ఉచిత బియ్యం ఊసేలేదు..!
పేదల కోసం కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈనెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కన్పించడంలేదు. గడచిన నెలలోనూ ఇవ్వకుండా నిలిపివేసిన కోటాను మే నెలలో
12 లక్షల కార్డుదారుల ఎదురుచూపులు
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: పేదల కోసం కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం ఈనెల కూడా లబ్ధిదారులకు అందే పరిస్థితి కన్పించడంలేదు. గడచిన నెలలోనూ ఇవ్వకుండా నిలిపివేసిన కోటాను మే నెలలో పంపిణీ చేస్తారన్న ప్రచారం సాగినా ఆచరణకు నోచుకోవడంలేదు. దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అసలు బియ్యం ఇస్తారా ఇవ్వరా అనే అనుమానం ఉమ్మడి జిల్లాల్లో 12.20 లక్షల మంది కార్డుదారుల్లో వ్యక్తమవుతోంది.
కొవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద వర్గాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ప్రధాన మంత్రి గరీబ్ యోజన ద్వారా ఉచిత బియ్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చితో ఉచిత పథకం ముగియాల్సి ఉన్నా కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. కిలో రూపాయి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న రేషన్బియ్యంతో పాటు కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని కూడా ప్రారంభంలో ఎండీయూ వాహనాల ద్వారా అందజేశారు. ఉచిత బియ్యం వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తున్నా ప్రజల్లో అందుకు తగ్గ ప్రచారం రావడం లేదన్న కారణంతో కొద్ది నెలలుగా ఉచిత బియ్యాన్ని ఏండీయూ వాహనాల ద్వారా కాకుండా రేషన్డిపోల నుంచే ఇవ్వాలని సూచించారు. అప్పటి నుంచి ప్రతి నెలా ముందు రెండు వారాల పాటు రేషన్ పంపిణీ పూర్తిచేసి మూడో వారం ప్రారంభం నుంచి చౌకడిపోల ద్వారా ఉచిత బియ్యాన్ని ఇస్తున్నారు. గడచిన మార్చి వరకూ ఎటువంటి అవాంతరం లేకుండా పంపిణీ సజావుగానే సాగినా ఏప్రిల్ నెల ఉచిత కోటాను ఇవ్వలేదు.
విభజన నేపథ్యంలో..
జిల్లాల విభజన నేపధ్యంలో ఏప్రిల్ నెలలో సాంకేతిక కారణాలతో రేషన్ పంపిణీలో కొన్ని రోజులు ఆలస్యం అయ్యిందని అధికారులు చెప్పినా ఆ నెలకు సంబంధించి ఉచిత బియ్యాన్ని మాత్రం ఇవ్వలేదు. జిల్లాలో ఉన్న బియ్యం కార్డు దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సభ్యునికి 5 కిలోల బియ్యం, సబ్సిడీ ధరపై కందిపప్పు వంటి నిత్యావసరాలను అందజేస్తోంది. ఏప్రిల్, మే నెలకు సంబంధించి కార్డుదారుల కోసం నెలకు దాదాపు 7,220 మెట్రిక్ టన్నుల చొప్పున బియ్యాన్ని డిపోలకు విడుదల చేసి పంపిణీ కూడా పూర్తి చేశారు. కేంద్రం ఉచితంగా ఇచ్చే బియ్యం కూడా అంతే పరిమాణంలో ఇవ్వాల్సి ఉంది. నెలలో మూడో వారం గడిచిపోతున్నా ఉచిత బియ్యం పంపిణీ ఊసే లేకపోవడంతో కార్డుదారులు రోజూ డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
నిల్వలు లేవు...
గత నెలతో కలిపి సుమారు 25వేలకు పైగా మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఆ మేరకు పౌరసరఫరాల శాఖ వద్ద నిల్వలు లేనట్లు తెలుస్తోంది. తగు నిల్వలు లేనప్పుడు కేంద్ర అనుమతితో ఎఫ్సీఐ వద్ద రాష్ట్రం బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తే ఆ మొత్తాన్ని కేంద్రం తిరిగి రాష్ట్రానికి చెల్లిస్తుంది. కారణాలు ఏవైనా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇండెంట్ కూడా పెట్టలేదని తెలుస్తోంది. పంపిణీ చేయాల్సిన బియ్యం నిల్వ కేంద్రాలు కనీసం పది రోజుల ముందు చేరితే అక్కడ నుంచి డీలర్లకు వచ్చాక కార్డుదారులకు అందజేయాలి. మిగిలిన పది పన్నెండు రోజుల్లో ఇది సాధ్యపడే విషయం కాదు కాబట్టి ఈనెలా ఉచిత బియ్యం లేనట్టే అని కొందరు డిపో నిర్వాహకులు చెపుతున్నారు.
ఎవరికి వారే...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారే అన్నట్టుగా ఉండడంతో ఒక నెల సరఫరా నిలిచిపోగా ఈనెల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం కార్యక్రమాన్ని తరచూ వివిధ ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్న భాజపా నాయకులతో పాటు ఇతర విపక్ష నాయకులు సైతం ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇంకా నాలుగు నెలల పాటు ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యంపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న అనుమానం కార్డుదారులను పీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితిపై జిల్లా పౌరసఫరాలశాఖ అధికారిణి పార్వతి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు
[ 28-03-2024]
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు 82 రోజులకు గాను లెక్కించారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
[ 28-03-2024]
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
అమ్మతోడు.. అడ్డగోలేచూడు!
[ 28-03-2024]
‘‘విజయవాడ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన చుండూరు వెంకటరెడ్డి (సి.వి.రెడ్డి) ఛారిటీస్ స్థలం, భవనాలను అన్యాక్రాంతం చేసేలా అడుగులు పడుతున్నాయి. -
కోడ్ కొండెక్కి.. అక్రమంగా రోడ్డెక్కి
[ 28-03-2024]
కోడ్ వచ్చి.. 10 రోజులైనా కళ్లెం పడనేలేదు. టిప్పర్లు తిరుగుతూనే ఉన్నాయి. రాత్రుళ్లు తవ్వుతూనే ఉన్నారు. అడిగితే తీవ్ర బెదిరింపులు. చిన్నాచితక నాయకులు ఆపినా.. బడా నేతలు తవ్వేస్తున్నారు. -
పశ్చిమ బరిలో సుజనా
[ 28-03-2024]
తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పశ్చిమ సీటును పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి అవకాశం దక్కింది. భాజపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. -
నిజం గెలవాలి.. రాష్ట్రం వెలగాలి
[ 28-03-2024]
నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం సాయంత్రం హనుమాన్జంక్షన్, బిళ్లనపల్లిలో పర్యటించారు. -
ప్రలోభాలు అరికట్టేందుకు ముమ్మర తనిఖీలు
[ 28-03-2024]
జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా చేసి మద్యం, నగదు, కానుకలను పట్టుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని ఎన్నికల అధికారి రాజబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేశారు. -
పార్టీ కోసం పనిచేయాల్సిందే.. ఓటర్లను మభ్యపెట్టాల్సిందే!
[ 28-03-2024]
ప్రతి ఓటరు నాడి పసిగట్టి లోబర్చుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయాలని వైకాపా నాయకులు వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఎర్రకట్ట విస్తరణ ఎప్పుడో?
[ 28-03-2024]
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నగరంలో రహదార్లు మాత్రం విస్తరణకు నోచుకోలేదు. వందలాది వాహనాల రాకపోకలతో ఎర్రకట్ట ప్రమాదాలకు నెలవుగా మారింది. -
రైల్వే సరకు రవాణాలో రికార్డు ఆదాయం
[ 28-03-2024]
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సరకు రవాణాలో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా ఈ ఘనత సాధించింది. -
అయిదేళ్లలో రాష్ట్రానికి పెట్టుబడులేవీ?
[ 28-03-2024]
రాష్ట్రానికి వైకాపా ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
[ 28-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామీణ మండలం దామూలూరు శివారు పంట కాలువ 19న గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. -
సీఎం జగన్ ఎగ్గొట్టిన హామీలు 85% : నెట్టెం
[ 28-03-2024]
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన పార్టీనీ చిత్తుగా ఎందుకు ఓడించాలో చెప్పడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని తెదేపా జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. -
బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు
[ 28-03-2024]
బీమా సొమ్ము చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కమిషన్ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం.. -
అయిదుగురు బుక్ కీపర్లపై వేటు
[ 28-03-2024]
కృత్తివెన్ను మండలం నీలిపూడిలో ఈ నెల 25న వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయిదుగురు వెలుగు బుక్ కీపర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గగుడి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు
[ 28-03-2024]
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో 25 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో బుధవారం లెక్కించగా.. రూ.3,78,72,537 ఆదాయం వచ్చింది. -
కృష్ణా పూర్వ డీపీవో ఉద్యోగం నుంచి తొలగింపు
[ 28-03-2024]
కృష్ణా జిల్లా పూర్వ పంచాయతీ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా ఉన్న సీహెచ్ సుబ్రహ్మణ్యంను పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ..
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు