మా పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతా
మునుగోడు నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ అన్నారు. కర్నూలు నగరంలోని అంబేడ్కర్ భవన్లో
మాట్లాడుతున్న కె.ఎ.పాల్
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: మునుగోడు నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ అన్నారు. కర్నూలు నగరంలోని అంబేడ్కర్ భవన్లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాజగోపాల్రెడ్డికి రూ.25 వేల కోట్ల వ్యాపారం ఇస్తామని భాజపా పెద్దలు ఆఫర్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం సాగుతోందని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు రూ.కోట్లు ఖర్చు పెడతాయన్నారు. తమ పార్టీని గెలిపిస్తే ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తామని.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఇస్తామని, రైతులకు, కార్మికులకు అండగా ఉంటామన్నారు. శ్రీలంక పరిస్థితి రావాలంటే కుటుంబ పాలనను ఎన్నుకోవాలన్నారు. భాజపా రూ.లక్షల కోట్లు అప్పు చేసిందని, ప్రైవేటీకరణ పేరుతో ఆయా సంస్థలను అమ్మేసిందని ధ్వజమెత్తారు. శనివారం తమ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన మునుగోడు అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ఏపీలో మహిళను ముఖ్యమంత్రిగా చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబరు 20వ తేదీలోపు ప్రత్యేక హోదా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రాన్ని నిధులు అడిగితే ఎక్కడ జైలులో పెడతారోనని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భయపడుతున్నారని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా