logo

వేడుక జరగాల్సిన ఇంట విషాదం

తెల్లవారితే పుట్టిన రోజు వేడుక జరుపుకోవాల్సిన విద్యార్థి రైలు పట్టాలపై శవమై తేలాడాడు. ఆదోని రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఆదోని రైల్వే ఎస్‌ఐ సుబ్బారాయుడు తెలిపిన వివరాల మేరకు

Published : 19 May 2022 06:27 IST

 రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య 


నాగప్ప(పాతచిత్రం)

ఆదోని పట్టణం, న్యూస్‌టుడే: తెల్లవారితే పుట్టిన రోజు వేడుక జరుపుకోవాల్సిన విద్యార్థి రైలు పట్టాలపై శవమై తేలాడాడు. ఆదోని రైల్వే పోలీసు స్టేషన్‌ పరిధిలో విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఆదోని రైల్వే ఎస్‌ఐ సుబ్బారాయుడు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం కార్వన్‌పేటకు చెందిన జి.చంద్రశేఖర్‌ కుమారుడు నాగప్ప(16) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఏడు గంటల సమయంలో త్వరగా వస్తానని తల్లికి ఫోన్‌ చేసినట్లు చెప్పారు. రాత్రి ఇంటికి రాకపోవటంతో స్నేహితులతో ఉంటాడని తల్లిదండ్రులు అనుకున్నారు. తీరా పట్టాలపై శవమై తేలాడని బోరున విలపించారు. ఆరోగ్య సమస్యలను భరించలేక ఆత్మ చేసుకున్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలోని శవగారానికి తరలించినట్లు వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని