నేతల సిఫోర్సు
ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. బదిలీలకు రెండు రోజులే గడువు ఉండటంతో పంచాయతీ ఉద్యోగులు నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా అడిగిన వారందరికీ ‘సిపార్సు’ లేఖలు ఇస్తున్నారు. తాము కోరుకున్న కేంద్రానికి బదిలీపై వెళ్లేందుకు
ఉద్యోగుల బదిలీలకు పెద్దఎత్తున పైరవీలు
కర్నూలు జడ్పీ, న్యూస్టుడే : ఉద్యోగుల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. బదిలీలకు రెండు రోజులే గడువు ఉండటంతో పంచాయతీ ఉద్యోగులు నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా అడిగిన వారందరికీ ‘సిపార్సు’ లేఖలు ఇస్తున్నారు. తాము కోరుకున్న కేంద్రానికి బదిలీపై వెళ్లేందుకు కొందరు ఉద్యోగులు నేతలకు ‘సొమ్ములు’ సమర్పించుకుంటున్నారు. జడ్పీ, మండల పరిధిలో 301 మందికి స్థాన చలనం కలగనుంది. చాలామంది ఉద్యోగులు నేతల సిఫార్సు లేఖలతోనే బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. బదిలీ కోరుకునే ప్రతి ఉద్యోగి సంబంధిత ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో దరఖాస్తు ఇవ్వడంతో జడ్పీ కార్యాలయానికి సిఫార్సు లేఖలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి.
బదిలీలపై కసరత్తు
సిఫార్సు లేఖలతోపాటు సంబంధిత నేతల నుంచి జడ్పీ అధికారులపై పెద్దఎత్తున ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోవైపు గత రెండు రోజులుగా జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు బదిలీలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలను పక్కనబెడితే ఏ సమస్య వస్తుందన్న ఆందోళనతోపాటు.. పరిగణనలోకి తీసుకుంటే నిబంధన మేరకు ఎలా బదిలీలు చేయాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..
పంచాయతీ కార్యదర్శుల బదిలీలు నేతలకు మరింత కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమకు అనుకూలమైన కార్యదర్శులను కొందరు నేతలు ఏరికోరి తెచ్చుకుంటున్నారు. మరికొందరు కార్యదర్శులు తమకు ఇష్టమైన కేంద్రానికి బదిలీ చేయించుకునేందుకు నేతల వద్దకు క్యూ కట్టారు. ఇప్పటికే లేఖలతో కూడిన దరఖాస్తులు డీపీవో కార్యాలయానికి అందజేశారు.
* ఉభయ జిల్లాలో 973 గ్రామ పంచాయతీల్లో 200 మంది కార్యదర్శులకు స్థాన చలనం కలగనుంది. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఉమ్మడి జిల్లాలో బదిలీలకు అవకాశముండటంతోపాటు పంచాయతీ గ్రేడుల ఆధారంగా కార్యదర్శులను బదిలీ చేయాల్సి ఉంది. కాగా నిబంధనలు పక్కన పెట్టి మరీ తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు కొందరు నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
* కార్యదర్శులను బదిలీ చేసే అధికారం కలెక్టరుకు ఉండటంతో సిఫార్సు లేఖలు డీపీవో కార్యాలయానికి చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 53 ఈవోఆర్డీలకుగాను 20 మందికి స్థాన చలనం కలగనుంది. ఇప్పటికే కొందరు ఈవోఆర్డీలు పరస్పర బదిలీలు (మ్యూచువల్) చేయించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?