యువతపై ఉరిమిన మూడో అల
జిల్లా వ్యాప్తంగా కొవిడ్ మూడో అల విరుచుకుపడుతోంది. ముఖ్యంగా 18-40 ఏళ్లలోపు ఉన్నవారిపై ప్రభావం చూపుతోంది. కళాశాలలో చదివే విద్యార్థులతోపాటు ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయట తిరిగేవారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. ఫలితంగా వారి కుటుంబసభ్యులకు
అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే : జిల్లా వ్యాప్తంగా కొవిడ్ మూడో అల విరుచుకుపడుతోంది. ముఖ్యంగా 18-40 ఏళ్లలోపు ఉన్నవారిపై ప్రభావం చూపుతోంది. కళాశాలలో చదివే విద్యార్థులతోపాటు ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం బయట తిరిగేవారు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. ఫలితంగా వారి కుటుంబసభ్యులకు కరోనా సోకుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
భారీగా మందుల కొనుగోలు
జిల్లాలో చాలామంది జలుబు, జ్వరం బారినపడ్డారు. చలి తీవ్రత ఉండటంతో ఈ సమస్య ఎదురవుతోంది. ముందస్తుగా మందులు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కొవిడ్ ఐసొలేషన్ కిట్లు, అజిత్రోమైసిన్. డోలో అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. గత నెలలో పోల్చితే ఈ నెలలో కొనుగోళ్లు రెండింతలైనట్లు దుకాణ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
చాలామంది పరీక్షలు చేయించుకోకుండా డోలో, అజిత్రోమైసిన్ వంటివి వాడుతున్నారు. గతేడాది రెండో వేవ్లో ఎక్కువమంది ఆస్పత్రులపాలయ్యారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు. సీరియస్ కేసులు రాకపోవడం.. చాలామందికి తగ్గిపోతుండటంతో హోం ఐసొలేషన్లో ఉంటున్నారు.
పరీక్షల పేరుతో దోపిడీ
ఇతర జిల్లాలు.. రాష్ట్రాల్లో చదువుకొనే విద్యార్థులు.. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఇదే అవకాశంగా ప్రైవేటు ల్యాబ్లు ఆర్టీపీసీఆర్ పరీక్షల పేరుతో దోచుకుంటున్నాయి. కొందరికి పరీక్షలు చేయకనే వారి అవసరానికి తగ్గట్టు డబ్బులు తీసుకుని తప్పుడు పత్రాలు ఇస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో అడ్మిషన్ పేరుతో భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.350కు మించి వసూలు చేయకూడదు. కర్నూలు నగరంలో కొన్ని ఆసుపత్రులు, ల్యాబ్లు రోగి అవసరాన్ని బట్టి భారీగా వసూలు చేస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్షలు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం.
బూస్టర్ డోస్ కోసం
జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రం రెండో డోసు వేస్తున్నారు. వైద్య సిబ్బంది.. 60 ఏళ్లు దాటినవారికి ఉచితంగా బూస్టర్ డోసు వేస్తున్నారు. కర్నూలు నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో టీకాలు వేస్తున్నారు. కొవిషీల్డ్ రూ.800, కొవాగ్జిన్కు రూ.1,500 తీసుకుంటున్నారు. మూడో అల నేపథ్యంలో కొందరు భయపడి ఎలాంటి ధ్రువీకరణ పత్రం లేకుండా వెళ్లి టీకా వేయించుకుంటున్నారు.
పెరిగిన ,పాజిటివ్ రేట్
జిల్లా వ్యాప్తంగా శనివారం 969 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కర్నూలు నగరంలోనే 481, నంద్యాల 97, ఆదోని 28, ఎమ్మిగనూరు 21 కేసులు బయటపడ్డాయి.
పట్టణ ప్రాంతాల్లో 674 మంది వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో 1,866 మందికి పరీక్షలు చేయగా 674 మందికి (పాజిటివ్ రేటు 35.74 శాతం)గా లక్షణాలు బయటపడ్డాయి. వెల్దుర్తిలో 23, ఓర్వకల్లు 25, కల్లూరు 10, పెద్దకడబూరు 19, కోడుమూరు 24, ప్యాపిలి 22, కర్నూలు గ్రామీణంలో 14 కేసులు బయటపడ్డాయి.
జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,190 పరీక్షలు చేయగా 295 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ రేటు 13.47 శాతంగా ఉంది. జిల్లాలో ఇప్పటివరకు వివిధ ఆస్పత్రులు, హోం ఐసొలేషన్లో 3,778 మంది చికిత్స పొందుతుండగా కొవిడ్ బారినపడి 854 మంది చనిపోయారు.
ఈనెలలో నమోదైన కేసులు( 11 నుంచి 20 వరకు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!