విహారంలో విషాదం
కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో బీఫార్మసీ విద్యార్థినులు ఇరువురు దుర్మరణం పాలైన సంఘటన రెండు కుటుంబాలకు అంతులేని శోకాన్ని
బీచ్లో ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో బీఫార్మసీ విద్యార్థినులు ఇరువురు దుర్మరణం పాలైన సంఘటన రెండు కుటుంబాలకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు పరాసుపేటకు చెందిన కె.పూజిత(22) భీమవరంలోని విష్ణు కళాశాలలో ఇటీవలే బీఫార్మసీ పూర్తి చేసింది. ఆమెతో పాటు బీఫార్మసీ పూర్తి చేసిన భీమవరానికి సమీపంలోని పిప్పర గ్రామానికి చెందిన ప్రమీలారాణి జాస్మిన్(22), గరగపల్లి గ్రామానికి చెందిన డి.ఆశాజ్యోతి రెండు రోజుల క్రితం సరదాగా మచిలీపట్నంలోని పూజిత ఇంటికి వచ్చారు. ముగ్గురూ సోమవారం ఉదయం 10గంటల సమయంలో మంగినపూడి బీచ్లో స్నానాలు చేసేందుకు వెళ్లారు. స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురూ లోపలికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు గమనించి వారిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొనఊపిరితో ఉన్న పూజిత, ప్రమీలారాణి జాస్మిన్లకు ప్రాథమిక చికిత్స అందించేలోపే మృతిచెందారు. ఆశాజ్యోతి కోలుకుంది. అప్పటివరకూ తనతో సరదాగా గడిపిన స్నేహితురాళ్లు ఇరువురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి కన్నీరు మున్నీరుగా ఆమె విలపించింది. సమాచారం తెలుసుకున్న ప్రమీలారాణి జాస్మిన్ తల్లిదండ్రులు మచిలీపట్నం చేరుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ప్రాంగణ ఎంపికల్లో కొలువులు సాధించిన తమ కుమార్తెలను విగతజీవులుగా చూడలేక రెండు కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. వారి వేదన చూపరుల హృదయాలను కలిచివేసింది. కళ్లెదుటే చోటుచేసుకున్న హృదయవిదారక ఘటనతో చలించిపోయిన సందర్శకులు ఏదైనా ప్రమాదం చోటుచేసుకుంటే తక్షణ వైద్య సాయం అందించే ఏర్పాట్లు బీచ్వద్ద చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తాలూకా ఎస్సై వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగంలో చేరకుండానే..
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: చేతికందివచ్చిన ముగ్గురు బిడ్డల్లో ఒకరు పదిరోజుల్లో ఉద్యోగంలో చేరతారని సంతోషిస్తున్న సమయంలో ఆ కుటుంబాన్ని విషాదం కమ్ముకుంది. బందరు మండల పరిధిలోని ఆర్గొల్లపాలెంకు చెందిన మాజీ సర్పంచి కుమారుడు శ్రీకృష్ణవరప్రసాద్ వ్యవసాయం చేసుకుంటూ మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తెకు వివాహం చేయగా రెండో కుమార్తె భీమవరం విష్ణు కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసింది. కుమారుడు విశాఖలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ప్రాంగణ ఎంపికలో చెన్నైలోని ఓ బహుళజాతి మందుల కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న పూజిత మరో పదిరోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ లోపే విధి వక్రించింది. మరో పది రోజుల్లో ఉద్యోగానికి వెళ్లిపోతోందన్న ఆనందంలో ఉన్న వారు విగతజీవిగా మారిన పూజితను చూసి తట్టుకోలేకపోయారు. పూజిత అంత్యక్రియలు మంగళవారం వారి స్వగ్రామంలో నిర్వహిస్తారని మృతురాలి బంధువులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
[ 18-04-2024]
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్