కృష్ణా డెల్టాకు జూన్ 10 నుంచి సాగు నీరు
కృష్ణా డెల్టాలో మూడు పంటలకు అవకాశం కల్పించేలా జూన్ 10 నుంచి సాగునీరు విడుదల చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ చెప్పారు. కలెక్టరేట్
నీటిపారుదల సలహామండలి సమావేశంలో మంత్రి జోగి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్. వేదికపై కలెక్టర్ రంజిత్బాషా,
జేసీ మహేష్కుమార్, ఎమ్మెల్యే నాని, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: కృష్ణా డెల్టాలో మూడు పంటలకు అవకాశం కల్పించేలా జూన్ 10 నుంచి సాగునీరు విడుదల చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ చెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ రంజిత్బాషా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులిచింతల రిజర్వాయర్లో 32.75 టీఎంసీలు, నాగార్జునసార్ ప్రాజెక్టు కింద 184 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టులో 35.81 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. పులిచింతల రిజర్వాయర్ నుంచి జూన్ 10న నీరు విడుదల చేస్తారన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు మొత్తం 146 టీఎంసీలు, తాగునీటి కోసం 4.18 టీఎంసీల అవసరం ఉంటుందన్నారు. 2022-23 సంవత్సరానికి ప్రధాన కాల్వల కింద 5.70 లక్షల ఎకరాలు ఆయకట్టు నిర్దేశించుకోగా అందులో 5.25 లక్షల ఎకరాలకు జూన్ 10 నుంచే సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఆపరేషన్ అండ్ మెయింటెన్స్(ఓ అండ్ ఎం) కింద 2021-22 సంవత్సరంలో చేపట్టిన పనులు సత్వరం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మరో రూ.48 కోట్ల పనులకు సల్పకాలిక టెండర్లు పిలిచి వెంటనే పనులు పూర్తి చేయాలని స్పష్టంచేశారు. ప్రాజెక్టు కమిటీ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ, నీటి వినియోగదారుల సంఘ పరిధిలో రూ.87 కోట్లతో కాడా కమిటీ ఆమోదించిన తూడు, గుర్రపుడెక్క, పూడికతీత, గేట్ల మరమ్మతులు వంటి పనులు పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు. సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ ఇరిగేషన్ పనులకు ఉద్దేశపూర్వకంగా కొందరు టెండరు వేసి పనులు చేయకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అటువంటి వారికి సహకరిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ రంజిత్బాషా, జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారిక, కేడీసీసీబీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, జేసీ మహేష్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ గోపాల్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
రైతుకు ఏ ఇబ్బందీ రానీయకూడదు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న ప్రభుత్వ సిద్ధాంతానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని మంత్రి జోగి స్పష్టం చేశారు. వ్యవసాయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో ఆర్బీకేల ద్వారా ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలు పంపిణీ చేస్తారన్నారు. రైతులు, మిల్లర్లు బాగుండాలని, ఎవరైనా మిల్లర్లు రైతులను నష్ట పెట్టాలని చూస్తే క్షమించేది లేదన్నారు. శానసభ్యుడు పేర్ని మాట్లాడుతూ ఈ-క్రాప్ నమోదు విషయంలో వ్యవసాయశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది రైతులు ఇబ్బందిపడాల్సి వచ్చిందనీ, రైతులకు ప్రత్యక్షంగా రశీదు ఇవ్వడం లేదని, వేసిన పంట ఒకటైతే నమోదు మరోటి చేశారని, ప్రభుత్వం వద్దన్న విత్తనాలు సైతం సాగుచేస్తే వాటిని మరోరకంగా నమోదు చేశారని చెబుతూ వ్యవసాయశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందిస్తూ ఈ-క్రాప్ నమోదు చేశాక తప్పనిసరిగా రైతుకు రశీదు ఇచ్చి, దాని కాపీని కార్యాలయంలో భద్రపర్చాలని చెప్పారు. రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణాజీరావు, సలహా మండలి అధ్యక్షులు జన్ను రాఘవరావు, మండలి సభ్యుడు నాగేశ్వరరావు పలు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సలహామండలి సభ్యులు రామచంద్రరావు, పెరుమాళ్లు, శ్రీనివాసరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గులకరాయికి.. రాజకీయ రంగు!
[ 19-04-2024]
ముఖ్యమంత్రి జగన్పై గులకరాయి కేసు.. కుట్ర కేసుగా మారుతోంది. రాజకీయ రంగు పులుముకునేందుకు రంగం సిద్ధమైంది. తెదేపా నేతలు అనుమానించినట్లే.. మరికొందరు కీలక నేతలను ఇరికించేందుకు ఖాళీ వదిలినట్లు తెలిసింది. -
తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
[ 19-04-2024]
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. -
అభివృద్ధి పరుగులు పెట్టిస్తా: సుజనా
[ 19-04-2024]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రధాని మోదీ, చంద్రబాబు సహకారంతో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని భాజపా పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బాలశౌరి
[ 19-04-2024]
వైకాపా అరాచక పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కూటమి బందరు ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. -
ఒడిసిపడతానని.. విడిచిపెడతావేం?
[ 19-04-2024]
సీఎం జగన్ మాటలకు అర్థాలే వేరు. ఆయన చెప్పారంటే... అసలు చేయరని అర్థం. దీనికి సజీవ సాక్ష్యం కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన ప్రతిపాదించిన రెండు బ్యారేజీల నిర్మాణం. కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాణావసరమైన వీటి గురించి జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. -
నాలుగో సింహం నలిగిపోతోంది
[ 19-04-2024]
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. -
తెదేపా అభ్యర్థుల నామ పత్రాల దాఖలు
[ 19-04-2024]
గన్నవరం నియోజకవర్గంలో జనసేన, భాజపా మద్దతుతో తెదేపా బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గురువారం ఉదయం 11.15 గంటలకు తొలి విడత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి జేసీ గీతాంజలిశర్మకు సమర్పించారు. -
లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం
[ 19-04-2024]
చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు. -
బావిలో పడిన యువకుడు
[ 19-04-2024]
బాపులపాడు మండలం బొమ్ములూరులో ఓ యువకుడు బావిలో పడిన ఘటన గురువారం రాత్రి కలకలం రేపింది. ఇదే గ్రామానికి చెందిన పవన్ స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఉన్న పొలంలోని బావిలో పడిపోయాడు. -
చెత్తకు నిప్పు.. గ్యాస్ పైప్లైన్కు మంటలు
[ 19-04-2024]
ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెత్త కాలుస్తుండగా..గ్యాస్ పైప్లైన్ లుకింగ్ పాయింట్కు అంటుకొని భీతావహ పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు మంటల్ని అదుపు చేశారు. -
ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
[ 19-04-2024]
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. -
ఆ భోజనం మా కొద్దు
[ 19-04-2024]
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. -
ఇన్నాళ్లూ.. కాలయాపన
[ 19-04-2024]
పేరుకే అది వంద పడకల ఆసుపత్రి.. వైద్యం మాత్రం ‘ప్రాథమిక’ స్థాయిలోనే అందుతోంది. వైద్యశాలను ఉన్నతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే సోదరులు ప్రజలను మభ్యపెడుతున్నారు. స్థాయి పెంపు కాగితాలకే పరిమితమైంది. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 19-04-2024]
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. -
సుద్దగా అన్నం.. అందుకే తినం
[ 19-04-2024]
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.