హత్య కేసులో నిందితుల అరెస్టు
కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ డీవీ నారాయణరెడ్డి మంగళవారం సర్కిల్ కార్యాలయంలో వెల్లడించారు. హత్యకు గురైన దైవపుత్రుడు (42)కు దాయాదైన పెరుమాళ్ల చిన్న రాజన్న
వివరాలు వెల్లడిస్తున్న సీఐ డీవీ నారాయణరెడ్డి
కోవెలకుంట్ల, న్యూస్టుడే: కోవెలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఈ నెల 6న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ డీవీ నారాయణరెడ్డి మంగళవారం సర్కిల్ కార్యాలయంలో వెల్లడించారు. హత్యకు గురైన దైవపుత్రుడు (42)కు దాయాదైన పెరుమాళ్ల చిన్న రాజన్న కుటుంబానికి ఇంటి దగ్గర సరిహద్దు గోడ విషయంలో తరచూ గొడవ జరిగేది. 6వ తేదీన దైవపుత్రుడు ఆటోలో ఇంటికి వస్తుండగా పెరుమాళ్ల చిన్న రాజన్న, భార్య సంజమ్మ, కుమారుడు రాజేష్, కూతురు ఐశ్వర్య, బావమరిది సొగసొట్ట ఓబులేసు, బావమరిది భార్య మేరీ, అదే గ్రామానికి చెందిన సమాధానమ్మ అతడిని అడ్డగించి గొడవ పడ్డారు. ఈ గొడవలో ట్రాక్టర్లో ఉన్న జాకీ రాడ్డు తీసుకొని దైవపుత్రుడిపై దాడి చేసి హత్య చేశారు. ఇదే గొడవలోనే ఆయన భార్య అరుణకుమారి, కొడుకులు వంశీ, శ్యామ్సన్, చెల్లెలు జయమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి అన్న ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ ఇంజిన్, జాకీ రాడ్డు, రోకలి బండ, కర్రలను స్వాధీనం చేసుకుని ఏడుగురిని అరెస్టు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించామని సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.