రిజిస్ట్రేషన్లలో సవరణలు సరళీకృతం
భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం లేక వేలాదిమంది ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం దస్తావేజులో ఉన్న చిన్న చిన్న తప్పుల కారణంగా బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందలేక అవస్థలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం లేక వేలాదిమంది ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. కేవలం దస్తావేజులో ఉన్న చిన్న చిన్న తప్పుల కారణంగా బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందలేక అవస్థలు పడుతున్న విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు రిజిస్ట్రేషన్లలో తప్పుల సవరణను సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ చేపట్టింది.
పొలాలు, ఇళ్లు ఇలా ఏది కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ తప్పని సరి. అలా రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తయారు చేసే దస్తావేజులో వివరాలు నమోదులో ఒకోసారి తప్పులు దొర్లుతుంటాయి. సరిహద్దులు, భూమి విస్తీర్ణం, సర్వేసంఖ్యలు, క్రయ, విక్రయదారుల మధ్య జరిగిన ఒప్పంద తేదీలు.. వీటిలో ఎలాంటి తప్పుదొర్లినా సవరించుకోవడానికి అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. దస్తావేజును తనఖా పెట్టి బ్యాంకు రుణాలు పొందాలనుకున్నా పరిశీలనలో దొర్లిన తప్పుల కారణంగా బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు. తప్పులు సవరిస్తేనే తదుపరి చర్యలు ఉంటాయంటూ వెనక్కి తిప్పి పంపుతున్నారు.మళ్లీ సవరించుకోవాలంటే భూమిని అమ్మిన వారు రాకపోవడం, ఒక వేళ వచ్చినా మళ్లీ అదనంగా డబ్బులు అడగడం, కొందరు విదేశాల్లో ఉండటం ఇలా వివిధ కారణాలతో తప్పులు సవరించుకోలేక జిల్లాలో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏటా 10 నుంచి 20వేల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అవనిగడ్డ, చల్లపల్లి, గుడివాడ, మొవ్వ, పామర్రు, పెడన, కవుతరం ఇలా జిల్లాలో 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలిపి సగటున 70వేల వరకు వివిధ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో తప్పుల సవరణకు ఎదురు చూస్తున్నవారు వేలసంఖ్యలో ఉన్నారు.
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
వ్యక్తిగత అఫిడవిట్తో..
భూములకు సంబంధించిన సర్వేసంఖ్య, సరిహద్దులు, తేదీల్లో సహా కొన్ని పొరపాట్లు రిజిస్ట్రేషన్ పత్రంలో నమోదైతే వాటిని వ్యక్తిగత అఫిడవిట్తో సవరించుకుని కొత్త రిజిస్ట్రేషన్ పత్రం పొందడానికి అవకాశం కల్పించారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం అనేకమందికి ఊరట లభించింది. ఎన్నో ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసిన విక్రయదారులు అందుబాటులో లేకపోయినా, మరణించినా లేక వారి చిరునామా తెలియకపోయినా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భూమి కొనుగోలు దారులే దొర్లిన తప్పులు, వాస్తవ వివరాలు తెలియజేస్తూ తగు విధంగా అఫిడవిట్ సమర్పిస్తే చాలు ఆమేరకు రిజిస్ట్రేషన్శాఖ పరిశీలించి రిజిస్ట్రేషన్ పత్రాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేసి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాన్ని జారీ చేస్తుంది. పాత దస్తావేజుల్లో తప్పులను సవరించుకోవడంతోపాటు హద్దులు, స్థల విస్తీర్ణంలోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అసలు భూమి విక్రయించిన వ్యక్తి లేకుండానే సవరణలు చేసుకోవడానికి మార్గం సుగమమయ్యింది. నిర్దేశించిన అంశాల వరకు మాత్రమే సవరించుకోవాలి. ఇదే అవకాశంగా భావించి ఎవరైనా ఇష్టానుసారంగా సర్వే సంఖ్యలు మార్చేసి అవకతవకలకు పాల్పడితే మాత్రం చట్టపర చర్యలు తీసుకుంటారు. దానికి రిజిస్ట్రార్లే బాధ్యత వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూవివాదాలు ఎక్కువగా ఉన్న సమయంలో వెలువడిన ఈ ఉత్తర్వులు బాధితులకు కొంత ఊరట ఇస్తుంది.
వినియోగించుకోవాలి: ఉపేంద్రరావు, జిల్లా రిజిస్ట్రార్
రిజిస్ట్రేషన్లలో జరిగిన తప్పులను సవరించుకోవడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భూమి విక్రయించినవారు అందుబాటులో లేక, ఆ వ్యక్తి మరణిస్తే వారసులు ఎక్కడున్నారో తెలియక అవస్థలు పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇది మంచి అవకాశం. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఎక్కువగా భూమి విస్తీర్ణం సమస్యలతో సవరణలకోసం తిరుగుతున్నారు. దస్తావేజులో తక్కువగా ఉంటే క్షేత్రస్థాయిలో విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివన్నీ సంబంధిత వ్యక్తి వాస్తవిక పత్రాలు అందించి తనే సవరించుకోవచ్చు. దీనిపై అవగాహన కల్పించాలని జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
[ 24-04-2024]
‘‘పార్టీలోనే ఉండాలని డబ్బులిస్తున్నారు.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రాధాన్య పోస్టులని ఆశ చూపుతున్నారు.. చివరకు బెదిరిస్తున్నారు. -
విజయవాడ రైల్వేస్టేషన్లో రూ.20కే నాణ్యమైన భోజనం
[ 24-04-2024]
వేసవి రైలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఐఆర్సీటీసీతో కలిసి తక్కువ ధరకే నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ఎకానమీ మీల్స్ పేరుతో విజయవాడ రైల్వే అధికారులు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. -
అంటకాగితే.. అంతే రాణా..!
[ 24-04-2024]
అధికార వైకాపాతో అంటకాగుతూ.. ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా వేధిస్తూ, అకారణంగా వారిపై కేసులు నమోదు చేసిన విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణాపై బదిలీ వేటు పడింది. -
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా
[ 24-04-2024]
విజయవాడ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు కార్లు, స్థలాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు స్వాహా చేసిన కేటుగాడిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. -
జగన్ షాకులు.. జనం కేకలు!
[ 24-04-2024]
విద్యుత్తు సర్దుబాటు ఛార్జీల రూపంలో జగన్ వేసిన దొంగ దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. పేరుకు ఛార్జీలు పెంచలేదంటూనే.. దొడ్డిదారిన వడ్డిస్తున్న ట్రూఅప్ బాదుడు మామూలుగా లేదు. -
తవ్వుకో.. దండుకో!
[ 24-04-2024]
పెడన నియోజకవర్గంలో అక్రమ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. పెడనతో పాటు గూడూరు, కృత్తివెన్ను మండలాల్లో అక్రమార్కులు ఇసుక తవ్వకాలను నిరాటంకంగా సాగిస్తున్నారు. -
పేర్ని కిట్టూ నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పేర్ని వాకా సాయికృష్ణమూర్తి(కిట్టూ) అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
ప్రతిభ చాటిన విద్యార్థినులకు సన్మానం
[ 24-04-2024]
స్థానిక తోటమూల భట్ట మోహనరావు, హైమావతి జిల్లా పరిషత్తు హైస్కూలు విద్యార్థులు తొలిసారిగా మంచి ఫలితాలు సాధించారని ఎంఈవో-2 వైవీ హరినాథ్ అన్నారు. -
ఏటా కొలువులన్నారు.. ఏమార్చారు
[ 24-04-2024]
రాష్ట్రంలో 2.50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగులకు కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి వరకూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ నిరుద్యోగులు, వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
ఒక్క ఎస్సీకైనా అవకాశమిచ్చారా జగన్?
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగి అయినా గత ఐదు సంవత్సరాలలో పనిచేశారా అని మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రశ్నించారు. -
22 మంది అభ్యర్థులు...28 నామపత్రాలు
[ 24-04-2024]
జిల్లాలోని పార్లమెంట్తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం 22 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
అయిదేళ్లుగా.. రెండు పిల్లర్లు వేయలేదు!
[ 24-04-2024]
ఉట్టికెగరలేని అమ్మ.. ఆకాశానికి ఎగురుతానన్నదట.. అలాగే ఉంది వైకాపా ప్రభుత్వ తీరు. అయిదేళ్లలో రెండు పిల్లర్లు నిర్మించడం చేతకాలేదు కానీ.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ బిల్డప్లు ఇస్తుంటారు. -
అదనపు పని భారంతో సిబ్బంది సతమతం
[ 24-04-2024]
ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాం. భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తామని.. సీఎం జగన్మోహన్రెడ్డి ఊదరగొట్టారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వేయలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. -
పాత బూత్ల ముద్రణతో ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 24-04-2024]
అధికార వైకాపా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోంది. ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు పంపిణీ చేయాల్సి ఉండగా, ముందస్తుగానే వాటి పంపిణీని చేపట్టింది. -
సింహ వాహనంపై ఆది దంపతులు
[ 24-04-2024]
చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతులకు సింహ వాహన సేవను దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు శోభాయమానంగా మంగళవారం నిర్వహించారు. -
ముఖ్యమంత్రి మాట.. నీటి మూట
[ 24-04-2024]
అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డు తరలింపు ఆవశ్యకతను ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబు 2022 అక్టోబరు 20న అవనిగడ్డ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు వివరించారు. -
జనంపై జగనన్న అదనపు బాదుడు
[ 24-04-2024]
విద్యుత్తు వినియోగదారులకు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రీడింగ్ తీసేందుకు సిబ్బంది వస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సర్ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ఫిక్స్డ్, ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరుతో వినియోగదారుడి ఇంటి బడ్జెట్ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. -
గుడివాడ పసుపుమయం
[ 24-04-2024]
గుడివాడ పట్టణమంతా మంగళవారం పసుపుమయమైంది. ఎటువైపు చూసినా కనుచూపుమేరలో జనవాహిని కనిపించింది. ప్రత్యర్థి పార్టీల గుండెలదిరేలా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్కు జనం తరలి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇక్కడ అత్యల్ప ఓటింగ్.. మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?