logo

క్రీడలతో ఒత్తిడి దూరం

పట్టణంలోని పురపాలక మైదానంలో ఆదివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను పురపాలక ఛైర్‌పర్సన్‌ శాంత, కమిషనర్‌...

Updated : 23 Jan 2022 16:39 IST

ఆదోని మార్కెట్‌: పట్టణంలోని పురపాలక మైదానంలో ఆదివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. పోటీలను పురపాలక ఛైర్‌పర్సన్‌ శాంత, కమిషనర్‌ కృష్ణ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయట పడేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ఇలాంటి పోటీలకు తమవంతు పూర్తి సహకారం అందిస్తామని వివరించారు. వివిధ శాఖల ఉద్యోగులు బృందాలుగా పోటీల్లో పాల్గొంటున్నారు. నిర్వాహకులు సునీల్‌ రాజ్‌కుమార్‌, రమేష్‌ నాయుడు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని