పేదల భూములపై పెద్దల పెత్తనం
తరతరాల నుంచి వచ్చిన భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి పొలం తప్పితే మరో ఆధారం లేదు. ఆక్రమణదారుల చూపు వారి భూములపై పడింది. అధికార.. రాజకీయ అండదండతో ఆన్లైన్లో తమ పేరిట నమోదు చేయించుకున్నారు.
న్యాయం కోసం బాధితుల విన్నపం
నంద్యాల పట్టణం, న్యూస్టుడే: తరతరాల నుంచి వచ్చిన భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి పొలం తప్పితే మరో ఆధారం లేదు. ఆక్రమణదారుల చూపు వారి భూములపై పడింది. అధికార.. రాజకీయ అండదండతో ఆన్లైన్లో తమ పేరిట నమోదు చేయించుకున్నారు. పేదల ఆస్తులు కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. న్యాయం చేయండని బాధితులు ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించాలని సోమవారం బాధితులు కలెక్టరేట్లో విన్నవించారు.
తొమ్మిదేళ్లుగా నిరాశే..
భర్త, కుమారుడు మృతిచెందడంతో డోన్ మండలం మల్యాలకు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు అంకాలు వెంకమ్మ ఒక్కరే జీవనం సాగిస్తున్నారు. ఆమె పేరిట 13 ఎకరాలు ఉంది. ఆ భూమిపై పెద్దల కన్ను పడింది. రాజకీయ అండతో ఒక నాయకుడు ఆన్లైన్లో తన పేరిట నమోదు చేయించుకున్నారు. న్యాయం కోసం వెంకమ్మ తొమ్మిదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. గ్రామ వీఆర్వో నుంచి తహసీల్దారు వరకు అందరినీ వేడుకున్నారు. కర్నూలు కలెక్టరేట్ చుట్టూ ఏళ్ల నుంచి తిరుగుతున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. గతేడాది రూ.4 లక్షల పెట్టుబడి పెట్టి పొలంలో కంది సాగు సాగు చేస్తే వర్షానికి దెబ్బతినింది. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పంట నష్టపరిహారం పొలం లాక్కున్న నాయకుడి ఖాతాలోనే జమైంది. ‘‘ రెండేళ్ల కిందట కింద పడటంతో నడవడం కష్టంగా మారింది... వాకర్ సాయంతో అడుగులు వేస్తూనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదని’’ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధారం అన్యాక్రాంతం
పాణ్యం మండలం పిన్నాపురానికి చెందిన ఎల్లమ్మ వయసు 60 ఏళ్లు. చాలాకాలం కిందట బతుకుదెరువు కోసం గడిగరేవులకు వెళ్లారు. ఆమె భర్తకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఆరుగురు సంతానం. ఎల్లమ్మకు ఇద్దరు పిల్లలు. ఆమెకు పిన్నాపురంలో రెండు ఎకరాల పొలం ఉండగా.. గ్రామానికి చెందిన కొందరు ఆన్లైన్లో తమ పేరిట నమోదు చేసుకున్నారు. ఎనిమిది మంది సంతానం, ఇద్దరు పెద్దలు ఉన్న కుటుంబానికి రెండు ఎకరాల పొలమే ఆధారం. ఆ పొలాన్ని అక్రమంగా కొందరు దస్త్రాల్లో ఎక్కించుకున్నారు. ‘‘ న్యాయం చేయాలని నాలుగేళ్లుగా కర్నూలు కలెక్టరేట్, పాణ్యం తహసీల్దారు కార్యాలయాలకు వెళ్లి వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.. అనారోగ్యంతో నడవడమే కష్టంగా ఉంది.. తమకు న్యాయం చేయమని కోరితే అధికారులు కసురుకుంటున్నారని’’ ఆమె న్యూస్టుడేతో వాపోయారు.
కొలత వేయరు.. కలత తీర్చరు
బండిఆత్మకూరు మండలం జీసీ పాలేనికి చెందిన శ్రీదేవి, రామలక్ష్మిలకు రెండెకరాల పొలంతో పాటు మరికొందరి పొలం ఆక్రమణకు గురైందని నాలుగేళ్ల కిందట బండిఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాటి నుంచి నేటి వరకు కనీసం కొలతలు వేయడానికీ ఎవరూ రావడం లేదు. సర్వే సంఖ్య 469లో 10.99 ఎకరాల భూమిలో ఎకరాన్నర వరకు ఆక్రమించారు.. కొలతలు వేసి న్యాయం చేయాలని అడిగితే సరిగ్గా కొలువకుండా వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. అధికారులు పొలం కొలతలు వేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఇంటింటి ప్రచారం
[ 23-04-2024]
కౌతాళం మండలంలోని కుంటనహళు గ్రామాల్లో కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణ రెడ్డి, తెలుగు యువత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
తెదేపా నాయకుల ప్రచారం
[ 23-04-2024]
మండలంలో ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు తరఫున తెదేపా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్, ఇతర నాయకులు, కార్యకర్తలు కున్నూరు, లింగందిన్నె గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. -
చీనీ తోటలో అగ్ని ప్రమాదం
[ 23-04-2024]
మండలంలోని బైలుప్పల గ్రామంలో మాధవరెడ్డి సాగు చేసిన చీని తోట అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు మంటలను అదుపు చేశారు. -
తెదేపా ఎన్నికల ప్రచారం
[ 23-04-2024]
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటే తెదేపాతోనే సాధ్యమని తెదేపా అభ్యర్థి బీవీ జయనగేశ్వరరెడ్డి అన్నారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడాలి
[ 23-04-2024]
రాష్ట్రంలో వైకాపా పాలనకు చరమగీతం పాడాలని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
‘చేదోడు’.. జగన్ చెడుగుడు
[ 23-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. -
పారిశ్రామిక వాడ.. జగన్ విధ్వంస జాడ
[ 23-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటు పక్కన పెట్టింది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను వైకాపా నాయకులు ధ్వంసం చేయడం తప్ప ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
జగన్ ఏలు‘బడి’.. ఫలితం బోల్తాపడి
[ 23-04-2024]
‘కాలం’ కలిసి రాలేదు.. పిల్లాజెల్లా వలసబాట పట్టారు.. పశ్చిమాన ఊళ్లు ఖాళీ అయ్యాయి.. విద్యార్థుల్లేక తరగతి గదులు వెలవెలబోయాయి.. గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గొప్పగా చెప్పే సీఎం జగన్ పట్టించుకోలేదు.. ఫలితం తిరగబడింది.. -
ఒకటినే వేతనాలు చెల్లించేలా చట్టం చేయాలి
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు వేతనాలు ఏరోజు వస్తాయో తెలియక అయోమయానికి గురవుతున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
ఐదేళ్ల అధికారం.. 2కి.మీ కాల్వ నిర్మించలేదు
[ 23-04-2024]
శ్రీశైలం ఎగువన (ఫోర్ షోర్) సుమారు 4.8 కి.మీ. దూరంపాటు అప్రోచ్ కాలువ నిర్మించి 40 టీఎంసీల కృష్ణా జలాలను మల్యాల ఎత్తిపోతల పథకం వరకు తరలించి అక్కడ నీటిని ఎత్తిపోస్తున్నారు. -
అందుబాటులో ఉంటా అభివృద్ధి చేస్తా
[ 23-04-2024]
నంద్యాల ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి తెదేపా తరఫున సోమవారం ఆమె నామినేషన్ వేశారు. -
ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన
[ 23-04-2024]
కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. -
నగరడోణ.. కల తీరేనా
[ 23-04-2024]
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. -
నిర్లక్ష్యానికి శిలా సాక్ష్యాలు
[ 23-04-2024]
వరద నీరు వృధా కాకుండా, కడప జిల్లాలో 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకై రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నదిపై 2.95టీఎంసీల సామర్థ్యంతో రాజోలి జలాశయం నిర్మాణానికి 2008లో బీజం పడింది. -
పల్లెల అభివృద్ధి భాజపాతోనే సాధ్యం
[ 23-04-2024]
ఆదోని మండలం జాలిమంచి గ్రామానికి చెందిన 80 మంది భాజపా అభ్యర్థి పార్థసారథి సమక్షంలో పార్టీలో చేరారు. -
సాయన్నా ఈ నరకయాతనకు కారకులెవరో...
[ 23-04-2024]
ఆదోని పట్టణంలో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్రెడ్డి నామినేషన్ సందర్భంగా సోమవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పట్టణ దారులను విస్తరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అది నెరవేరక ఇరుకు దారులే మిగిలాయి. -
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం
[ 23-04-2024]
జిల్లాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, పార్టీ ఎన్నికల రాష్ట్ర సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. -
అభ్యర్థులు.. ఆస్తులు
[ 23-04-2024]
ఆదోని వైకాపా అభ్యర్థిగా సాయిప్రసాద్రెడ్డి సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన కుటుంబానికి సంబంధించిన స్ధిర, చర ఆస్తుల వివరాలతో పాటుగా బంగారు ఆభరణాలు, భూముల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
నాలుగో రోజు జోరుగా నామినేషన్లు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్తోపాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. 34 మంది అభ్యర్థులు 38 సెట్ల నామపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. -
అంగట్లో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత డేటా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రజల కీలకమైన వ్యక్తిగత డేటా విచ్చలవిడిగా చేతులు మారుతోందని వైకాపా కార్యకర్త, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కామిని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ