logo

గర్భిణిపై భర్త దాడి

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాలుగు నెలల గర్భిణి అయిన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చిన సంఘటన గుడివాడ మండలం గంగాధరపురంలో

Published : 20 May 2022 06:05 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నాలుగు నెలల గర్భిణి అయిన భార్యపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపర్చిన సంఘటన గుడివాడ మండలం గంగాధరపురంలో చోటుచేసుకుందని గుడివాడ తాలూకా పోలీసులు తెలిపారు. స్మైలీ అనే యువతి గుడివాడ పట్టణానికి చెందిన మేడేపల్లి అరుణ్‌ కుమార్‌ను ప్రేమించి 2021లో వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా తరచూ కట్నం కోసం ఆమెను భర్త అరుణ్‌ కుమార్‌ వేధిస్తున్నాడు. మార్చి నెలలో స్మైలీని కొట్టి పుట్టింటికి పంపేశాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న ఆమెపై బుధవారం రాత్రి అరుణ్‌ కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు రాగా అతను పరారయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ వైవీవీ సత్యానారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని