కోర్టుకు రాజధాని రైతుల హాజరు
రాజధాని అమరావతి రైతులు సోమవారం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో 2020 డిసెంబర్ 20న రాత్రి
మంగళగిరి కోర్టు వద్ద అన్నదాతలు
మంగళగిరి, న్యూస్టుడే: రాజధాని అమరావతి రైతులు సోమవారం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని మల్కాపురం గ్రామంలో 2020 డిసెంబర్ 20న రాత్రి అన్నదాతలు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించారంటూ పోలీసులు క్రైం నెంబర్ 563, 2020 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో 15 మంది రైతులను నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో కర్షకులు వాకచర్ల వీరాంజనేయులు, పువ్వాడ సుధాకర్, ధనేకుల వెంకటసుబ్బారావు, కంచర్ల గాంధీతో పాటు మిగిలిన వారు కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి కేసును జూన్ 21వ తేదీకి వాయిదా వేసినట్లు రైతుల తరపు న్యాయవాది లంకా శివరామ్ప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా