బయట ఉంటే అంతే
అసలే పెరిగిన విద్యుత్తు బిల్లుల భారంతో అన్ని వర్గాలు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎత్తేస్తే.. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వర్గాలకు అండగా
ఎస్సీ, ఎస్టీ విద్యుత్తు వినియోగదారులకు షాక్
ఈనాడు - అమరావతి
అసలే పెరిగిన విద్యుత్తు బిల్లుల భారంతో అన్ని వర్గాలు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎత్తేస్తే.. వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ వర్గాలకు అండగా ఉంటున్నామని చెబుతున్న ప్రభుత్వం.. వారికి విద్యుత్తు వినియోగంపై సబ్సిడీని మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించుకుంటే డబ్బు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడో రెండేళ్ల క్రితం జారీ చేసిన ఉత్తర్వుకు అధికారులు పదును పెడుతున్నారు. ఆంక్షల పేరుతో రాయితీని కుదించేందుకు చకచకా పావులు కదుపుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రతినెలా లభించే విద్యుత్తు రాయితీ ప్రభుత్వం భరిస్తుంది. వారు వినియోగించుకున్న మొత్తాన్ని ప్రభుత్వం డిస్కమ్లకు సర్దుబాటు చేస్తుంది. ఆవాసాలు, కాలనీలు, తండాల్లో నివాసం ఉండే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకే రాయితీకి అర్హులంటూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఎక్కడా ఇది బయటకు పొక్కలేదు. కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు కేవలం వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యుత్తు శాఖ అధికారులకు అందజేస్తే రాయితీ వర్తించేది. కొత్త నిబంధనల కారణంగా కాలనీలు, తండాల్లో నివిసించే వారే అర్హులు. వేరే చోట నివాసం ఉంటూ 200 యూనిట్లలోపు వినియోగించుకున్నా సబ్సిడీ వర్తించదు. బిల్లును అందరిలా చెల్లించాల్సిందే. దీనిపై ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీల్లో సరైన వసతి లేక, ఇతర ప్రాంతంలో చిన్న ఇళ్లు కట్టుకున్నా.. అనర్హులుగా గుర్తిస్తారు. సెంట్రల్ డిస్కమ్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో సుమారు 6.38 లక్షల మంది పైగా రాయితీ కారణంగా ప్రయోజనం పొందుతున్నారు. తాజా నిర్ణయం వల్ల చాలా మందిని అనర్హుల జాబితాలో చేర్చే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భారాన్ని దించుకునేందుకే ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
రికవరీపై ఆందోళన
ప్రభుత్వం ఇప్పటికే ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సంబంధించి ఆధార్తో సహా అన్ని వివరాలను సేకరించి సాంఘిక సంక్షేమ శాఖలోని వివరాలతో ఆరు దశల వడపోత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ఆధార్తో అనుసంధానమైన చాలా ఇళ్లు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినవి కాదని తేలిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన రాయితీని తిరిగి రాబట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్యుత్తు సహాయకులతో సర్వే చేయిస్తున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తండాల్లో నివాసం ఉండేవారికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఉచిత విద్యుత్తును వీరికే వర్తింపజేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వంతెనలు కూలుతున్నా.. ప్రాణాలు పోతున్నా.. కళ్లకు గంతలేనా..
[ 20-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారధులు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కీలకమైన వంతెనల జీవితకాలం ముగిసినా నిధుల కొరతతో కొత్తవి నిర్మించడం లేదు. -
అ‘తీగ’తిలేని ‘మార్గం’
[ 20-04-2024]
ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. -
కూలేదాకా.. కళ్లప్పగిస్తారా!
[ 20-04-2024]
బీటలు వారిన స్తంభాలు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు, వంతెనలపైనే గోతులు.. ఇలా శిథిలావస్థకు చేరిన వారథులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి -
ఉడకని జీడిపప్పు
[ 20-04-2024]
వేటపాలెం అంటేనే జీడిపప్పు పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యాపారులు ఒకప్పుడు స్థానికంగా దొరికే జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని కాల్చి పప్పుగా తయారు చేసి విక్రయించేవారు. -
నేరచరిత్ర లేని సచ్ఛీలుడు తెన్నేటి
[ 20-04-2024]
బాపట్ల లోక్సభ స్థానం తెదేపా ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తనకు రూ.15.93 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో ప్రకటించారు -
మందులో ముంచేసి.. పీల్చి పిప్పి చేసి..
[ 20-04-2024]
రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధం విధిస్తాం. మూడు విడతల్లో మద్యం దుకాణాలు తగ్గించుకుంటూ వెళ్లి పూర్తిగా ఎత్తేస్తాం. మందు ముట్టుకోవాలంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచుతాం. మద్యపాన నిషేధం చేశాకే 2024లో ఓట్లు అడగడానికి వస్తాను. -
ఎంపీ 1, ఎమ్మెల్యేకు 19 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజున గుంటూరు పార్లమెంట్ స్థానానికి కిలారి వెంకటరోశయ్య వైకాపా తరఫున నామినేషన్ను దాఖలు చేశారు -
కొనసాగుతున్న ఒత్తిళ్లతో వాలంటీర్ల రాజీనామా
[ 20-04-2024]
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో 20 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి పూర్ణచంద్రరావు తెలిపారు. -
అట్టహాసంగా శ్రావణ్కుమార్ నామినేషన్
[ 20-04-2024]
తాడికొండ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం తాడికొండ ఆర్వో గంగరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు -
ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
[ 20-04-2024]
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. -
ఏళ్లుగా ఉద్యోగులకు శిక్షే
[ 20-04-2024]
అనేక సంస్కరణలు తీసుకొచ్చామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే సీఎం జగన్ మాటలు ఎండమావులుగానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు సమగ్ర శిక్షాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంటీఎస్, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని.. పలు హామీలు ఇచ్చి వాటిని గాలికొదిలేశారు. -
తాగునీరివ్వకపోతే బతికేదెలా..?
[ 20-04-2024]
తమకు తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని ప్రత్తిపాడులోని మహబూబ్ నగర్ కాలనీ వాసులు శుక్రవారం గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్ఎం మృతి
[ 20-04-2024]
విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్ఎం (జూనియర్ లైన్మెన్) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్ (27) ఇదే గ్రామంలో జేఎల్ఎంగా పనిచేస్తున్నారు. -
కలగా మినీ రైతుబజార్లు
[ 20-04-2024]
నాడు అలా...గత ప్రభుత్వంలో వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు 2018లో పొన్నూరు పట్టణం నిడుబ్రోలు రైల్వేస్టేషన్కు వెళ్లే మార్గంలో రైతుబజార్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ రైతుబజార్లో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. -
ఓటు హక్కు వినియోగానికి కార్మికులకు సెలవు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరగనున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కార్మికులకు సెలవు ప్రకటించినట్లు మూడో జోన్ కార్మిక శాఖ ఇన్ఛార్జి సంయుక్త కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు -
మద్యం మత్తు.. కుటుంబాలు చిత్తు
[ 20-04-2024]
గత నెల 18వ తేదీన తెనాలి మున్సిపల్ కార్యాలయం చెంతనే నిర్మాణంలో ఉన్న మార్కెట్ భవంతిలో రవికిరణ్ (37) అనే వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కారణం మద్యం మత్తు. మద్యం తాగి చెంతనే దోమల కాయిల్ వెలిగించుకుని నిద్రపోయిన అభాగ్యుడు కాయిల్ దుప్పటికి తగిలి మంటలు చెలరేగినా మత్తు వల్ల లేవలేక కాలిపోయాడు
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు