నిర్వహణ తీరు.. తారుమారు
ఉమ్మడి జిల్లాలో కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతుదొడ్డి వరకు 84 కి.మీ.ల మేర 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో పలు లోపాలున్నా అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ రహదారిపై అమకతాడు
జాతీయ రహదారిపై వాహనదారులకు కష్టాలు
డోన్, వెల్దుర్తి, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతుదొడ్డి వరకు 84 కి.మీ.ల మేర 44వ నంబరు జాతీయ రహదారి ఉంది. ఈ మార్గంలో పలు లోపాలున్నా అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ రహదారిపై అమకతాడు వద్ద టోల్ గేటు ఉంది. వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దశాబ్దం దాటినా..
గతంలో 7వ నంబరు జాతీయ రహదారిగా ఉన్న దీనిని నాలుగు వరుసలుగా మార్చేందుకు 2007లో పనులు మొదలై 2010లో పూర్తయ్యాయి. ప్రస్తుతం 44వ నంబరు జాతీయ రహదారిగా మారింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో ఐదేళ్లకోసారి లేయర్ వేయాల్సి ఉంటుంది. రహదారి నిర్మాణం పూర్తై 12 ఏళ్లయినా ఒక్కసారి కూడా లేయర్ వేయలేదని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది నుంచి కొన్నిచోట్ల మాత్రమే లేయర్ వేశారు. అదీ 40 కి.మీ. మేర లేయర్ వేసినట్లు అధికారులు చెబుతున్నారు.
దూపాడు వద్ద భారత్ గ్యాస్ సమీపంలో రహదారి పగుళ్లు ఇచ్చింది. ఇక్కడే వాహనాలు అటు, ఇటు
వెళ్లేందుకు కూడలి ఉంది. ఇలాంటి చోటే రహదారిపై గుంతలు ఉండటం గమనార్హం.
బ్లాక్ స్పాట్లు గుర్తించినా..
జాతీయ రహదారిపై ప్రమాదకరంగా ఉన్నచోట.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడ ప్రమాదాల నివారణకు సూచికలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కనిపించడం లేదు. రహదారి పక్కన, మధ్యలో స్టిక్కరింగ్ వేయాల్సి ఉంటుంది. వేగ నిరోధకాలుగా తెలుపు రంగుతో లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కొన్నిచోట్ల అవి లేవు. వేసినచోటా నామరూపాలు లేకుండా పోతున్నాయి. ఇటీవల వెల్దుర్తి, కర్నూలు వద్ద ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఎన్హెచ్ 44పై ప్రమాదాలు జరిగితే వెంటనే క్షతగాత్రులను తరలించేందుకు రెండు అంబులెన్సులు ఉండాలి. ఈ మొత్తం రహదారికి ఒకటి మాత్రమే ఉండటం గమనార్హం.
పెద్దటేకూరు వద్ద రహదారికి కొన్నిచోట్ల మరమ్మతులతో మమ అనిపించారు. బొమ్మిరెడ్డిపల్లె సమీపంలోనూ
దెబ్బతింది. మధ్యలో గుంతలు పడ్డాయి.
త్వరలోనే అన్ని పనులు చేయిస్తాం
- శ్రావణ్కుమార్, మేనేజర్, ఎన్హెచ్ 44
జాతీయ రహదారిపై కొన్నిచోట్ల లేయర్ పనులు పూర్తి చేశారు. గతంలో ఉన్న గుత్తేదారు స్థానంలో కొత్తవారు వచ్చారు. వారు త్వరలోనే లేయర్ పనులు మొదలుపెడతారు. రహదారిపై గుంతలు ఏర్పడిన చోట మరమ్మతులు చేయించాం. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో ఎక్కడైనా గుంతలున్నా మళ్లీ పనులు చేయిస్తాం. పనిచేయని సిగ్నల్ లైట్లకు మరమ్మతులు చేపడుతాం.
నిర్మాణంలోనే లోపాలు
* రహదారి నిర్మాణంలో లోపాల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్ నుంచి దొరపల్లె గ్రామానికి జాతీయ రహదారి మీదుగా వెళ్లేందుకు కిలోమీటరుకుపైగా దూరం వెళ్లి అక్కడ తిరిగి రావాల్సి ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. దొరపల్లె వంతెన వద్ద నుంచి నాలుగైదు గ్రామాలకు వెళ్లేందుకు కూడలి లేకపోవడంతో డివైడర్ను దాటి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
* డోన్ నుంచి వెల్దుర్తిలోకి వెళ్లాలంటే రహదారి దాటాలి. ఇక్కడ అప్పట్లోనే వంతెనలు ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బందులు తప్పేవని ప్రజలు చెబుతున్నారు. కర్నూలులోనూ పలుచోట్ల మొదట్లో కూడళ్ల వద్ద వంతెనలు లేకపోవటంతో ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
* జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడినచోట మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. ఎక్కడైనా రహదారి దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయాలి. కానీ చాలాచోట్ల గుంతలు పడి, పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డా పట్టించుకున్నవారే లేరు.
వెల్దుర్తి సమీపంలోని చెరుకులపాడు కూడలి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సిగ్నల్ లైటు ఉన్నా పనిచేయడం లేదు. అల్లుగుండు సమీపంలోనూ.. తాటిమాను కొత్తూరు సమీపంలోనూ సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగుల సొమ్ము.. జగన్ వమ్ము
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 35 వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులు కలిపితే 56 వేల మంది వరకు ఉన్నారు. వీరంతా గత ఐదేళ్ల జగన్ జమానాలో నరకం అనుభవించారు. -
అక్కా.. చెల్లెమ్మలకు జగనన్న బురిడీ
[ 19-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 80 వేలకు పైగా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 8 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. -
కదిలొచ్చిన పసుపు దళం
[ 19-04-2024]
చేనేత పురి పసుపుమయంగా మారింది.. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరెడ్డి గురువారం నామపత్రాలు దాఖలు చేశారు. ఉదయం 11:30 గంటలకు ఒక సెట్ వేశారు. బీవీ జయనాగేశ్వరరెడ్డి 2, ఆయన సతీమణి నిత్యాదేవి 2 సెట్లు వేశారు. -
భద్రత పేరుతో ఆంక్షలు
[ 19-04-2024]
నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద పోలీసు శాఖ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు అందరికీ ఇబ్బందిగా మారాయి. కర్నూలు ఎంపీ, పాణ్యం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
వైకాపా పాలనలో వలసలే మిగిలాయి
[ 19-04-2024]
పశ్చిమ ప్రాంతంలో కరవును తరిమేసేందుకు తెదేపా హయాంలో వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు మంజూరు చేశారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. -
నీరింకిన జలాశయం.. నెరవేరని ఆశయం
[ 19-04-2024]
తాగు, సాగునీరు అందించాలనే ఆశయంతో నిర్మించిన జలాశయాలు కళతప్పాయి. జలం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమ పల్లెలు దాహంతో తల్లడిల్లుతున్నా.. చుక్క నీరు అందించలేని పరిస్థితి. -
మహిళా కార్పొరేటర్ ఇంటిపై దుండగుడి దాడి
[ 19-04-2024]
కర్నూలు నగరంలోని ఎల్కూరుబంగ్లాలో ఉంటున్న 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఇంటి వద్ద ఓ దుండుగుడు హల్చల్ చేశాడు. -
నగరాభివృద్ధికి కృషి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఎస్.ఎ.పి. క్యాంపు వద్ద గురువారం 4వ విడత సైకిల్ భరోసాయాత్ర చేపట్టారు. -
భావోద్వేగానికి గురైన కోట్ల
[ 19-04-2024]
కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని, జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ మాజీ కేంద్ర మంత్రి, డోన్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట జయసూర్యప్రకాశ్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. -
డివైడర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు
[ 19-04-2024]
ఓర్వకల్లు మండలం పూడిచెర్లమెట్ట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎస్సై రాజారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. -
ఉద్యోగుల పింఛన్.. జగన్ వంచించెన్
[ 19-04-2024]
పాత పింఛను విధానాన్నే అమలు చేయండి మహాప్రభో అంటున్నా.. తన మతం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. తాను అధికారంలోకి వచ్చాక సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పింఛను స్కిమ్) రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించారు. -
అతివలకు సాయం.. అంతంతమాత్రం
[ 19-04-2024]
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. -
కదంతొక్కిన పసుపు దళం
[ 19-04-2024]
శ్రీశైల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి గురువారం నామపత్రం దాఖలు చేశారు. ముందుగా నల్లకాల్వ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
[ 19-04-2024]
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
గడప.. గడపకు వెళ్లాల్సిందే
[ 19-04-2024]
వాలంటీర్లు వైకాపా తరఫున ప్రచారం చేయాల్సిందేనని ఆ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. -
వైకాపాను భూ స్థాపితం చేయాలి
[ 19-04-2024]
ఈ ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేయాలని శ్రీశైలం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మకూరు తహసీల్దారు కార్యాలయంలో గురువారం ఆయన నామపత్రం దాఖలు చేశారు. -
ప్రచండ భానుడు
[ 19-04-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ధాటికి జనం అల్లాడిపోతున్నారు. నంద్యాల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటేశాయి. -
తొలి రోజు 11 మంది నామపత్రాల దాఖలు
[ 19-04-2024]
కర్నూలు జిల్లా పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన గురువారం విడుదల చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన