శస్త్రచికిత్సలకు మత్తు విఘాతం
కర్నూలు సర్వజన వైద్యశాలలో ‘మత్తు’ (అనస్థీషియా) ఔషధాల కొరత శస్త్రచికిత్సలకు ఆటంకంగా మారింది. న్యూరో సర్జరీ విభాగంలో శుక్రవారం ముగ్గురికి శస్త్రచికిత్సలు నిలిపివేశారు. ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని
సర్వజన వైద్యశాలలో ఔషధాల కొరత
సర్వజన ఆసుపత్రిలో రోగులు
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే: కర్నూలు సర్వజన వైద్యశాలలో ‘మత్తు’ (అనస్థీషియా) ఔషధాల కొరత శస్త్రచికిత్సలకు ఆటంకంగా మారింది. న్యూరో సర్జరీ విభాగంలో శుక్రవారం ముగ్గురికి శస్త్రచికిత్సలు నిలిపివేశారు. ప్రస్తుతానికి ఇబ్బందుల్లేవని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని డ్రగ్ స్టోర్ అధికారులు చెబుతున్నా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. మత్తు ఔషధం కొరతతో నెల రోజులుగా కొన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదు. విధిలేని పరిస్థితిలో వాయిదా వేయాల్సి వస్తోందని అనస్థీషియా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
నిత్యం 100 నుంచి 120 ఆపరేషన్లు
సర్వజన వైద్యశాలకు ఉమ్మడి కర్నూలు, అనంతపురం, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. నిత్యం 100 నుంచి 120 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. నెలకు 3 వేలు.. ఏడాదికి 25 వేల నుంచి 30 వేల వరకు ఆపరేషన్లు జరుగుతాయి. జనవరి నుంచి మే వరకు పరిశీలిస్తే 8,107 మేజర్, 6,545 మైనర్ శస్త్రచికిత్సలు జరిగాయి. ఇటీవల మత్తు ఇంజెక్షన్ల కొరత నెలకొనడంతో శస్త్రచికిత్సలు వాయిదా వేస్తూ ఉన్నారు.
నెల రోజులుగా సరఫరా లేదు - శర్మ, డ్రగ్ స్టోర్ ఇన్ఛార్జి
సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి గత నెల రోజులుగా మత్తు మందు ఔషధాలు సరఫరా కావడం లేదు.. శస్త్రచికిత్సలకు ఇబ్బందులు లేకుండా స్థానికంగా ( లోకల్ పర్చేజ్ కింద) గత 15 రోజులుగా కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాం.
పెరిగిన ధరలు.. ఆగిన సరఫరా
* శస్త్రచికిత్స చేసే సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు.. కండరాలు వదులుగా ఉండేలా భిన్నరకాలు ఔషధాలు వినియోగిస్తారు. పెద్దాస్పత్రిలో ప్రధానంగా అత్యవసర విభాగం, గైనిక్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ, ఈఎన్టీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియో థొరాసిక్ సర్జరీ వంటికి కీలక విభాగాలు ఉన్నాయి.
* రెండోదశ కొవిడ్ అనంతరం అనస్థీషియా ఔషధాల ధరలు 50 నుంచి 100 శాతం మేర పెరిగాయి. ఫలితంగా గుత్తేదారులు గత కొంతకాలంగా వెక్యురోనియమ్, ఎట్రాక్యూరియమ్, ఫెటినల్ తదితర ఔషధాలు సరఫరా చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి సరఫరా కాకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఆసుపత్రిలో పైన పేర్కొన్న మత్తు మందులు నిత్యం నాలుగు వందల వైల్స్ వరకు వినియోగిస్తారు. శస్త్రచికిత్స అయ్యేలోపు రోగికి సుమారు రెండు మూడుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎట్రాక్యూరియమ్ మందు ప్రతి పది నిమిషాలకోసారి ఇస్తారు. కండరాలు వదులుగా ఉండేందుకు దీనిని వినియోగిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా