ఆందోళన వద్దు... అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుతం 70 శాతం వేగంగా వైరస్ విస్తరిస్తోంది. టీకా చేయించుకోని వారికి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం ‘ఈనాడు’ నిర్వహించిన
‘ఈనాడు- ఫోన్ఇన్’లో వైద్య నిపుణులు (సర్వజన వైద్యశాల) డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి
ఈనాడు డిజిటల్ - కర్నూలు: ప్రస్తుతం 70 శాతం వేగంగా వైరస్ విస్తరిస్తోంది. టీకా చేయించుకోని వారికి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సల నిపుణులు డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి తెలిపారు. బుధవారం ‘ఈనాడు’ నిర్వహించిన ఫోన్ ఇన్లో సందేహాలు నివృత్తి చేశారు. స్వీయ గృహనిర్భందంలో ఉండి వైరస్ సోకిన రోజు నుంచి ఏడు రోజులపాటు ఉండాలి. కేంద్ర కొవిడ్-19 టాస్క్ఫోర్స్ కమిటీ, ఐసీఎంఆర్ తాజాగా 13వ తేదీ విడుదల చేసిన నిబంధనల ప్రకారం రూ.200 కిట్ సూచించారు. ఇందులో సెట్రిజిన్ 10ఎంజీ(రెండు పూటలా), పారాసిట్మాల్ 650ఎంజీ(మూడు పూటలా), అజిత్రోమైసిన్(ఒక పూట), ఆస్కారిల్ సిరప్(మూడు పూటలా), బి కాంప్లెక్సు (ఒక పూట), పాన్టాప్(గ్యాస్ 20ఎంజీ) ఒక పూట వేసుకోవాలని సూచించారు. ఆందోళన వద్ధు. అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.
నా వయసు 62 ఏళ్లు. నేను పన్నెండేళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకొన్నా. రక్తపోటు, మధుమేహం ఉన్నాయి. వాటికి మందులు వాడుతున్నా. రెండు డోసుల టీకాలు వేయించా. గతరాత్రి నుంచి జలుబు, స్వల్ప జ్వరం ఉంది. ఏం చేయాలి? - శ్రీరాములు, కర్నూలు
హైరిస్క్ గ్రూప్లో ఉన్నారు. బూస్టర్ డోస్ వెంటనే వేయించుకోండి. గుండెకు సంబంధించిన మందులు, బీపీ, షుగరు మందులు కొనసాగిస్తూనే ఐదు రోజులపాటు పారాసిట్మాల్, సిట్రజిన్, అజిత్రోమైసిన్, బీకాంప్లెక్సు వాడండి.
మాది డోన్. రెండ్రోజులుగా దగ్గు, ఒళ్లు నొప్పులున్నాయి. జలుబు అంతగా లేదు. జనరల్ మెడిసిన్ వాడుతున్నా. ఇవి ఒమిక్రాన్ లక్షణాలేనా?
ఇప్పటికే మూడ్రోజులు దాటింది.. మరో ఐద్రోజులు మందులు వాడితే సరిపోతుంది. ఎక్కువ నీరు తాగాలి. కొంచె లేచి తిరుగుతూ ఉండండి. ఇంట్లోనే ఐసొలేట్ అవ్వండి.
ఒమిక్రాన్ వస్తే గుండెకు ఏమైనా సమస్య వస్తుందా? గుండెకు ఒత్తిడి పెరుగుతుందని సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. అది నిజమేనా? - శ్రీధర్, కర్నూలు
ఒమిక్రాన్తో గుండెకు ఎలాంటి సమస్య రాదు. అటువంటి కేసులు ఒక్కటి కూడా రికార్డు కాలేదు. ఒమిక్రాన్ జలుబు, దగ్గు, గొంతునొప్పి, విపరీతమైన ఒళ్లునొప్పులు, జ్వరం ఉంటాయి.
నాకు గాల్బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని రోజుల క్రితం ట్యూబ్ వేశారు. దగ్గు, గొంతులో గరగరగా ఉంటే కొన్ని మందులు వాడుతున్నాను. పూర్తిగా తగ్గడానికి ఏం మందులు వాడాలి? - ఖాశీం వలి, న్యాయవాది, ఆదోని
సెఫిక్జైమ్ 200ఎంజీ రెండు పూట్లా, ఆస్కారిల్ దగ్గు మందు మూడు పూట్లా వేసుకుంటే కళ్లె, గొంతులో గరగర తగ్గిపోతాయి.
పదేళ్ల క్రితం టీబీ వచ్చి తగ్గింది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఎలర్జీ వస్తుంది. రెండు అలల్లోనూ కొవిడ్ సోకలేదు. ప్రస్తుతం రెండు డోసులతోపాటు బూస్టర్ డోసు వేయించాం. ముందస్తు జాగ్రత్తగా ఏవైనా మందులు వాడొచ్చా? - పవన్కుమార్రెడ్డి, నెల్లూరు.
బూస్టర్ డోస్ వేసుకొన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముందస్తుగా ఎలాంటి మందులు వాడొద్ధు జలుబు, దగ్గు, జ్వరానికి కొన్ని మందులు ఇంట్లో అందుబాటులో ఉంచుకోండి చాలు.
నాకు థైరాయిడ్ ఉంది. రెండ్రోజులుగా ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించా.. ఫలితం రాలేదు. నీరసంగా ఉంటుంది? - జయసుధ, బనగానపల్లి
ఫలితం వచ్చే ముందే మందులు వాడండి. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోండి. మసాలాలతో కూడిన ఆహారం కాకుండా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ఇంట్లోనే ఐసొలేట్ అవ్వండి.●
లక్షణాలు వచ్చి ఇప్పటికి ఏడు రోజులైంది. పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం గొంతు నొప్పి ఇంకా తగ్గలేదు. బయటకు వెళ్లొచ్చా? - భరత్రెడ్డి, ఈసీఐఎల్, హైదరాబాద్
ఏడు రోజులు పూర్తయితే కొవిడ్ నిర్ధారణ అయ్యాక వైరస్ వ్యాప్తి ఉండదు. కనుక మాస్క్ ధరించి బయటకు వెళ్లొచ్ఛు●
మా కుమారుడి ఇంట్లో పనిచేసే సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణైంది. జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులున్నాయి. ఏం మందులు వాడాలి? - వేణుగోపాల్రెడ్డి, నెడ్క్యాప్ జిల్లా మేనేజర్
సిట్రజిన్, పారాసిట్మాల్, బి-కాంప్లెక్సు, అజిత్రోమైసిన్, పాన్టాప్ (గ్యాస్ టాబ్లెట్) ట్యాబ్లెట్లు వేసుకుంటూ బాగా నీళ్లు తాగాలి. దగ్గుకు అవసరమైతే ఆస్కారిల్ సిరప్ మూడు పూటలా తాగితే సరిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధులపై అలసత్వం వద్దు
[ 28-03-2024]
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అలసత్వం లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు
[ 28-03-2024]
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుంట్ల వద్ద సీఎం జగన్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. -
వైకాపాకు ఓటు వేయాలి
[ 28-03-2024]
నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే వై. బాలనాగిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే కావాలని వైకాపా యువ నాయకురాలు ప్రియాంక రెడ్డి అన్నారు. -
శ్రీశైలంలో వైకాపాకు మరో షాక్
[ 28-03-2024]
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో అధికార వైకాపాకు మరో షాక్ తగిలింది. -
కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమం
[ 28-03-2024]
మండలం కేంద్రమైన కోసిగిలో ‘బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ’ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. -
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 28-03-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో గురువారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
కేంద్ర బలగాల కవాతు
[ 28-03-2024]
ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 28-03-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. -
పాదయాత్ర మాటపాలనలో జూట
[ 28-03-2024]
ప్రజా సంకల్ప పాదయాత్ర పేరుతో పల్లెలకొచ్చారు.. నా అక్కాచెల్లెమ్మలు, అన్నలు అంటూ ‘హామీ’లు కురిపించారు.. ఒక సంవత్సరం ఓపిక పడితే ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించారు.. జగన్ వస్తే జనాలకు మంచి జరుగుతుందని భ్రమింపజేశారు.. అధికార పీఠమెక్కి ‘ప్రజా’స్వామ్యం మరిచారు.. అడిగితే అణచివేశారు.. ప్రశ్నిస్తే భయపెట్టారు.. -
ఎమ్మెల్యే కబ్జాలో రూ.4 కోట్ల విలువైన స్థలం
[ 28-03-2024]
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి రూ.4 కోట్ల విలువైన 40 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని బాధితుడు కె.వి.కుమార్ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. -
బస్సులు మళ్లించారు..ఎండలో నిలబెట్టారు
[ 28-03-2024]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు వస్తున్నారంటే జనం హడలిపోతున్నారు. -
మఠం స్థలానికి ఎసరు
[ 28-03-2024]
ఆదోని పట్టణ శివారులోని బైపాస్ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. -
ఆదోని భాజపా అభ్యర్థి డా.పార్థసారథి
[ 28-03-2024]
ఉత్కంఠ వీడింది.. ఆదోని అభ్యర్థిగా భాజపా ఓబీసీ మోర్చా కార్యదర్శి డా.పార్థసారథి బరిలో ఉండనున్నారు. -
29న బనగానపల్లికి చంద్రబాబు రాక
[ 28-03-2024]
బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి బుధవారం తెలిపారు. -
కేసులు నమోదైతే కొలువు కష్టమే
[ 28-03-2024]
చట్ట నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడే వాలంటీర్లపై కేసులు నమోదైతే మళ్లీ వారిని ఉద్యోగంలోకి తీసుకోవడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. -
తెదేపాలోనే బీసీలకు పెద్దపీట
[ 28-03-2024]
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించి అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. -
వైకాపా అరాచక పాలనలో ఇబ్బందులు
[ 28-03-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. -
ఉర్దూ వర్సిటీ పనులు పూర్తి చేయాలి
[ 28-03-2024]
ఓర్వకల్లు సమీపంలో తెదేపా హయాంలో చేపట్టిన ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 28-03-2024]
ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దఎత్తున హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు కోరారు. -
అభివృద్ధికి ఓటేయండి
[ 28-03-2024]
కర్నూలును అభివృద్ధి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ అన్నారు. -
తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా పోటీ చేస్తా
[ 28-03-2024]
మంత్రాలయం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా కచ్చితంగా నేనే పోటీ చేస్తానని ఆ పార్టీ నాయకుడు తిక్కారెడ్డి అన్నారు. -
ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
[ 28-03-2024]
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి