ముగిసిన ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు
కొవిడ్ నేపథ్యంలో చదువులకు ఆటంకం కలిగి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిపారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 6వ తేదీన ఇంటర్ మొదటి ఏడాది, 7వ తేదీన ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. 268 కళాశాలల్లో చదు
కర్నూలు (విద్యా విభాగం), న్యూస్టుడే: కొవిడ్ నేపథ్యంలో చదువులకు ఆటంకం కలిగి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిపారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 6వ తేదీన ఇంటర్ మొదటి ఏడాది, 7వ తేదీన ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమయ్యాయి. 268 కళాశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 119 కేంద్రాలు ఏర్పాటు చేశామని, గురువారంతో ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు ముగిశాయని ఆర్ఐవో శంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం జరిగిన పరీక్షకు 32,625 మందికిగాను 31,301 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. 1,325 మంది గైర్హాజరయ్యారన్నారు. మొదటి ఏడాది ఇంటర్లో గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలు 11వ తేదీ జరగాల్సి ఉంది. తుపాను నేపథ్యంలో 25వ తేదీ నిర్వహించాలంటూ ఇంటర్ బోర్డు నుంచి జిల్లా కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయని ఆర్ఐవో తెలిపారు.
నేటి నుంచి మూల్యాంకనం
నగరంలోని ప్రభుత్వ (టౌన్) జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని 20వ తేదీ నుంచి ప్రారంభించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆర్ఐవో శంకర్ నాయక్ గురువారం తెలిపారు. ఇంగ్లిషు, తెలుగు, హిందీ, గణిత సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు చెప్పారు. కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మూల్యాంకనానికి హాజరు కావాల్సిన అధ్యాపకులకు ఇప్పటికే లేఖలు అందించినట్లు పేర్కొన్నారు. స్పాట్ వాల్యుయేషన్కు హాజరుకాని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం