ఠాణాలో ఇంటి దొంగలు
పోలీసు శాఖ గోప్యత పట్టుతప్పుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై శాఖాపరంగా తనిఖీల వివరాలు ముందుగా ఉప్పందుతున్నాయి. అంతర్గత నిర్ణయాలు.. ఉన్నతాధికారుల ఆదేశాలు బహిర్గతమవుతున్నాయి. మూడ్రోజుల కిందట జరిగిన కానిస్టేబుల్ హత్యకు ఇవే
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొందరు ఖాకీల అండ
ఈనాడు - కర్నూలు, న్యూస్టుడే నంద్యాల నేరవిభాగం: పోలీసు శాఖ గోప్యత పట్టుతప్పుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై శాఖాపరంగా తనిఖీల వివరాలు ముందుగా ఉప్పందుతున్నాయి. అంతర్గత నిర్ణయాలు.. ఉన్నతాధికారుల ఆదేశాలు బహిర్గతమవుతున్నాయి. మూడ్రోజుల కిందట జరిగిన కానిస్టేబుల్ హత్యకు ఇవే దారి తీసి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కానిస్టేబుల్ హత్యకు ఇవే కారణమా
నంద్యాలలో రౌడీషీటర్ల కదలికలు, సుపారీలు, పంచాయితీల్లో రాజీ కుదుర్చుతున్న వారి సమాచారం డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేంద్రకుమార్ ద్వారా ఉన్నతస్థాయికి చేరినట్లు బయటకు పొక్కడమే హత్యకు కారణమైందా అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాల సమాచార సేకరణలో సదరు కానిస్టేబుల్ కీలక పాత్ర పోషించేవారు.
జిల్లా బాస్ హెచ్చరించినా
కానిస్టేబుల్ హత్యకు మూడ్రోజుల ముందు పోలీస్బాస్ కారుకు బొమ్మలసత్రం వద్ద ఓ మందుబాబు అడ్డుగా వచ్చినట్లు సమాచారం. రోడ్లపైకి మందు బాబులు వస్తుంటే మీరేం చేస్తున్నారంటూ సెట్ కాన్ఫరెన్సులో పోలీసు బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ రోడ్లపై తనిఖీలు పెరగాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కానిస్టేబుల్ హత్యకు గురికావడం చూస్తే విధుల్లో ఖాకీల నిర్లక్ష్యమేనని తెలుస్తోంది.
స్థిరాస్తి వ్యాపారంపైనే దృష్టి
కానిస్టేబుల్ నుంచి సీఐ స్థాయి వరకు పోలీసు సిబ్బంది స్థిరాస్తి వ్యాపారంలో మునిగిపోయారు. నంద్యాలలో లూప్లైన్ పోస్టింగ్ ఇచ్చినా చాలంటూ సిబ్బంది నేతలతో పైరవీలు చేస్తున్నారంటే స్థిరాస్తి వ్యాపారమే కారణంగా తెలుస్తోంది. నంద్యాల ఆసుపత్రిలోని అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ స్థిరాస్తి వ్యాపారంపై ప్రధాన దృష్టి సారించి విధులను నిర్లక్ష్యం చేయడంతో వేటు వేశారు.
ఇవిగో ఉదాహరణలు
* ‘‘ పోలీసు సిబ్బంది తనిఖీలకు వస్తున్నారు.. సరకు దాచిపెట్టుకోవాలని’’ నంద్యాల జిల్లా కేంద్రంలో రెండో పట్టణ ఠాణా కానిస్టేబుల్ గుట్కా వ్యాపారికి చరవాణిలో చెప్పిన ఆడియో 2021 ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సంభాషణ పోస్టు చేసిన ఓ యూట్యూబ్ విలేకరి కానిస్టేబుల్ను డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. డబ్బులివ్వని కారణంగా ఆ ఆడియోను వైరల్ చేయడంతోపాటు పోలీస్ బాస్కు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్పై వేటు పడింది. పగ పెంచుకున్న కానిస్టేబుల్ డబ్బులిస్తామని ఆ విలేకరిని నిర్మానుష్య ప్రదేశానికి పిలిచి హత్య చేయడం గతేడాది చర్చనీయాంశంగా మారింది.
* ఏడాదిన్నర కిందట మట్కాపై పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో దొరికిన చరవాణి వాట్సప్లో పోలీసు గ్రూపు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆరాతీస్తే మట్కా బీటర్ కుమార్తె నంద్యాల మూడో పట్టణ పోలీస్ స్టేషన్ గ్రూపులో ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు మట్కాపై రైడింగ్ అని ఇచ్చే సందేశం గ్రూపులో రాగానే బీటర్లు అప్రమత్తం అవుతున్నట్లు గుర్తించారు. బీటర్ కుమార్తెను గ్రూపులో యాడ్ చేసిన అడ్మిన్లుగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లపై అప్పట్లో వేటు పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!