డౌన్లోడ్ చేశారంటే.. అంతే!
ఇతరుల రెక్కల కష్టాన్ని నేరగాళ్లు సులువుగా దోచేస్తున్నారు. వారి ఎత్తుగడలను బాధితులు తెలుసుకుని జాగ్రత్తపడే లోపే బురిడీ కొట్టిస్తున్నారు. ఫలితంగా నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు తేలికగా
స్క్రీన్ షేరింగ్ యాప్స్తో మోసాలు
ఖాతాలు లూటీ చేస్తున్న కేటుగాళ్లు
ఈనాడు - అమరావతి
ఇతరుల రెక్కల కష్టాన్ని నేరగాళ్లు సులువుగా దోచేస్తున్నారు. వారి ఎత్తుగడలను బాధితులు తెలుసుకుని జాగ్రత్తపడే లోపే బురిడీ కొట్టిస్తున్నారు. ఫలితంగా నిరక్షరాస్యుల నుంచి విద్యావంతుల వరకు తేలికగా మోసపోతున్నారు. తమ ఖాతాల్లోంచి డబ్బు పోతే కానీ వారికి విషయం తెలియడం లేదు. స్క్రీన్ షేరింగ్ యాప్స్ పేరుతో ఇట్టే గాలం వేసి, అందినకాడికి డబ్బు లాగేస్తున్నారు. సాయం చేస్తామని నమ్మించి ఈ యాప్స్ను ఇన్స్టాల్ చేయించి, ఆనక విలువైన సమాచారాన్ని తస్కరించి, డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో నమోదు అవుతున్నాయి.
కేవైసీ పేరు చెప్పి.. రూ. 3.03 లక్షలు లూటీ
విజయవాడ పటమటలంక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్కు సంక్షిప్త సందేశం వచ్చింది. మీ సిమ్కు సంబంధించి పత్రాల పరిశీలన ఇంకా పూర్తి కాలేదని, త్వరగా ముగించాలని, లేనిపక్షంలో 24 గంటల్లో సిమ్ పనిచేయడం ఆగిపోతుందని అందులో ఉంది. మరుసటి రోజు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాను కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. కేవైసీ డాక్యుమెంట్ పెండింగ్ ఉందని, పూర్తి చేయడానికి తాను సాయం చేస్తానని, ఇందుకు గాను ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడంతో అలాగే చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి సూచించిన విధంగా ఎస్బీఐ ఖాతా నుంచి రూ. 10 ఆన్లైన్ ద్వారా లావాదేవీ నిర్వహించాడు. ఈ మొత్తం జమకాలేదని చెప్పడంతో మళ్లీ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 10 బదిలీ చేశాడు. రెండు రోజుల తర్వాత బాధితుడికి ఫోన్ చేసి, ఇంకో యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పడంతో.. అలాగే చేశాడు. 20 నిమిషాల తర్వాత.. నగదు లావాదేవీలు జరిగినట్లు చాలా ఎస్ఎమ్ఎస్లు వచ్చాయి. రూ. 1.86 లక్షలు, రూ. 77 వేలు, రూ. 40,760 చొప్పున మొత్తం రూ. 3,03,760 మేర గుర్తు తెలియని వ్యక్తి లూటీ చేసేశాడు. ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
ఎదుటి వ్యక్తికి చెందిన మొబైల్, డెస్క్టాప్, ల్యాప్టాప్ల్లో సాఫ్ట్వేర్, ఇతర సమస్యల పరిష్కారం కోసం స్క్రీన్ షేరింగ్ యాప్స్ను ఉపయోగిస్తుంటారు. సంబంధిత పరికరంలో ఇటువంటి యాప్స్ను ఇన్స్టాల్ చేసుకుని, డెస్క్ ఐడీని అవతలి వ్యక్తికి చెప్తే చాలు.. ఇక నియంత్రణ అంతా వారి చేతికి వెళ్తుంది. తెరపై మనం చేసే పనులన్నీ అవతలి వ్యక్తి చూసే అవకాశం ఉంది.
* రిమోట్ స్క్రీన్ షేరింగ్ యాప్స్ను తమ మోసాలకు సాధనాలుగా సైబర్ నేరస్థులు ఉపయోగిస్తున్నారు. వీటిని ఎంచుకున్న వారి మొబైల్లో ఇన్స్టాల్ చేయించి, బాధితులు తమ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సమయంలో టైప్ చేసే ఐడీ, పాస్వర్డ్లను చూస్తున్నారు. వీటి ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దశలవారీగా బదిలీ చేస్తున్నారు. యాప్స్ను ఇన్స్టాల్ చేయించేందుకు అనేక రకాలుగా నమ్మిస్తుంటారు. ఇందుకు గాను తాము సాయం చేస్తామంటూ నమ్మించి కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు.
జాగ్రత్తలు అవసరం
* గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను విశ్వసించవద్దు. రిమోట్ స్క్రీన్ షేరింగ్ యాప్స్కు సంబంధించి ఐడీ వివరాలు అపరిచితులకు ఇవ్వడం మంచిది కాదు.
* ఎవరైనా ఫోన్ చేసి, ఫలానా యాప్ డౌన్లోడ్ చేసుకోమని ఒత్తిడి తెస్తే పట్టించుకోవద్దు. అధీకృత వినియోగదారుల సేవా సిబ్బంది ఎవరూ వీటిపై ఒత్తిడి చేయరని గమనించాలి.
* అపరిచిత వ్యక్తుల నుంచి మనకు వచ్చే లింక్స్ను క్లిక్ చేయకపోవడమే శ్రేయస్కరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశంలో ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా?: షర్మిల
[ 25-04-2024]
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. -
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి
[ 25-04-2024]
గుడివాడ వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా జనం సమస్యలు పట్టించుకోకుండా వదిలేసి.. -
నీ నిర్లక్ష్యమే.. పెనువిపత్తు!
[ 25-04-2024]
అకాల వర్షాలు.. వరదలకు నిలువునా మునిగిపోయిన అన్నదాతను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఘోరంగా విఫలమైంది. పరిహారం ఇవ్వడంలో కనికరం చూపించలేదు. -
అభిమాన కెరటం
[ 25-04-2024]
తెదేపా, జనసేన, భాజపా.. కూటమి అభ్యర్థుల నామినేషన్లకు.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మూడు పార్టీల శ్రేణులు.. ఏకతాటిపైకి వచ్చి తమ అభ్యర్థుల కోసం తరలివస్తున్నారు. -
సిగ్గు విడిచి సంబరమా!
[ 25-04-2024]
వైకాపా నేతల నామినేషన్లు.. జనానికి ప్రాణసంకటంలా మారాయి. నామినేషన్ల ర్యాలీలకు డబ్బులిచ్చి భారీగా జనాన్ని ఆటోలు, వాహనాల్లో తీసుకొచ్చి.. లేని బలాన్ని.. ఉన్నట్టు చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. -
నయవంచన
[ 25-04-2024]
పాడి రైతుల ముంగిట్లో 20 ఏళ్లుగా సేవలిందిస్తున్న గోపాలమిత్రలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం శ్రమించినా నెలకు రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండడంతో కుటుంబ పోషణకు చాలక ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. -
వైకాపా నాయకులకు దోచుకోవడమే తెలుసు : షర్మిల
[ 25-04-2024]
కృష్ణానది ఇసుకను దోసుకుతిన్న ఘనుడు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అని పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. -
జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం
[ 25-04-2024]
సివిల్ సర్వీస్లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. -
కూటమిలో జోష్
[ 25-04-2024]
విజయమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా నాయకులు కార్యకర్తలు బందరులో బుధవారం జనసునామి సృష్టించారు. -
బెజవాడ సీపీగా రామకృష్ణ
[ 25-04-2024]
విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్గా 2006 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పీహెచ్డీ రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
షర్మిల యాత్ర విజయవంతం చేయండి
[ 25-04-2024]
కృష్ణలంకలో గురువారం (నేడు) జరిగే షర్మిలారెడ్డి యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి చౌహాన్ పిలుపునిచ్చారు. -
పని ప్రాంతంలోనే ఎన్నికల విధులు వేయరూ..
[ 25-04-2024]
మహిళా ఉపాధ్యాయులను వారి పని చేసే నియోజకవర్గాల్లోనే ఎన్నికల విధుల్లో నియమించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్, కోసూరి రాజశేఖర్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. -
కలగా మిగిలిన వంతెన
[ 25-04-2024]
జగనన్న వస్తాడు..ఏదో చేస్తాడని ఓట్లేస్తే పాములలంక వంతెన నిర్మించకుండా అయిదేళ్ల్లుగా ఉసూరుమనిపించారని పాములలంక గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. -
పరిహారం.. పరిహాసం
[ 25-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గతేడాది ఖరీఫ్, రబీ పంటల సాగులో అన్నదాత పూర్తిగా నష్టపోయారు. నేటి వరకూ రైతులకు పావలా ఆర్థిక సాయం కూడా అందలేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
43 మంది అభ్యర్థులు...57 నామపత్రాలు
[ 25-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలో పోటీ చేసేందుకు బుధవారం మొత్తం 43 మంది నామపత్రాలు దాఖలు చేశారు. -
పామర్రుని తెదేపా అడ్డాగా మారుస్తా: వర్ల
[ 25-04-2024]
అన్న నందమూరి తారకరామారావు పుట్టిన ఈ గడ్డపై మళ్లీ పసుపు జెండాను ఎగరేసి నియోజకవర్గాన్ని తెదేపాకు అడ్డాగా మారుస్తానని ఎన్డీఏ కూటమి అభ్యర్థి వర్ల కుమార్రాజా అన్నారు. -
పీఏసీఎన్ కంప్యూటరీకరణపై శిక్షణ
[ 25-04-2024]
ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల కంప్యూటరీకరణపై చల్లపల్లి పీఏసీఎన్లో శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. -
‘బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు’
[ 25-04-2024]
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్టీఆర్ గృహాలు నిర్మించుకున్న పేదలకు ఎందుకు నిధులు మంజూరు చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం ప్రకాష్రావు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...