చంద్రబాబుతోనే పోలవరం పూర్తి : దేవినేని
తెదేపా అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు ఆయన చేతులమీదుగా పూర్తవుతుందని, ప్రస్తుతం అసమర్థుల పాలనలో అది పూర్తికావడం కల్ల అని మాజీ మంత్రి దేవినేని
మాట్లాడుతున్న దేవినేని, చిత్రంలో వర్ల, కొనకళ్ల
పమిడిముక్కల, న్యూస్టుడే: తెదేపా అధికారంలోకి వచ్చి చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు ఆయన చేతులమీదుగా పూర్తవుతుందని, ప్రస్తుతం అసమర్థుల పాలనలో అది పూర్తికావడం కల్ల అని మాజీ మంత్రి దేవినేని ఉమామమహేశ్వరరావు అన్నారు. పమిడిముక్కలలో ఆదివారం నిర్వహించిన మహానాడు-2022 సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేతకాని జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేతులెత్తేసిందన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యంలో బస్తాకు రూ.200 నుంచి రూ.300 ప్రభుత్వం నొక్కేస్తోందన్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన మంత్రు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. జగన్ ఇసుక, మద్యం తదితరాలతో రూ.లక్షల కోట్లు సంపాదించి ఇంగ్లాండుకు తరలించారని, దావోస్ ప్రయాణం అందుకేనంటూ ఆరోపించారు. ఈనెల 27న గ్రామగ్రామాన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించుకొని 28న అందరూ ఒంగోలు మహానాడుకు రావాలన్నారు. పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్న వర్ల కుమారరాజాకు అండగా నిలవాలని దేవినేని కోరారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ 16 కేసుల్లో ముద్దాయిగా ఉండి పలుసార్లు జైలుకెళ్లి వచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పాతవిధానంతోనే అధికారికంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని ఆరోపించారు. సభకు అధ్యక్షత వహించిన పామర్రు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు వర్ల కుమారరాజా, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, తెదేపా మండల అధ్యక్ష కార్యదర్శులు రాజులపాటి శ్రీనివాసరావు, కొల్లూరి బాబ్జీ ఇతర నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనగళమే.. జయ కెరటమై..
[ 18-04-2024]
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాగళం సభలు, రోడ్షోకు జనం పోటెత్తారు. -
నేడే.. ఈనాడే..
[ 18-04-2024]
2024 సాధారణ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల దాఖల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. -
మీరు.. మనసులు గెలవాలండీ..
[ 18-04-2024]
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు అధినేత పవన్కల్యాణ్ బీ ఫారాలు అందించారు. -
అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి
[ 18-04-2024]
ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరి శ్రీనివాస్ అనిశా వలకు చిక్కారు. -
1నే జీతాలివ్వండి మహాప్రభో!
[ 18-04-2024]
తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పిన జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. -
ఎదురుమొండికి ఎదురు చూపులే..
[ 18-04-2024]
ఎదురుమొండి వారధి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తమ చిరకాల స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందోనని దీవుల్లో నివాసముంటున్న పది వేల మంది జనాభా దశాబ్ద కాలంగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
కూటమి ప్రభంజనం ఖాయం
[ 18-04-2024]
ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు. -
నాడు ఆశల కేంద్రం.. నేడు విధ్వంసానికి నిలయం
[ 18-04-2024]
రాష్ట్ర విభజన తర్వాత తుళ్లూరు మండలంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. -
వైకాపా నాయకుడి ఇంట్లో వైద్యశాల
[ 18-04-2024]
వైకాపా నాయకుడి ఇంట్లో ప్రభుత్వ వైద్యశాల నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుడి ఇంట్లో వైద్య సేవలు కొనసాగడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
‘రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలన’
[ 18-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనతో జనం విలవిలలాడుతున్నారని సెంట్రల్ సీపీఎం అభ్యర్థి సి.హెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చైతన్యం అవసరం
[ 18-04-2024]
నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివస్వామి పిలుపునిచ్చారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 18-04-2024]
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.