logo

దైవదర్శనానికి వెళ్తూ.. మృత్యుఒడికి

దైవదర్శనం కోసం వెళ్తూ ఓ వివాహిత మృత్యుఒడికి చేరిన ఘటన ఆదివారం రాత్రి మంత్రాలయం మండలం మాధవరం- కోసిగి రహదారిలోని ఆదర్శ పాఠశాల వద్ద చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన భక్తురాలు శంకరమ్మ(35) మృతిచెందగా.. ఆమె భర్త భీమేష్‌ తీవ్రంగా గాయపడ్డారు.

Published : 08 Aug 2022 03:31 IST

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: దైవదర్శనం కోసం వెళ్తూ ఓ వివాహిత మృత్యుఒడికి చేరిన ఘటన ఆదివారం రాత్రి మంత్రాలయం మండలం మాధవరం- కోసిగి రహదారిలోని ఆదర్శ పాఠశాల వద్ద చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన భక్తురాలు శంకరమ్మ(35) మృతిచెందగా.. ఆమె భర్త భీమేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం గట్టు మండలం బోయలగూడెం గ్రామానికి చెందిన దంపతులు భీమేష్‌, శంకరమ్మలు ద్విచక్రవాహనంపై స్వగ్రామం నుంచి ఉరుకుంద ఈరన్నస్వామి దర్శనం కోసం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. మంత్రాలయం మండలం మాధవరం మీదుగా కోసిగి క్రాస్‌ నుంచి ఉరుకుందకు వెళ్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారన్నారు. గుర్తించిన స్థానికులు చికిత్స కోసం హుటాహుటిన ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. శంకరమ్మ అపస్మారక స్థితికి చేరడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేశారు. తరలిస్తుండగా మార్గమధ్యలోనే గోనెగండ్ల సమీపంలో శంకరమ్మ మృతి చెందిందన్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని