logo

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుందాం

స్వాతంత్య్ర సమరయోధులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక మార్కెట్‌ యార్డ్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు 300 అడుగుల జాతీయ పతాకంతో

Published : 08 Aug 2022 03:31 IST

300 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే : స్వాతంత్య్ర సమరయోధులను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని ఎస్పీ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదికా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక మార్కెట్‌ యార్డ్‌ నుంచి గాంధీచౌక్‌ వరకు 300 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు, పురపాలక కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, డీఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తుల చరిత్రను తెలుసుకుని వారి అడుగు జాడల్లో నడవాలన్నారు. అందులో భాగంగా పట్టణంలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో కలిసి 300 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పురపాలక, రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ రఘువీర్‌రెడ్డి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని