బిల్లుల మంజూరులో జాప్యం వద్దు
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్రెడ్డి, పక్కన జడ్పీ అధ్యక్షుడు, సీఈవో
గుత్తేదారులకు సామగ్రి కొరత ఉంది.. ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తున్నారని జడ్పీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పీఆర్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఇనుము, ఇసుక, సిమెంట్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
అలగనూరు జలాశయం, వెలగమాను డ్యాంపై పురోగతి గురించి కాటసాని ప్రశ్నించారు. వీటిపై నివేదిక సిద్ధం చేస్తున్నామని కేసీసీ డీఈఈ చెన్నకేశవనాయక్ తెలిపారు. స్థాయీ సంఘ సమావేశాలకు ఇతర శాఖల ఎస్ఈలు హాజరవుతున్నపుడు, నీటిపారుదల ఎస్ఈలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పించాలని కాటసాని కోరారు.
సీఈవో వెంకటసుబ్బయ్య, జడ్పీ ఉపాధ్యక్షుడు దిల్షాద్ నాయక్, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు.
ప్రకృతి సాగుపై మరింత అవగాహన
జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఛైర్మన్ పాపిరెడ్డి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని తొలి దశలో సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండించే విధంగా డ్వామా, డీఆర్డీఏ, వ్యవసాయశాఖల సమన్వయంతో రైతుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. సేంద్రియ వ్యవసాయానికి తనవంతు సహకారం అందిస్తామని, స్థలంతోపాటు 25 ఆవులను కేటాయిస్తామని నంద్యాల జడ్పీటీసీ సభ్యుడు గోకుల కృష్ణారెడ్డి తెలిపారు. ఉభయ జిల్లాల్లో ఉపాధి పనులు ఆశించినంతగా నిర్వహించడం లేదని జడ్పీ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.
యువజన సేవలకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదని, కేవలం జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు నిర్వహిస్తున్నామని సెట్కూరు సీఈవో రమణ తెలిపారు.
జిల్లాలో వర్షపాతం నమోదు ఇంతవరకు సాగు చేసిన పంటల వివరాలను వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి తెలిపారు. అనంతరం పశుసంవర్ధకశాఖ ప్రగతి, ప్రభుత్వ పథకాలను జేడీ డాక్టరు రామచంద్రయ్య వివరించారు. పశువులకు బీమా సొమ్ము విడుదలకు 10 నెలలు పడుతోందని, ఈ అంశంపై పరిశీలించాలని సభ్యులు కోరారు. జిల్లాలో ఉద్యానశాఖ ప్రగతిపై ఏడీ రఘునాథరెడ్డి వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
-
General News
Burning Wounds: కాలిన గాయాలయ్యాయా..? ఏం చేయాలో తెలుసా..!
-
Sports News
Cheteshwar Pujara: 73 బంతుల్లోనే పుజారా సెంచరీ.. ఒకే ఓవర్లో 22 పరుగులు!
-
India News
Har Ghar Tiranga: ఇంటింటా హర్ ఘర్ తిరంగా.. సతీమణితో కలిసి జెండా ఎగరవేసిన అమిత్ షా
-
Movies News
Vikram: నిజంగా నేనే వచ్చా.. డూపు కాదు: విక్రమ్
-
General News
Chandrababu: హర్ ఘర్ తిరంగా.. ఓ పవిత్రమైన కార్యక్రమం: చంద్రబాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్వీర్సింగ్ ఇంటికి పోలీసులు!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి
- Crime News: సినిమా చూసి.. మూఢవిశ్వాసంతో బలవన్మరణం
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!