నేతల సిఫోర్సు
ఉద్యోగుల బదిలీలకు పెద్దఎత్తున పైరవీలు
కర్నూలు జడ్పీ, న్యూస్టుడే : ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. బదిలీలకు రెండు రోజులే గడువు ఉండటంతో పంచాయతీ ఉద్యోగులు నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా అడిగిన వారందరికీ ‘సిపార్సు’ లేఖలు ఇస్తున్నారు. తాము కోరుకున్న కేంద్రానికి బదిలీపై వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు నేతలకు ‘సొమ్ములు’ సమర్పించుకుంటున్నారు. జడ్పీ, మండల పరిధిలో 301 మందికి స్థాన చలనం కలగనుంది. చాలామంది ఉద్యోగులు నేతల సిఫార్సు లేఖలతోనే బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి సంబంధిత ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో దరఖాస్తు ఇవ్వడంతో జడ్పీ కార్యాలయానికి సిఫార్సు లేఖలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి.
బదిలీలపై కసరత్తు
సిఫార్సు లేఖలతోపాటు సంబంధిత నేతల నుంచి జడ్పీ అధికారులపై పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోవైపు గత రెండు రోజులుగా జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు బదిలీలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలను పక్కనబెడితే ఏ సమస్య వస్తుందన్న ఆందోళనతోపాటు.. పరిగణనలోకి తీసుకుంటే నిబంధన మేరకు ఎలా బదిలీలు చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..
పంచాయతీ కార్యదర్శుల బదిలీలు నేతలకు మరింత కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమకు అనుకూలమైన కార్యదర్శులను కొందరు నేతలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. మరికొందరు కార్యదర్శులు తమకు ఇష్టమైన కేంద్రానికి బదిలీ చేయించుకునేందుకు నేతల వద్దకు క్యూ కట్టారు. ఇప్పటికే లేఖలతో కూడిన దరఖాస్తులు డీపీవో కార్యాలయానికి అందజేశారు.
* ఉభయ జిల్లాలో 973 గ్రామ పంచాయతీల్లో 200 మంది కార్యదర్శులకు స్థాన చలనం కలగనుంది. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉమ్మడి జిల్లాలో బదిలీలకు అవకాశముండటంతోపాటు పంచాయతీ గ్రేడుల ఆధారంగా కార్యదర్శులను బదిలీ చేయాల్సి ఉంది. కాగా నిబంధనలు పక్కన పెట్టి మరీ తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
* కార్యదర్శులను బదిలీ చేసే అధికారం కలెక్టరుకు ఉండటంతో సిఫార్సు లేఖలు డీపీవో కార్యాలయానికి చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 53 ఈవోఆర్డీలకుగాను 20 మందికి స్థాన చలనం కలగనుంది. ఇప్పటికే కొందరు ఈవోఆర్డీలు పరస్పర బదిలీలు (మ్యూచువల్) చేయించుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
-
World News
Kabul: కాబుల్ మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం?
-
World News
Srilanka: బ్యాంకాక్లో గొటబాయ.. 24న శ్రీలంకకు తిరిగొచ్చేస్తున్నారట!
-
Crime News
Dalit Boy Death: 23రోజుల్లో 6 ఆస్పత్రులు తిప్పినా.. దక్కని బాలుడి ప్రాణం
-
Politics News
Koppula Eshwar: మంత్రి కొప్పులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
Politics News
Nitish Kumar: నీతీశ్ కేబినెట్లో72% మందిపై క్రిమినల్ కేసులు.. 27మంది కోటీశ్వరులే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Biden: దగ్గిన చేతితోనే పెన్ను ఇచ్చి, కరచాలనం చేసి..!
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Bihar: అరెస్టు వారెంటున్న నేత.. న్యాయశాఖ మంత్రిగా ప్రమాణం..!
- Tollywood: విజయేంద్రప్రసాద్ కథతో భారీ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
- Chandrababu: ఎన్నికలకు సమయం లేదు.. దూకుడు పెంచాలి: చంద్రబాబు
- Crime news: ‘టీ’లో విషం కలిపి ముగ్గురు పిల్లలను హత్యచేసిన తల్లి
- Shyam Singha Roy: ఆస్కార్ నామినేషన్ల పరిశీలన రేసులో ‘శ్యామ్ సింగరాయ్’
- Heart Health: చేపలతో గుండెకెంత మేలో తెలుసా..?
- Balakrishna: నమ్మకంతో గెలిపిస్తే.. నీలిచిత్రాలు చూపిస్తారా?.. ఎంపీ మాధవ్పై బాలకృష్ణ ఫైర్