ఆపరేటర్ల అక్రమ రాతలు
విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారు ఆర్సీ గడువు ముగియడంతో నవీకరణ(రెన్యూవల్)కు... చిరునామా మార్చుకొనేందుకు దరఖాస్తు చేశారు. వాహన సామర్థ్యంగా సరిగా లేకపోవడంతో ఎంవీఐ నిరాకరించారు. కానీ అంతాబాగున్నట్లు డీబీఐ(కంప్యూటర్ ఆపరేటర్) వివరాలు నమోదు చేశారు.
●రవాణా శాఖలో పెరిగిన జోక్యం
అధికారుల పాస్ వర్డు తస్కరణ
న్యూస్టుడే, నంద్యాల క్రీడావిభాగం, పాత పట్టణం : విజయనగరానికి చెందిన ఓ వ్యక్తి తన కారు ఆర్సీ గడువు ముగియడంతో నవీకరణ(రెన్యూవల్)కు... చిరునామా మార్చుకొనేందుకు దరఖాస్తు చేశారు. వాహన సామర్థ్యంగా సరిగా లేకపోవడంతో ఎంవీఐ నిరాకరించారు. కానీ అంతాబాగున్నట్లు డీబీఐ(కంప్యూటర్ ఆపరేటర్) వివరాలు నమోదు చేశారు.
కొలిమిగుండ్లకు చెందిన ఓ వ్యక్తి లైసెన్సు కోసం మూడ్రోజుల కిందట దరఖాస్తు చేశారు. ఆన్లైన్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. పాస్ అయినట్లు కంప్యూటర్ ఆపరేటర్ వివరాలు నమోదు చేయడంతో లైసెన్సు మంజూరైంది.
రెండ్రోజుల కిందట డ్రైవింగ్ పరీక్షకు వచ్చిన ఓ వ్యక్తి ఫెయిల్ అయ్యారు. సంబంధిత వివరాలు కంప్యూటర్ ఆపరేటర్ నమోదు చేయకుండా ఏజెంట్తో మాట్లాడి ఆ రోజు సంబంధిత వ్యక్తి హాజరుకానట్లు నమోదు చేశారు. ఫెయిల్ అయినట్లు నమోదు చేస్తే రూ.300 నుంచి రూ.600 వరకు అపరాధరుసుము చెల్లించాల్సి ఉంటుంది.
రవాణా శాఖలో ఉన్నతాధికారుల నిఘా లేకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్లు అంతా తామై నడిపిస్తున్నారు. చేతినిండా సంపాదిస్తున్నారు. డ్రైవింగ్ రాకపోయినా లైసెన్సులు మంజూరు చేయిస్తున్నారు. ప్రతి పనికి ఓ ధర నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలకు ఒక లాగిన్(పాస్ వర్డు) ఇస్తారు. వారు తమ పరిధిలో ప్రమాద ఘటనల నివేదికలు, పన్ను డీఎల్లు, ఎఫ్సీలు, ఇతరత్రా అంశాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వీరికి సాయంగా ఇటీవల ఒప్పంద పద్ధతిలో కార్యాలయ స్థాయిని బట్టి ఒకరు లేక ముగ్గురు డీబీఏ (కంప్యూటర్ ఆపరేటర్)లను నియమించారు. సర్వర్, నెట్, ప్రింటింగ్, నెట్వర్క్కు తదితర పనులు వీరు చేపట్టాల్సి ఉంటుంది. వీరు ఎంవీఐల లాగిన్ తెలుసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, డోన్, ఆదోని ప్రాంతాల్లో ఆర్టీవో కార్యాలయాల్లో డీబీఏల దందా ఎక్కువైంది.
డ్రైవింగ్ పరీక్ష పూర్తి అయిన వెంటనే ఎంవీఐలు నివేదికను వారి లాగిన్లో నమోదు చేయాలి. వీరి పాస్వర్డ్లు తెలుసుకొన్న డీబీఏ(కంప్యూటర్ ఆపరేటర్లు)లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
●ఎంవీఐ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో ఫెయిల్ చేసినా డీబీఏలు.. ఏజెంట్లు, వాహనదారుల వద్ద కాసులు దండుకొని మార్చేస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండానే ఉత్తీర్ణులు(పాస్) చేసి పంపుతున్నారు.
ప్రతి పనికీ ఓ ధర నిర్ణయించి ఏకంగా రూ.5 వేలు తీసుకొంటున్నట్లు సమాచారం. నాలుగు చక్రాల వాహనాల పరీక్షలకు రూ.1000 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఏజెంట్లతో కుమ్మక్కై ఇదంతా నడిపిస్తున్నారు. నంద్యాలలో ఏకంగా ఓ అటెండర్లో ఎంవీఐ లాగిన్లో వేలిముద్ర వేయించడం చర్చనీయాంశంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు, ఆర్సీ కార్డులు ఏజెంట్లకు ఇచ్చి నగదు వసూలు చేస్తున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం : రమేశ్, ఇన్ఛార్జి డీటీసీ, కర్నూలు
జిల్లాలో చాలాచోట్ల ఏఎంవీఐలు కొత్తగా వచ్చారు. వారిపని వారే చేయాలని చెప్పాం. కార్యాలయాలు పరిశీలించి వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. వాహనదారులెవరు దళారులను నమ్మొద్ధు అన్నీ ఆన్లైన్ చేసుకొని కార్యాలయానికి రావొచ్ఛు ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఒరిజినల్ పత్రాలు ఉంటే పనిచేసి పంపిస్తారు.
జిల్లాలో రోజు వారీగా వచ్చే దరఖాస్తులు
●
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 24-04-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ