అందని హక్కు పత్రం
వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. లబ్ధిదారుల అపోహలు పోగొట్టి డబ్బులు చెల్లించేలా అధికారులపైనా ఒత్తిడి తెచ్చారు. తీరా డబ్బులు కట్టాక హక్కు పత్రాలు జారీ చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది.
ఓటీఎస్ రిజిస్ట్రేషన్లలో జాప్యం
తప్పుల తడకలతో తిరస్కరణ
కడుమూరులో తహసీల్దారుకు ఓటీఎస్ నగదు చెల్లిస్తున్న లబ్ధిదారులు
ఈనాడు డిజిటల్ - కర్నూలు: వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. లబ్ధిదారుల అపోహలు పోగొట్టి డబ్బులు చెల్లించేలా అధికారులపైనా ఒత్తిడి తెచ్చారు. తీరా డబ్బులు కట్టాక హక్కు పత్రాలు జారీ చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. వీటి బాధ్యతలు వీఆర్వోలతోపాటు గ్రేడ్-4,5 పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. రిజిస్ట్రేషన్లుకు సంబంధించిన దస్త్రాలు ఎలా పూర్తి చేయాలో అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి తిరస్కరణలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు 1971 మందికి
జిల్లాలో 50వేలకు పైగా ఓటీిఎస్ చేయగా కేవలం 1971 మందికి రిజిస్ట్రేషన్లు చేసి గృహ హక్కు పత్రాలు ఇచ్చారు. మిగిలిన వారికి జాప్యం అవుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకంపై చాలా మందిలో అపోహలు ఉండటంతో ఓటీఎస్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్న విషయం విధితమే. డేటా ఎంట్రీ చేశాక పరిశీలనకు కార్యదర్శులు, వీఆర్వోల లాగిన్కు పంపుతారు. సర్వే, కొలతలు ఆన్లైన్ చేశాక తహసీల్దార్ లాగిన్కు పంపుతారు. అక్కడ అనుమతి పొందితే గృహ నిర్మాణశాఖకు 10 రోజుల వ్యవధిలో చేరుతుంది. అక్కడి నుంచి అమరావతికి వెళ్లి డాక్యుమెంట్లు ప్రింటై వస్తాయి. ఈ విధానంలో క్షేత్రస్థాయిలో జాప్యం అవుతోంది. ప్రధానంగా తప్పులతడకలతోనే ఈ సమస్య ఎదురువుతున్నట్లు తెలుస్తోంది.
రూ.20.14 కోట్లు వసూలు
గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించుకొన్న ఇళ్లకు ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకు ఓటీఎస్ పేరుతో రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.20వేలు వసూలు చేస్తున్నారు. 1983 నుంచి 2011 మధ్య కాలంలో వివిధ పథకాల కింద జిల్లా వ్యాప్తంగా 4,45,945 మంది లబ్ధి పొందినట్లు గుర్తించారు. వీరిలో సర్వే చేయగా 2.21 లక్షల మంది ఇళ్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఓటీఎస్ ద్వారా రూ.185 కోట్లు వసూలు అవుతాయని లక్ష్యం పెట్టుకొన్నారు. జనవరి 17 నాటికి 50,316 మంది రూ.20.14 కోట్లు చెల్లించారు.
అంతా గందరగోళం
లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసే దస్తావేజుల్లో తప్పులే దర్శనమిస్తున్నాయి. ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంటే అలా డాక్యుమెంట్స్లో రాయాల్సి ఉండగా, లబ్ధిదారుడు ఎలా చెబితే అలా నింపేశారు. సర్వే, కొలతల్లోనూ వ్యత్యాసం నెలకొంది. తక్కువ సమయం ఇవ్వడం, గ్రేడ్-5 కార్యదర్శులకు అవగాహన లేకపోవడంతో తప్పులు చోటు చేసుకొన్నాయి. ఈ దిద్దుబాట్లపై తహసీల్దార్ సంతకంతో మార్చే అవకాశం కల్పించారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు పరిశీలనకు వెళ్లిన వాటిలో తహసీల్దార్, కార్యదర్శుల సంతకాల్లేకపోవడం, సర్వే నంబర్లు పెన్నుతో సరిదిద్దడం వంటివి గుర్తించి తిరస్కరించారు. వీటితో ఇలా కాలయాపన జరుగుతుండటంతో ప్రకటించిన విధంగా వెంటనే హక్కు పత్రాలు అందించ లేకపోతున్నారన్న విమర్శలున్నాయి.
కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా
- వెంకట లక్ష్మమ్మ, నందికొట్కూరు
నందికొట్కూరు బైరెడ్డి నగర్లో ఉంటున్నా. 2008లో గృహ నిర్మాణశాఖ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం కొంత సొంత నగదు చేర్చి పూర్తి చేశా. ఓటీఎస్కు రూ.15వేలు చెల్లించా. ఇరవై రోజులుగా రిజిస్ట్రేషన్ పత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అదిగో ఇదిగో అంటూ జాప్యం చేస్తున్నారు. డబ్బులు కట్టించుకుని జాప్యం చేస్తే ఆందోళనగా ఉంది.
సమయం పడుతుంది
- కె.వెంకటనారాయణ, హౌసింగ్ పీడీ
ఓటీఎస్ చెల్లించిన వెంటనే రుణ విముక్తి పత్రం అందజేస్తున్నాం. తహసీల్దార్ సంతకం అయ్యాక పది రోజుల వ్యవధిలో గృహ నిర్మాణ శాఖకు వచ్చే డాక్యుమెంట్లు అమరావతికి పంపిస్తాం. అక్కడ ప్రింట్ అయి రావడానికి సమయం పడుతోంది. దీనిపై లబ్ధిదారులు ఆందోళన చెందొద్ధు కచ్చితంగా గృహ హక్కు పత్రాలు అందిస్తాం. ఇక తప్పులు సరి చేసేందుకు ఎడిట్ ఆప్షన్ వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు, తహసీల్దార్ లాగిన్లో ఆన్లైన్ రిజిస్ట్రేన్లో చేసుకోవచ్ఛు ఒక వేళ డాక్యుమెంట్ ప్రింట్ అయి వచ్చాక తప్పులు గుర్తిస్తే తహసీల్దార్ పచ్చ ఇంకుతో సరి చేసే అధికారం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్