తల్లిని హతమార్చిన తనయుడు
నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఏమాత్రం జాలి, దయ లేకుండా కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. మత్తుకు బానిసై సైకోగా మారి కన్న తల్లినే మట్టుబెట్టాడు గుడివాడ పట్టణం వాంబే కాలనీకి చెందిన
కుటుంబ సభ్యులపై తరచూ దాడులు
గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: నవమాసాలు మోసి.. కని పెంచిన తల్లిని ఏమాత్రం జాలి, దయ లేకుండా కొడుకే విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. మత్తుకు బానిసై సైకోగా మారి కన్న తల్లినే మట్టుబెట్టాడు గుడివాడ పట్టణం వాంబే కాలనీకి చెందిన ఓ కొడుకు. వివరాల్లోకి వెళ్తే.. పళ్లెం రాజ్యలక్ష్మి (60)కి కుమార్తె లక్ష్మీతులసీ ప్రభ, కుమారుడు హరీష్ కుమార్ ఉన్నారు. భర్త చాలా కాలం క్రితం చనిపోగా బిడ్డల్ని కష్టపడి పెంచుతోంది. కుమార్తె ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివి ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసింది. హరీష్ కుమార్ మత్తు పదార్థాలకు బానిసై మతి భ్రమించి తల్లిని, సోదరిని విచక్షణారహితంగా కొడుతూ హింసిస్తూ ఉండేవాడని.. ఈ క్రమంలో అతను దాడికి దిగిన సందర్భాల్లో వారిద్దరూ ఇంటి నుంచి పారిపోయి బస్టాండు, రైల్వే స్టేషన్, తదితర ప్రాంతాల్లో తల దాచుకునేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ విధంగా నెలలో కొద్ది రోజులు వారికి ప్రత్యక్ష నరకం చూపించేవాడని.. అడ్డుకుందామని ప్రయత్నిద్దామన్నా తమపై ఎక్కడ దాడికి దిగుతాడోనని భయపడి అటువైపు వెళ్లేందుకు ఎప్పుడూ సాహసించలేదని తెలిపారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపింది. ఎండ తీవ్రతకు రాజ్యలక్ష్మికి కొద్ది రోజులుగా అనారోగ్యం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున హరీష్ కుమార్ తన తల్లిపై తీవ్రంగా దాడి చేయగా ఆమె మృతి చెందింది. అనంతరం కుమారుడు పరారయ్యాడు. రాజ్యలక్ష్మి తన ఇంట్లో విగత జీవిగా పడి ఉండటాన్ని స్థానికులు మధ్యాహ్నం గుర్తించారు. ఆమెకు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యలక్ష్మి బావ పళ్లెం మంగయ్య ఫిర్యాదు మేరకు వన్టౌన్ సీఐ కె.గోవిందరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)