నేతల రాత... అర్హులకు వాత
సిఫార్సు లేఖలతో ఉపాధ్యాయుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ వరకు ఆగితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.. అప్పటి వరకు ఆగితే కోరుకున్న చోటుకు వెళ్లలేమని కొందరు
సిఫార్సులతో ఉపాధ్యాయుల బదిలీలు
కౌన్సెలింగ్ విధానానికి తూట్లు
ఈనాడు- కర్నూలు, కర్నూలు విద్య- న్యూస్టుడే: సిఫార్సు లేఖలతో ఉపాధ్యాయుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సెలింగ్ వరకు ఆగితే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.. అప్పటి వరకు ఆగితే కోరుకున్న చోటుకు వెళ్లలేమని కొందరు ఉపాధ్యాయులు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 207 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సీఎంవో తాజాగా ఆమోదం తెలిపింది. అందులో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వారు పది మంది వరకు ఉన్నారు. వీరంతా నేతల అనుగ్రహంతో కోరుకున్నచోటుకు బదిలీ చేయించుకోవడం గమనార్హం. కౌన్సెలింగ్తో కాకుండా సిఫార్సు లేఖలతో బదిలీలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ప్రక్రియ ఎప్పుడో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని చేసే ఉపాధ్యాయులు 14,035 మంది వరకు ఉంటారు. ఎయిడెడ్లో 636 మంది విధులు నిర్వహిస్తున్నారు. 2020లో కౌన్సెలింగ్ సమయంలో సుమారు తొమ్మిదివేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నాలుగు వేల మందిని అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరులో ముగియనుంది. ఆ వెంటనే ఉపాధ్యాయుల బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. జీరో సర్వీసు లేదా ఎనిమిదేళ్ల సర్వీసు ఈ రెండింటిలో ఏదో ఒక అవకాశం ఇవ్వొచ్చు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి అవకాశం ఇస్తే 40-50 శాతం మంది అర్హులుగా ఉంటారు.
అర్హులకు అన్యాయం
ఒకేచోట ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు త్వరలో కౌన్సెలింగ్ విధానంలో జరిగే బదిలీ ప్రక్రియలో తప్పని సరిగా కదలాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ నిర్వహిస్తే దగ్గర ప్రాంతాలకు వెళ్లొచ్చని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘‘ కొందరు సిఫార్సు లేఖలతో బదిలీ చేయించుకోవడంతో తాము ఎక్కడో సుదూరాన ఉండే పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది.. తీవ్ర అన్యాయం జరిగినట్టేనని’’ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం జరిగిన బదిలీల్లో ప్రస్తుతం పని చేస్తున్న, కోరుకున్న ప్రాంతం, సిఫార్సు చేసిన ప్రజాప్రతినిధుల పేర్లతో సహా వెల్లడించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు భారీగా ఖర్చు పెట్టి నేతల సిఫార్సు లేఖలు పొందినట్లు సమాచారం.
ఎక్కడికి ఎవరు
* మద్దికెర మండలం మదనంతపురం నుంచి కల్లూరుకు, హోళగుంద మండలం నుంచి గడివేములకు వచ్చేందుకు ఇద్దరు ఉపాధ్యాయులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని సిఫార్సు లేఖలు తీసుకున్నట్లు సమాచారం.
* ఆదోని మండలం పెద్దహరివాణం నుంచి పాణ్యం పరిధిలో బలపనూరు, ప్రకాశం జిల్లా కంభం పరిధిలోని తురిమిళ్ల నుంచి కర్నూలు నగరంలో కింగ్మార్కెట్ గర్ల్స్ హైస్కూలుకు వస్తామని ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ సిఫార్సు లేఖలు పొందారు.
* కోసిగి నుంచి వెలుగోడుకు, కొలిమిగుండ్ల నుంచి నంద్యాల పట్టణానికి సమీప ప్రాంతానికి, ఉయ్యాలవాడ నుంచి పొద్దుటూరుకు బదిలీ కావాలంటూ ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్( ప్రకాశం జిల్లా దర్శి), శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి (నంద్యాల) , రాచమల్లు శివప్రసాద్రెడ్డి (పొద్దుటూరు)ల సిఫార్సు తీసుకున్నారు.
* అనంతపురం జిల్లా గంగవరం నుంచి కర్నూలు నగర సమీపంలోని గార్గేయపురానికి ఓ ఉపాధ్యాయుడు మంత్రి ఉషశ్రీ చరణ్, ఉయ్యాలవాడ ఆదర్శ పాఠశాల నుంచి తిరుపతి లేదా శ్రీకాళహస్తి ఆదర్శ పాఠశాలకు వెళ్తానని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి లేఖ జత చేశారు.
* అనంతపురం జిల్లా రాయదుర్గం ఆదర్శ పాఠశాల నుంచి మద్దికెర ఆదర్శ పాఠశాలకు వచ్చేందుకు అసిస్టెంట్ సీఎంవోతోపాటు అనంతపురం ఎంపీ తలారి రంగయ్య సిఫార్సులేఖ పెట్టారు.
సిఫార్సుల విధానం రద్దు చేయాలి
- కాకి ప్రకాశరావు, ఫ్యాప్టో రాష్ట్ర కో-ఛైర్మన్
సిఫార్సు లేఖలతో జరుగుతున్న బదిలీల వల్ల అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతారు. ఈ విధానానికి మేము పూర్తిగా వ్యతిరేకం. కౌన్సెలింగ్ విధానం పక్కా అమలు చేసి.. సిఫార్సుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.
ఉత్తర్వులు సవరించాలి
- హెచ్.తిమ్మన్న, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి
ఏశాఖలో లేనివిధంగా పదేళ్లుగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కౌన్సెలింగ్ విధానంలో జరుగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం సిఫార్సుల బదిలీలకు శ్రీకారం చుట్టడం బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా జరుగుతున్న బదిలీలు వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం విడుదల చేసిన 117 ఉత్తర్వులు తక్షణం సవరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 23-04-2024]
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే తెదేపాతోనే సాధ్యమని తెదేపా అభ్యర్థి బీవీ జయనగేశ్వరరెడ్డి అన్నారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
‘చేదోడు’.. జగన్ చెడుగుడు
[ 23-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. -
పారిశ్రామిక వాడ.. జగన్ విధ్వంస జాడ
[ 23-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
జగన్ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి
[ 23-04-2024]
‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. -
ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
[ 23-04-2024]
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. -
అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్ వేశారు. -
ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన
[ 23-04-2024]
కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. -
నగరడోణ.. కల తీరేనా
[ 23-04-2024]
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. -
నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
[ 23-04-2024]
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. -
పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 23-04-2024]
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు. -
సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...
[ 23-04-2024]
ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 23-04-2024]
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 23-04-2024]
ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్రెడ్డి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
నాలుగో రోజు జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. -
అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్