రూ.కోటి స్థలంపై కన్నేసిన అధికారం
డోన్ పట్టణంలో అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు తెగించేస్తున్నారు. ఇటీవల పట్టణ సమీపంలో మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని గుడి పేరుతో ఓ నాయకుడు ఆక్రమించేందుకు పావులు కదిపారు. దొరపల్లెగుట్ట సమీపంలో ఓ వ్యక్తికి చెందిన పట్టా పొలంలోకి వెళ్లిన ఓ
357 సర్వే నంబరులో జేసీబీతో చదును చేశారు ఇలా
డోన్, న్యూస్టుడే: డోన్ పట్టణంలో అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలకు తెగించేస్తున్నారు. ఇటీవల పట్టణ సమీపంలో మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని గుడి పేరుతో ఓ నాయకుడు ఆక్రమించేందుకు పావులు కదిపారు. దొరపల్లెగుట్ట సమీపంలో ఓ వ్యక్తికి చెందిన పట్టా పొలంలోకి వెళ్లిన ఓ నాయకుడు ఆ భూమి తనదేనంటూ ఆక్రమించేశాడు. ఇలా ప్రైవేటు వ్యక్తుల పొలాల్లోకి వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా 357 సర్వే నంబరులో ఖాళీ ఉన్న రూ.కోటి విలువైన స్థలంపై అధికారం కన్నేసి కాలు మోపేందుకు సన్నద్ధమైంది.
పట్టపగలే చదును పనులు
డోన్ పట్టణంలో జాతీయ రహదారి పక్కన 357 సర్వే నంబరులో దాదాపు 10 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో సాగు చేసుకోవడానికి ఐదుగురికి ఎనిమిది ఎకరాల వరకు ఇచ్చారు. మరికొంత వాగులో కలిసింది. ఆ పక్కనే ఉన్న స్థలం ఖాళీగా ఉంది. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం... సమీపంలో వెంచర్ వేయడంతో ఇక్కడ సెంటు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పలుకుతోంది. 70 సెంట్లకుపైగా పొలంలో 20 సెంట్ల వరకు వాగు వెళ్తుంది... మిగతా 50 సెంట్ల వరకున్న స్థలం రూ.కోటి వరకు పలుకుతోంది. ఖాళీ స్థలంపై అధికార పార్టీకి చెందిన ముగ్గురు నాయకుల కన్ను పడింది. చేతిలో అధికారం ఉంది కదా ! పట్టపగలే జేసీబీతో చదును చేయించే పనులు చేపట్టారు. 60 అడుగుల వరకున్న వాగును పక్కనున్న స్థలాన్ని ఆక్రమించేందుకు మట్టిని తోలారు.
మాదంటే... మాదంటూ
357 సర్వే నంబరులో వాగు వెళ్తుండగా పక్కన కొంత ఖాళీ స్థలం ఉంది. అది చుక్కల భూమి( ఎవరికీ ఎలాంటి పట్టాలు) అని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.కొన్నేళ్ల కిందట పట్టాలు ఇచ్చారు.. తాము చదును చేసుకున్న స్థలంలో పునాదులు తవ్వే పనులు చేపట్టగా అధికార పార్టీ నాయకులు అడ్డుతలుగుతున్నారని కొందరు మహిళలు, పేదలు వాపోయారు. ఆ స్థలం తమదేనంటూ అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్నారు.
ఆ భూమిలోకి ఎవరు వెళ్లినా చర్యలు తప్పవు - నరేంద్రనాథ్రెడ్డి, తహసీల్దార్
పట్టణ సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న 357 సర్వే నంబరులో ఉన్న స్థలంలో సబ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో కొంత భాగంలో వాగు వెళ్తుంది. అక్కడ ఎవరికీ ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. రెవెన్యూ దస్త్రాల్లో ఎవరూ లేరు. ఎవరైనా స్థలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్థలాలు, వాగు పోరంబోకులు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ పర్యటనకు బయలుదేరిన అహోబిలం పీఠాధిపతి
[ 29-03-2024]
అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు. -
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా జెండా ఎగరవేస్తాం
[ 29-03-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను గెలిపించి తెదేపా జెండా ఎగరవేస్తామని ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు సాలి సాహెబ్, మండల తెదేపా నాయకులు సతీష్ కుమార్ అన్నారు. -
రానున్న ఎన్నికల్లో తెదేపాదే అధికారం
[ 29-03-2024]
బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెదేపా పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
ఎమ్మిగనూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
పట్టణంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర గౌడ్
[ 29-03-2024]
ఆలూరు తెదేపా అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ను అదిష్ఠానం ప్రకటించింది. దీనికి సంబంధించి శుక్రవారం జాబితాను విడుదల చేసింది. -
ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకుందాం
[ 29-03-2024]
ఆదోని పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. -
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్