పాత పీఆర్సీ ప్రకారమే వేతనాలివ్వాలి
కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలంటూ ఖజానాశాఖ అధికారులు డీడీవోలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని డీటీవో కార్యాలయం ఎదుట
ఖజానా శాఖ డీడీతో మాట్లాడుతున్న ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు
వెంగళ్రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలంటూ ఖజానాశాఖ అధికారులు డీడీవోలపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని డీటీవో కార్యాలయం ఎదుట ఆయనతోపాటు ఏపీ ఎన్జీవో సంఘం నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఫ్యాప్టో అధ్యక్షుడు ఓంకార్ యాదవ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఖజానాశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పలనాటి సునీల్కుమార్, కరుణాకర్, వ్యవసాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిప్రకాష్, ఎన్జీవో సంఘం నాయకులు బలరామిరెడ్డి, సాంబశివారెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి శనివారం నిరసన తెలిపారు. కొత్త పీఆర్సీ వద్దని.. పాత వేతనాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి ధర్నా చేస్తుంటే కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాల చెల్లింపులు చేసేందుకు దూకుడుగా వ్యవహరించడం తగదని ఖజానాశాఖ డీడీ రామచంద్రరావుతో వాగ్వాదానికి దిగారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ లెక్క తేలేదాకా తమకు పాత వేతనాలే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖజానాశాఖ డీడీకి వినతిపత్రం సమర్పించారు.
కలెక్టరేట్ ఆవరణలో నిరసన
ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన పీఆర్సీ తమకు ఆమోదయోగ్యంగా లేదు.. వచ్చే నెల 7 నుంచి ఉద్యమబాట పడుతున్నట్లు ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శనివారం వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ, క్వాంటమ్ పింఛన్ వంటి చీకటి జీవోలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎస్ డౌన్ డౌన్, ఐఏఎస్ అధికారుల మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, ఖజానా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జడ్.కరుణాకర్, ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు 130 సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం
పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలు సి.క్యాంపులోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం సమావేశ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వెంగళ్రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఎన్జీవో, ఏపీఆర్ఎస్ఏ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీజీఈఎఫ్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం 130 సంఘాల నాయకులతో కలిసి భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల నాయకులంతా హాజరై ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు.
కలెక్టర్కు సమ్మె నోటీసు అందజేత
తమకు పాత వేతనాలే కావాలి.. కొత్త పీఆర్సీ ప్రకారం వద్దని.. వచ్చే నెల 7 నుంచి తాము సమ్మెలోకి వెళ్తున్నామని పేర్కొంటూ ఏపీ ఐకాస జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు శనివారం కలెక్టర్ పి.కోటేశ్వరరావును కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. జనవరి నెల కొత్త వేతనాల కోసం ఖజానా శాఖ అధికారులు ఒత్తిడి చేయకుండా జోక్యం చేసుకోవాలంటూ కోరారు.
కలెక్టర్ పి.కోటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇస్తున్న ఏపీ ఐకాస జిల్లా
అధ్యక్షుడు వెంగళ్రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్