logo

రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆదోని మండలం గనేకల్లు గ్రామ సమీప రహదారిపై కారు ఢీకొని రాముడు(42) అనే వ్యక్తి మృతి చెందాడు. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన రాముడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Updated : 20 May 2022 19:54 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని మండలం గనేకల్లు గ్రామ సమీప రహదారిపై కారు ఢీకొని రాముడు(42) అనే వ్యక్తి మృతి చెందాడు. పెద్ద తుంబలం గ్రామానికి చెందిన రాముడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రాముడు తెదేపా సీనియర్‌ నాయకుడు బసవరాజు కుమారుడు. విషయం తెలుసుకున్న తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పెద్ద తుంబలం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని