ఊరు వీడారని.. అమ్మఒడిని దూరం చేశారు
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం వలస కూలీలకు శాపంగా మారింది. కొత్తగా నిబంధనల మేరకు పాఠశాలలు జరిగిన పనిదినాల్లో 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. దీంతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్లోని చాలా గ్రామాల్లోని
హాజరు శాతం తక్కువగా ఉందని వలస కూలీల పిల్లల అనర్హత జాబితా
ఆదోని విద్య, ఎమ్మిగనూరు, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి పథకం వలస కూలీలకు శాపంగా మారింది. కొత్తగా నిబంధనల మేరకు పాఠశాలలు జరిగిన పనిదినాల్లో 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. దీంతో పశ్చిమ ప్రాంతమైన ఆదోని డివిజన్లోని చాలా గ్రామాల్లోని వలస కూలీల పిల్లలకు అమ్మఒడి పథకం దూరమైంది.
పొట్టకూటికి వలస బాట
ఆదోని డివిజన్ పరిధిలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో వలసలు ఎక్కువ. స్థానికంగా ఉపాధిలేక చాలా మంది పొట్టకూటికి బెంగళూరు, హైదరాబాదు, గుంటూరు, ముంబయి వంటి నగరాలకు వలస వెళ్తుంటారు. ఆ సమయంలో చాలా మంది తమ పిల్లలనై బడికి పంపించకుండా వారి వెంటే తీసుకెళ్తుంటారు. అక్కడే రెండు మూడు నెలల పాటు పనులు చేసుకొని స్వగ్రామానికి వస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లకపోవడంతో పాఠశాలల్లో హాజరు శాతం తగ్గిపోతుంది.
శాపంగా 75 శాతం హాజరు
* అమ్మఒడి పథకానికి పాఠశాలల పనిదినాల్లో విద్యార్థులు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని కొత్త నిబంధనలు పెట్టడంతో వలస కూలీలకు శాపంగా మారింది. వలసలు అధికంగా వెళ్లే గ్రామాలను పరిశీలిస్తే.. ఒక్కో గ్రామంలో 10 నుంచి 20 మంది విద్యార్థులకు హాజరు శాతం లేక అమ్మఒడి పథకం అందలేదు.
* ఆదోని మండలం కె.నాగలాపురంలో అత్యధిక మంది గుంటూరు, బెంగళూరు వంటి నగరాలకు వలసలు వెళ్తుంటారు. కొందరు వారి పిల్లలను వెంట తీసుకెళ్తుంటారు.. మరికొందరు బంధువుల ఇళ్లకు పంపిస్తుంటారు. ఈ గ్రామంలో ఈ ఏడాది అమ్మఒడి 231 మందికి పథకం వర్తించగా.. 47 మందికి వివిధ కారణాలతో రాలేదు. ఇందులో దాదాపు 10 నుంచి 15 మంది వరకు విద్యార్థుల హాజరు శాతం లేక అందలేదు.
* ఆదోని మండలం కె.నాగలాపురంలో అత్యధిక మంది గుంటూరు, బెంగళూరు వంటి నగరాలకు వలసలు వెళ్తుంటారు. కొందరు వారి పిల్లలను వెంట తీసుకెళ్తుంటారు.. మరికొందరు బంధువుల ఇళ్లకు పంపిస్తుంటారు. ఈ గ్రామంలో ఈ ఏడాది అమ్మఒడి 231 మందికి పథకం వర్తించగా.. 47 మందికి వివిధ కారణాలతో రాలేదు. ఇందులో దాదాపు 10 నుంచి 15 మంది వరకు విద్యార్థుల హాజరు శాతం లేక అందలేదు.
ఎమ్మిగనూరు మండలం కడివెళ్లకు చెందిన శాంతమ్మ, రంగస్వామి దంపతులకు శ్రీలక్ష్మి, ప్రశాంతి, లోకేశ్ ముగ్గురు పిల్లలు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలుగా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పొలం లేక.. గ్రామంలో పనులు లేకపోవడంతో పిల్లలతో కలిసి గుంటూరుకు వలస వెళ్లారు. అక్కడే మూడు నెలల పాటు ఉండటంతో పాఠశాలలో పిల్లల హాజరు శాతం తగ్గిపోయింది. దీంతో ఈ ఏడాది ప్రభుత్వం పంపిణీ చేసిన అమ్మఒడి పథకం వర్తించదని అధికారులు చెప్పారు. కూటి కోసం వలస వెళ్తే అమ్మఒడి పథకం ఇవ్వకపోవడం బాధాకరమని విద్యార్థిని తల్లి శాంతమ్మ పేర్కొంటున్నారు.
చిత్రంలోని తల్లీకుమార్తె కొలిమి మహాదేవి, శైలజలది ఆదోని మండలం నాగలాపురం. శైలజ ఆదోని మండలం పెద్దతుంబళంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. మహాదేవి, యల్లప్ప దంపతులకు ఒక్క సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పనులు లేనిసమయంలో తిరుపతికి తాపీ పనులకు వలస వెళ్లారు. ఈ క్రమంలో శైలజను పెద్దకడబూరు మండలంలోని ముచ్చుమర్రిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి పంపారు. ఆ సమయంలో విద్యార్థిని పాఠశాలకు సరిగా హాజరు కాలేదు. హాజరు శాతం తక్కువగా ఉందని ఈ ఏడాది అమ్మఒడి పథకం వర్తించదని అధికారులు అనర్హత వేటు వేశారు. ‘‘ పొట్టకూటికి వలస వెళ్తే హాజరు శాతం పేరిట అమ్మఒడి పథకం రద్దు చేయడం బాధకరమని’’ మహాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
[ 19-04-2024]
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు