logo

గుడివాడ ఆర్‌ఐ అరవింద్‌ గుడ్లవల్లేరుకు బదిలీ

మట్టి అక్రమ తవ్వకాలను ఆపించడానికి యత్నించి వైకాపా నాయకుల దాడికి గురైన గుడివాడ ఆర్‌ఐ జాస్తి అరవింద్‌ను బదిలీ చేశారు. అరవింద్‌ను గుడ్లవల్లేరుకు బదిలీ చేస్తూ

Published : 20 May 2022 06:05 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: మట్టి అక్రమ తవ్వకాలను ఆపించడానికి యత్నించి వైకాపా నాయకుల దాడికి గురైన గుడివాడ ఆర్‌ఐ జాస్తి అరవింద్‌ను బదిలీ చేశారు. అరవింద్‌ను గుడ్లవల్లేరుకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 21 అర్ధరాత్రి గుడివాడ మండలం మోటూరు గ్రామంలో మట్టిమాఫియా చేతుల్లో దాడికి గురైన అరవింద్‌ ఈ నెల 8 వరకూ సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల ఆయన్ను గుడ్లవల్లేరుకు బదిలీ చేసినట్లు సమాచారం. అయితే అరవింద్‌ ఇంకా రిలీవ్‌ కాలేదు. ఒకటి,రెండు రోజుల్లో గుడ్లవల్లేరులో విధుల్లో చేరే అవకాశం ఉంది. దీనిపై అరవింద్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా బదిలీ వాస్తవమేనని గురువారం తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని