బుస్సుమంటున్న బస్సు
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం దూర‘భారం’కానుంది. డీజిల్ సెస్ పేరుతో ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచింది. తక్కువ దూరం వెళ్లేవారిపై ప్రభావం తక్కువగా ఉన్నా దూర ప్రయాణాలు సాగించేవారిపై భారీగా భారం మోపింది. ఉమ్మడి జిల్లాలో నైట్ రైడర్ 2, ఇంద్ర 19, సూపర్లగ్జరీ 159
పెరిగిన ఛార్జీలతో హడలుతున్న జనం
కర్నూలు ఆర్టీసీ, న్యూస్టుడే: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం దూర‘భారం’కానుంది. డీజిల్ సెస్ పేరుతో ప్రభుత్వం మరోసారి ఛార్జీలు పెంచింది. తక్కువ దూరం వెళ్లేవారిపై ప్రభావం తక్కువగా ఉన్నా దూర ప్రయాణాలు సాగించేవారిపై భారీగా భారం మోపింది. ఉమ్మడి జిల్లాలో నైట్ రైడర్ 2, ఇంద్ర 19, సూపర్లగ్జరీ 159, అల్ట్రా 38, ఎక్స్ప్రెస్ 188, పల్లెవెలుగు 519 బస్సులు ఉన్నాయి. నిత్యం మూడు లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. వీటి కోసం నిత్యం 60 వేల లీటర్ల ఇంధనం వినియోగిస్తున్నారు. చమురు ధరలు తగ్గినా టికెట్ ధరలు పెంచడం గమనార్హం.
ప్రధాన నగరాలకు
* కర్నూలు నుంచి బెంగళూరుకు 12, చెన్నై 6, తిరుపతి 4, విజయవాడ 18, హైదరాబాద్ 8, నెల్లూరు 2, విశాఖ 1, వేలూరుకు 2 బస్సులు వెళ్తాయి. ఇందులో 80 శాతం వరకు ఓఆర్ ఉంది. ఇంద్ర బస్సుల్లో సెస్ భారం ఎక్కువగా ఉంది.. ఒక్కో టికెట్పై రూ.100పైగా పెరిగింది.
* కర్నూలు నుంచి విజయవాడకు నైట్ రైడర్ బస్సు నడుస్తోంది. 40 సీట్ల కెపాసిటీ ఉన్న ఈ బస్సులో ఛార్జీ రూ.750 నుంచి రూ.850కు పెరిగింది. నిత్యం 80 శాతం ఓఆర్తో నడుస్తోంది. టికెట్పై రూ.100 పెరగడంతో రూ.3 వేల నుంచి 4 వేల వరకు ఆదాయం వస్తుంది.
జిల్లాలో ప్రధాన పట్టణాలకు
కర్నూలు నుంచి ఆదోనికి 15, ఆళ్లగడ్డ 5, ఆత్మకూరు 20, బనగానపల్లి 5, డోన్ 2, కోవెలకుంట్ల 8, శ్రీశైలం 8, నంద్యాలకు 30 వరకు ఎక్స్ప్రెస్ బస్సులు వెళ్తాయి. నిత్యం 75 నుంచి 80 శాతం మేర ఓఆర్ వస్తుంది. ప్రసుత్తం ఒక్కో టికెట్పై సగటున రూ.10 చొప్పున పెంచారు.
శ్రీశైలానికి వెళ్లాలంటే
కర్నూలు నుంచి శ్రీశైలానికి నిత్యం నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులు 8 ట్రిప్పులు నడుస్తున్నాయి. ఒక్కో టికెట్పై రూ.40 పెరిగింది. సూపర్ లగ్జరీ బస్సులో రూ.100 పెరిగింది.
నంద్యాల జిల్లాకు అధిక లాభం
డీజిల్ సెస్ ఛార్జీలు పెరగడంతో నంద్యాల జిల్లాకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ జిల్లా పరిధిలో నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, కోవెలకుంట్ల, బనగానపలి, డోన్, నందికొట్కూరు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి అధిక భాగం బస్సులు నంద్యాల జిల్లాల నుంచి నడుస్తున్నాయి. పెరిగిన డీజిల్ సెస్ ప్రభావంతో రోజుకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుందని ప్రజా రవాణాధికారులు అంచనా వేస్తున్నారు.
పాత కొత్త
కర్నూలు నుంచి దూర ప్రాంతాలకు బస్సు ఛార్జీలు (రూ.లలో)
కర్నూలు నుంచి ప్రధాన పట్టణాలకు ఎక్స్ప్రెస్ ఛార్జీలు (రూ.లలో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ