సివిల్స్లో గెలిచి.. ఐపీఎస్గా మెరిసి
శిక్షణ లేకుండానే సత్తాచాటిన శశిశేఖర్
తల్లి వసంతలక్ష్మితో శశిశేఖర్
నంద్యాల నేరవిభాగం, న్యూస్టుడే : ఇంజినీరుగా స్థిరపడాలన్న ఉద్దేశంతో ఎంటెక్ పూర్తిచేసిన యువకుడు.. తన నిర్ణయం మార్చుకుని సివిల్స్కు సిద్ధమయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా సొంతంగా సన్నద్ధమయ్యారు. మొదటి ప్రయత్నంలో 539వ ర్యాంకు రావడంతో ప్రస్తుతం చెన్నైలో అసిస్టెంట్ డీజీఎఫ్టీగా పనిచేస్తున్నారు. అక్కడ ఉద్యోగం చేస్తూనే మళ్లీ సివిల్స్ రాశారు. మే నెలలో ప్రకటించిన ఫలితాల్లో 469వ ర్యాంకు సాధించి.. ఐపీఎస్ శిక్షణకు ఎంపికయ్యారు నంద్యాలకు చెందిన శశిశేఖర్.
* నంద్యాల పట్టణం సాయిబాబానగర్కు చెందిన వసంతలక్ష్మి, సాంబశివ శ్రీనివాసరావు దంపతుల కుమారుడు వైవీఆర్ శశిశేఖర్ ఐపీఎస్ శిక్షణకు ఎంపికయ్యారు. శశిశేఖర్ పదో తరగతి స్థానిక కేశవరెడ్డి పాఠశాలలో చదివి రాష్ట్రస్థాయిలో టాఫర్గా నిలిచారు. ఇంటర్ నంద్యాలలో పూర్తిచేశారు. అనంతరం చెన్నైలో బీటెక్, ఎంటెక్ చదివారు. ఎంటెక్ తర్వాత ఆరు నెలల పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు. సివిల్స్ రాయలన్న లక్ష్యంతో ఆ ఉద్యోగం మానుకున్నారు. శిక్షణ తీసుకోకుండానే చెన్నైలో అద్దెగదిలో ఉంటూ సిద్ధమయ్యారు. 2019లో మొదటి ప్రయత్నంలో 539వ ర్యాంకు సాధించారు. దీని ఆధారంగా చెన్నైలోనే అసిస్టెంట్ డీజీఎఫ్టీ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం అక్కడ పనిచేస్తూనే రెండోసారి సివిల్స్ రాశారు. ఈసారి 469వ ర్యాంకు సాధించడంతో ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
అమ్మ కష్టంతో అందలం..
శశిశేఖర్ తండ్రి 2010లో మృతి చెందారు. అమ్మ వసంతలక్ష్మి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే శశిశేఖర్ను ఎంటెక్, కుమార్తెను ఎంబీబీఎస్ చదివించారు. సివిల్స్కు సిద్ధమవుతున్న కుమారుడిని ప్రోత్సహించారు. బంధువులు, సహోద్యోగులు, శశిశేఖర్ స్నేహితులు సహకారం అందించారని వసంతలక్ష్మి తెలిపారు. తన కుమారుడి కష్టానికి తగిన ఫలితం వచ్చిందన్నారు. మరోసారి సివిల్స్ రాసి ఇండియన్ ఫారిన్ సర్వీస్ సాధించేందుకు శశిశేఖర్ సిద్ధమవుతున్నట్లు ఆమె చెప్పారు.
మనీషా రెడ్డి
ఐపీఎస్ శిక్షణకు మనీషారెడ్డి
మహానంది, న్యూస్టుడే : మహానంది మండలం నందిపల్లెకు చెందిన మనీషారెడ్డి ఐసీఎస్ శిక్షణకు ఎంపికయ్యారు. గత మేలో వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో ఈమె తొలి ప్రయత్నంలోనే 154వ ర్యాంకు సాధించారు. తాజాగా ఐపీఎస్ శిక్షణకు ఎంపికయ్యారు. ముస్సోరి జరిగే ఆరు నెలల శిక్షణకు హాజరవ్వాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు మనీషా తాత వంగాల సాగేశ్వరరెడ్డి వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Raksha Bandhan: రాఖీ స్పెషల్.. సెలబ్రిటీలు ఎలా జరుపుకొన్నారంటే..?
-
Movies News
Vijay Deverakonda: అభిమానుల అత్యుత్సాహం.. నిమిషాల్లో మాల్ వదిలి వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ
-
General News
KTR: యువత ఒత్తిడిని అధిగమించి ముందుకెళ్లాలి: కేటీఆర్
-
Sports News
Virender Sehwag: పాక్ రాజకీయ విశ్లేషకుడికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన సెహ్వాగ్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Delhi: పంద్రాగస్టు ముందు ఉగ్ర కలకలం.. దిల్లీలో 2వేల తూటాలు లభ్యం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Arjun Tendulkar: ముంబయిని వీడనున్న అర్జున్ తెందుల్కర్
- సారూ.. ఈ తిండి ఎలా తినగలం?.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (12/08/2022)
- Pavan tej: కొణిదెల హీరో నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..
- Vizag Beach: వైజాగ్ ఆర్కే బీచ్లో నల్లగా మారిపోయిన ఇసుక..
- Hyderabad News: నాన్నను బతికించుకొనేందుకు ఆస్తులమ్మి.. షేర్లలో పెట్టి ఆత్మహత్య
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- AP Govt: మరో బాదుడు
- కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
- Social Look: యశ్, మహేశ్ ‘రాఖీ’ విషెస్.. ఈ హీరోయిన్ల సోదరులని చూశారా!