లక్ష్మీదేవికి... సరస్వతి కటాక్షం
నిరుపేద కుటుంబం.. ఉన్నత చదువులకు కాస్త కష్టం. అయినా పట్టుదలతో చదివిన లక్ష్మీదేవి సరస్వతి కటాక్షంతో బంగారు పతకం సాధించి పలువురితో శభాష్ అనిపించుకున్నారు. ఆస్పరి గ్రామానికి చెందిన రామలక్ష్మి, హనుమంతు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ
ఆస్పరి విద్యార్థినికి బంగారు పతకం
ప్రసంశ పత్రాలతో లక్ష్మీదేవి
ఆస్పరి, న్యూస్టుడే: నిరుపేద కుటుంబం.. ఉన్నత చదువులకు కాస్త కష్టం. అయినా పట్టుదలతో చదివిన లక్ష్మీదేవి సరస్వతి కటాక్షంతో బంగారు పతకం సాధించి పలువురితో శభాష్ అనిపించుకున్నారు. ఆస్పరి గ్రామానికి చెందిన రామలక్ష్మి, హనుమంతు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె లక్ష్మీదేవి ఎమ్మెస్సీ హోమ్ సైన్స్లో మానవ అభివృద్ధి శిశు సంక్షేమ అంశం పూర్తిచేశారు. 1 నుంచి పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్తు పాఠశాలలో చదివారు. పదిలో మంచి మార్కులు రావడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఉచితంగా ఇంటర్ బైపీసీ పూర్తిచేశారు. హైదరాబాద్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీలో హోమ్సైన్స్ తీసుకుని, నాలుగేళ్ల కోర్సు చేశారు. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ రెండేళ్లు పూర్తిచేశారు. ఎమ్మెస్సీలో హోమ్సైన్స్లో మానవ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో స్పెషలైజేషన్ చేశారు. ఇందులో ప్రతిభ కనబరచడంతో ఇటీవలే ఎస్వీ విశ్వవిద్యాలయంలో బంగారు పతకం అందజేశారు. హైదరాబాద్లో మనో జాగృతి సంస్థలో స్టూడెంట్ కౌన్సిలర్గా తెలంగాణలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మానసిక సమస్యలపై కౌన్సిలింగ్ ఇచ్చారు. కరోనా వల్ల విద్యార్థులకు కౌన్సిలింగ్ ఆన్లైన్లో నిర్వహించారు. లక్ష్మీదేవి చెల్లి వసంత మత్స్యశాఖలో డిప్ల్లొమా పూర్తిచేశారు. ఓ ఏడాది పాటు ప్రైవేట్ ఉద్యోగం చేయగా 2019లో అక్టోబర్లో సచివాలయంలో ఫిషరీస్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. మరో చెల్లి మమత డెయిరీ డిప్లొమా పూర్తిచేసింది. 2021లో సచివాలయంలో పశుసంవర్ధకశాఖలో ఉద్యోగం సాధించింది.
సీడీపీవో కావడమే లక్ష్యం..
- లక్ష్మీదేవి, బంగారు పతకం విద్యార్థి
మాది నిరుపేద కుటుంబం నాన్న వ్యవసాయం చేస్తారు. ఇద్దరు చెల్లెళ్లు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. మా తమ్ముడు యోగేష్ సైతం హ్యాండ్లూమ్ డిప్లొమా చేస్తున్నారు. మా అమ్మానాన్న కష్టం కళ్లారా చూశాను. వారికి తోడుగా నిలుస్తాను. సీడీపీవోగా ఉద్యోగం సాధించి మహిళలకు, చిన్నారులకు సేవ చేస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఆటలు ఇక సాగవు..
[ 19-04-2024]
తెదేపా ఇంటింటి ప్రచారంలో భాగంగా కౌతాళం మండలం నందు బంటకుంటా గ్రామంలో ప్రతి ఇంటింటికీ వెళ్ళి జగన్ చేస్తున్న, అరాచకాలు, దోపిడి, దౌర్జన్యాలు, వివరిస్తూ, 2019లో కోడికత్తి, ఈసారి గులక రాయి అంటున్నాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. -
ఇంటిఇంటికి తెలుగుదేశం
[ 19-04-2024]
ఇంటిఇంటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, ఆయన సోదరులు రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
[ 19-04-2024]
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM