logo

మామపై అల్లుడి దాడి

కుటుంబ కలహాల కారణంగా మామను అల్లుడు చితకబాదిన సంఘటన జి.కొండూరు మండలం మునగపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన

Published : 26 May 2022 06:18 IST


గాయపడిన చిన థామస్‌

జి.కొండూరు, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల కారణంగా మామను అల్లుడు చితకబాదిన సంఘటన జి.కొండూరు మండలం మునగపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన తన్నీరు చిన థామస్‌ అతని భార్యతో కలిసి అనారోగ్యానికి గురైన మనవడిని పరామర్శించేందుకు జి.కొండూరు మండలంలోని మునగపాడులో ఉన్న తన పెద్ద కుమార్తె నాగలక్ష్మి ఇంటికి వచ్చాడు. పాత కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడు బత్తుల ప్రసాద్‌ మామ చినథామస్‌పై ఎందుకు వచ్చావంటూ కర్రలతో దాడి చేశాడు.ఈ ఘటనలో చినథామస్‌ తలకు గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే మైలవరం ఆసుపత్రికి వెళ్లగా తలకు ఐదు కుట్లు పడినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ అసుపత్రికి తరలించమని మైలవరం వైద్యులు చెప్పడంతో బుధవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు