logo

పేదల కోసం బాబు ఎకరమైనా కొన్నారా? : కొడాలి

గుడివాడ పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కూడా కొనలేదని, ఒకవేళ కొన్నారని నిరూపిస్తే ఎన్నికల్లో ఇక పోటీ చేయనని ఎమ్మెల్యే కొడాలి నాని

Published : 20 May 2022 06:05 IST

నెహ్రూచౌక్‌(గుడివాడ), న్యూస్‌టుడే: గుడివాడ పట్టణంలో పేదల ఇళ్ల స్థలాల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కూడా కొనలేదని, ఒకవేళ కొన్నారని నిరూపిస్తే ఎన్నికల్లో ఇక పోటీ చేయనని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ పట్టణం 28వ వార్డులో గురువారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత రూ. 88 లక్షలతో చేపట్టిన నూతన డ్రైనేజీ, చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా జగన్‌ హయాంలోనే పట్టణం అభివృద్ధి జరుగుతుందన్నారు. పట్టణాభివృద్ధికి సీఎం రూ. 50 కోట్లు మంజూరు చేశారన్నారు. రూ. 10 కోట్లతో న్యూకాలనీలైన ఇంద్రానగ వాంబేకాలనీలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌కుమార్‌, వైకాపా నాయకులు కొర్నిపాటి గణపతి, బూసి ప్రకాశరావు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని