వైద్యుల ఖాళీశాల
కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుంది. ఇక్కడ చదువుకొన్నవారు దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, అనస్థీషియా, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ విభాగాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూకుమ్మడిగా వైద్యుల బదిలీలు చేపట్టింది.
పీజీ, యూజీ సీట్లు రద్దయ్యే ప్రమాదం
ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్ బదిలీ కావడంతో కేవలం నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. ఇక్కడ పీజీ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరవయ్యారు. ఇప్పటికిప్పుడు ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) అధికారులు పరిశీలనకొస్తే పీజీ సీట్లు రద్దయ్యే ప్రమాదముంది.
ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్, అసిస్టెంట్.. ఇద్దరూ బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఓ ప్రొఫెసర్ వచ్చి సెలవుపై వెళ్లారు. చేసేది లేక జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన పీజీలు, సీనియర్ రెసిడెన్సీలు బాధ్యతలు చూస్తున్నారు. ఈ విభాగానికి డీఎం సీట్ల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. గతంలో తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం మరోసారి ప్రతిపాదిస్తే ఇదే పరిస్థితి నెలకొంటుంది.
న్యూరో ఫిజీషియన్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బదిలీ కాగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కేవలం ఇద్దరు అసిస్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. ఈ విభాగానికి డీఎం సీట్లు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకొన్నారు. ప్రొఫెసర్ లేకపోవడంతో సీట్లు వచ్చే పరిస్థితి కానరావడం లేదు.
-న్యూస్టుడే, కర్నూలు వైద్యాలయం : కర్నూలు వైద్య కళాశాలకు ఎంతో పేరుంది. ఇక్కడ చదువుకొన్నవారు దేశ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, అనస్థీషియా, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ విభాగాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూకుమ్మడిగా వైద్యుల బదిలీలు చేపట్టింది. కర్నూలు వైద్య కళాశాల నుంచి 128 మంది బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా 28 మంది ప్రొఫెసర్లు, 25 మంది అసోసియేట్లు, 63 మంది అసిస్టెంట్లు, 13 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కర్నూలు వైద్య కళాశాలకు 18 మంది ప్రొఫెసర్లు, 28 అసోసియేట్లు, 52 మంది అసిస్టెంట్లు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సి గ్రేడ్కు పడిపోయింది.
పీజీలు రాకపోవచ్చు
జనరల్ మెడిసిన్ విభాగంలో బదిలీలు జరగకముందు ఆరుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్లు, 14 మంది అసిస్టెంట్లు ఉండగా.. ఈ విభాగంలో 20 పీజీ సీట్లు ఉన్నాయి. మార్చిలో ఆచార్యుల బదిలీలు జరిగిన తర్వాత ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్లు, ఏడుగురు అసిస్టెంట్లు ఉన్నారు. అనుభవం ఉన్న సీనియర్లు లేకపోవడంతో సమస్య ఏర్పడింది. ఈ విభాగంలో ఉన్న పీజీ సీట్లకు చాలా డిమాండ్ ఉండేది. బదిలీల తర్వాత ఆచార్యుల కొరత నేపథ్యంలో ప్రతిభావంతులైనవారు ఇక్కడ పీజీ చేసేందుకు మొగ్గు చూపకపోయే ప్రమాదముంది. మరోవైపు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు పరిశీలనకు వస్తే పీజీ సీట్లతోపాటు యూజీ సీట్లలోనూ కోత పడే ప్రమాదముంది. ఈ ప్రభావం రోగులపైనా పడుతుంది.
ఏ విభాగంలో ఎలా ఉందంటే
వైద్య కళాశాలలో ప్రధానంగా జనరల్ మెడిసిన్ విభాగం, ప్లాస్టిక్ సర్జరీ, రేడియాలజీ, న్యూరో ఫిజీషియన్, గైనిక్ వంటి విభాగాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ కాకపోతే రానున్న రోజుల్లో సూపర్ స్పెషాలిటీ విభాగానికి వచ్చిన డీఎం సీట్లు, జనరల్ మెడిసిన్, రేడియాలజీ వంటి విభాగాల్లో పీజీ సీట్లతోపాటు యూజీ సీట్లు తగ్గిపోయే ప్రమాదముంది.
న్యూరో సర్జరీ విభాగంలో పనిచేసే ప్రొఫెసర్ ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఈ విభాగంలో ఉన్నవారందరూ అసిస్టెంట్లే. అసోసియేట్లు లేకపోవడంతో ఈ విభాగానికి వచ్చిన డీఎం సీట్లను ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పరిశీలిస్తే ఈ సీట్లు ఉంటాయో? పోతాయో తెలియని పరిస్థితి.
అందని వైద్య సేవలు
పెద్దఎత్తున వైద్యుల బదిలీలు జరగడంతో కర్నూలు సర్వజన ఆస్పత్రిపైనా ప్రభావం చూపుతోంది. కర్నూలు పెద్దాస్పత్రికి రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం రోగులు వస్తుంటారు. పలు విభాగాల్లో వైద్యులు లేకపోవడంతో రోగులకు వైద్యం అందడం లేదు. ఫలితంగా రోగులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఇది శస్త్రచికిత్సలపైనా ప్రభావం చూపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?