్టుదల ఉంటే ప్రతిభ చాటుకోవడానికి ఏవీ అడ్డు కావని నిరూపిస్తున్నారు. గూడూరుకు చెందిన పలువురు విద్యార్థినులు ఇటీవల ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు చదువుకునే పాఠశాలకు, పుట్టిన ఊరికి కూడా మంచి పేరు తీసుకువస్తున్నారు. మండల, జిల్లా స్థాయి పోటీల్లో పతకాలు దక్కించుకున్నారు. అంతేకాదు రాష్ట్రస్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు బహుమతులు సొంతం చేసుకున్నారు. వారి లక్ష్యాలు. క్రీడల్లో రాణిస్తున్న తీరు తదితర అంశాలపై కథనం.
క్రీడలంటే ఇష్టం: జి.వన్షిత
చిన్నప్పటినుంచీ క్రీడలు అంటే ఇష్టం. అందుకే ప్రాథమికస్థాయి నుంచే సాధన చేస్తున్నాను. వ్యాయామ ఉపాధ్యాయులు నా ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. తోటి విద్యార్థినులతో కబడ్డీ ఆడుతుంటే చూసి వారు నాకు శిక్షణ ఇచ్చారు. చదువుతోపాటు ఆటలకు కూడా కొంత సమయం కేటాయించి రోజూ సాధన చేయడంతో ఉపాధ్యాయులు, శిక్షకులు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. అలా మండల, జిల్లాస్థాయిలో మెరుగ్గా రాణించడంతో రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక చేశారు. కర్నూలులో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నాం. పరుగు, ఖోఖో పోటీల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను.భవిష్యత్తులో క్రీడా కోటా కింద ఉద్యోగం సంపాదించాలనేది నా కోరిక.
అనుకోకుండా ఆటలోకి: ఎస్.యశస్విని
పాఠశాలలో నాతోటి బాలికలతో కలిసి వివిధ ఆటలు ఆడినా ఖోఖోలో ఎక్కువగా ఆసక్తి ఉండేది. ఉపాధ్యాయులు వెన్నుతట్టి ప్రోత్సహించే వారు. అలా పలు పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నాను. అనుకోకుండా కబడ్డీ ఆట ప్రారంభించాను. స్నేహితులతో కలిసి ఆడడంతో పలువురితో జట్టు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. వారు ఇచ్చిన సహకారం, నిరంతర సాధనతో రాష్ట్రస్థాయి జట్టుకు అర్హత సాధించాం. జట్టులో నలుగురు మా పాఠశాలకు చెందిన వారే కావడంతో దూర ప్రాంతమైనా వెళ్లి పోటీల్లో పాల్గొన్నాం. మా గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి చదువుతున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారిణిగా ఎదగాలనేది నా లక్ష్యం.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు..
జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన బాలికలతో ఏర్పాటు చేసిన జట్టులో చోటు దక్కించుకోవడం, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి వచ్చిన క్రీడాకారిణులతో కలిసి పోటీల్లో పాల్గొనడం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం కలిగింది. గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో ఎన్సీసీ, స్కౌట్స్అండ్గైడ్స్ బృందాలు ఉన్నాయి. పలువురు ప్రముఖులు వచ్చి ఇచ్చే ఉపన్యాసాలు కూడా ధైర్యాన్ని పెంపొందించాయి. ఆ స్ఫూర్తితోనే వివిధ పోటీల్లో పాల్గొంటున్నాం. కబడ్డీతోపాటు ఖోఖోలో కూడా ప్రావీణ్యం ఉంది. అలా ఎక్కడ పోటీలు నిర్వహించినా రెండువిభాగాల్లోనూ పోటీపడుతుంటాను. రాష్ట్రస్థాయి పోటీల్లో మాజట్టు తృతీయస్థానం సాధించినా ఆస్థాయి పోటీల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. - బి.కల్యాణి మధుశ్రీ,
స్నేహితులతో కలిసి: పి.ప్రవీణ
ప్రాథమిక స్థాయి నుంచే స్నేహితులతో కలిసి వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనేదాన్ని. హైస్కూల్కు వచ్చిన తరువాత వ్యాయామ ఉపాధ్యాయులు ఖోఖో, కబడ్డీలో ప్రతిభ చాటుకుంటున్నట్లు గ్రహించి ఆ ఆటల్లో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. రోజూ సాధన చేయించడంతోపాటు మమ్మల్ని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పోటీలకు తీసుకెళ్లడంతో విజయం సాధించాలన్న సంకల్పం ఏర్పడింది. రాష్ట్రస్థాయి జట్టులో చోటుదక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించి క్రీడాకోటాలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు