ఆరోగ్య కేంద్రం... వైద్యానికి దూరం!
‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ)ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు
అరకొరగానే శస్త్రచికిత్సలు, ప్రసవాలు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పీహెచ్సీల్లో ఇదే పరిస్థితి
ఈనాడు, అమరావతి
జగ్గయ్యపేట సీహెచ్సీకి కాన్పు కోసం వచ్చిన గర్భిణులు
‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ)ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు పీహెచ్సీల్లోనే అత్యధికంగా జరుగుతుండేవి. కానీ.. గత రెండు మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పీహెచ్సీల్లో సరైన పరికరాలు, సౌకర్యాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా ఉంటుండడంతో శస్త్రచికిత్సలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. పీహెచ్సీలకు వచ్చే కేసుల్లో చాలావాటిని విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రులకు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 90 పీహెచ్సీలుండగా.. వాటిలో ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 80వరకు ఉన్నాయి. నూజివీడు ప్రాంతంలో ఉన్నవి ఏలూరులో కలిసిపోయాయి. చాలా పీహెచ్సీల్లో సరైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వచ్చిన వారిని వచ్చినట్టే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిపోమంటూ సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు కూడా గుడివాడ ఏరియా ఆసుపత్రి లేదంటే దగ్గరిలో ఉన్న సీహెచ్సీలకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అందుకే.. సీహెచ్సీల్లో మాత్రమే ప్రస్తుతం ప్రసవాలు, కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 11 సీహెచ్సీలున్నాయి. వీటిలో మాత్రం శస్త్రచికిత్సలు ప్రస్తుతం చేస్తున్నారు. తాజాగా జగ్గయ్యపేట సీహెచ్సీలో అన్నీ కలిపి.. మార్చిలో 58, ఏప్రిల్లో 46 శస్త్రచికిత్సలు చేశారు. పీహెచ్సీల్లోనూ ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మేలు జరుగుతుంది.
క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉన్నా..
చాలాచోట్ల ఒక్కో పీహెచ్సీకి ఇద్దరేసి వైద్యులు ఉన్నారు. ఉదయం ఓపీ చూడాలి. మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాలి. స్థానికంగా ఉండే గర్భిణులు, రోగులకు క్షేత్రస్థాయిలోనికి వెళ్లి సేవలు అందించాలి. ప్రస్తుతం చాలావరకూ వైద్యులు ఎవరూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదు.
ఆసక్తి ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వాలి..
రెండు జిల్లాల్లో 15 నుంచి 20మంది వరకూ సీనియర్ వైద్యులున్నారు. వీరున్నచోట కూడా ప్రస్తుతం శస్త్రచికిత్సలు అరకొరగానే చేస్తున్నారు. వైద్య పరికరాలు సరిగా లేవని చెబుతున్నారు. మిగతా అన్నిచోట్లా జూనియర్ వైద్యులున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న కనీసం ఓ 30 నుంచి 40మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తే.. శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుంటుంది. మండలానికి కనీసం ఓ కేంద్రంలోనైనా ఆపరేషన్ థియేటర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోనికి తేవాలి.
పదేళ్ల కిందట ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న పీహెచ్సీల్లో ఆపరేషన్ థియేటర్లను రూ.లక్షలు ఖర్చుపెట్టి సిద్ధం చేయించారు. ఒక్కో పీహెచ్సీకి రూ.3 లక్షల వరకూ ఖర్చుపెట్టి బాగు చేయించారు. దాతలు, ప్రభుత్వ నిధులతో ప్రతి మండలానికి ఒకటి రెండుచోట్ల ఆపరేషన్ థియేటర్లను సిద్ధం చేయించారు. వైద్యులు, అధికారులు బదిలీలపై వెళ్లిపోవడంతో క్రమంగా అవి పాడైపోయాయి. వాటిని మళ్లీ పునరుద్ధరించి ఇక్కడ శస్త్రచికిత్సలు తప్పనిసరిగా చేసేలా అధికారులు ఏర్పాటు చేస్తే గ్రామీణులకు ప్రయోజనకరం.
24 గంటలూ పనిచేయాల్సి ఉండగా..
పీహెచ్సీలన్నీ ప్రస్తుతం 24గంటలూ పనిచేయాల్సి ఉంది. ఏ సమయంలో రోగులు వచ్చినా వైద్య సేవలు అందించాలి. కానీ.. 90శాతం పీహెచ్సీల్లో రాత్రి 9గంటల తర్వాత వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళ రోగులు వచ్చినా చూసేందుకు ఎవరూ ఉండడం లేదు. కొన్నిచోట్ల సిబ్బంది ఉంటున్నా.. రాత్రి వేళ వచ్చే వారిని విజయవాడ, మచిలీపట్నం తీసుకెళ్లాలంటూ సూచించడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గత రెండేళ్లలో ఇలా..
(2022 ఫిబ్రవరి వరకు)
90 పీహెచ్సీల్లో ప్రసవాలు : 1067
12 సీహెచ్సీల్లో ప్రసవాలు : 4348
ఏరియా ఆసుపత్రుల్లో : 4999
విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రుల్లో : 26,592
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు