హాజరు.. నమోదుకు బేజారు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదులో పారదర్శకత కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. గతంలో వినియోగిస్తున్న యాప్ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరించి స్కూల్ అటెండెన్స్ యాప్ 2.0 వెర్షన్ను వినియోగంలోకి తెచ్చింది.
కొత్త యాప్ తెచ్చిన విద్యాశాఖ
ప్రధానోపాధ్యాయుల నిర్ధారణ తప్పనిసరి
విద్యార్థుల హాజరు నమోదు చేస్తున్న ఉపాధ్యాయుడు
ఆత్మకూరు, న్యూస్టుడే : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదులో పారదర్శకత కోసం పాఠశాల విద్యాశాఖ సరికొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది. గతంలో వినియోగిస్తున్న యాప్ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరించి స్కూల్ అటెండెన్స్ యాప్ 2.0 వెర్షన్ను వినియోగంలోకి తెచ్చింది. విద్యార్థుల హాజరుకు సంబంధించి సమగ్ర సమాచారం తెలియడం కోసం ఇంటిగ్రేడెట్ యాప్ను రూపొందించారు. ఇప్పటి వరకు వినియోగించిన యాప్ స్థానంలో నవీకరించిన దానిని చరవాణుల్లో పొందుపర్చి ఈనెల 10 నుంచి విద్యార్థుల హాజరు నమోదు చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కొత్త వెర్షన్లో హాజరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు.
*తాజా యాప్లో విద్యార్థుల హాజరును ప్రధానోపాధ్యాయులు నిర్ధారించాల్సి ఉంది. యూజర్ ఐడీతో పాటు కొత్తగా పాస్వర్డ్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు సైతం త్వరలో ఇందులోనే తమ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
తప్పని తిప్పలు
కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసే సమయంలో సర్వరు మొరాయించడంతో మొదటి రోజు ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చరవాణులకు సిగ్నల్స్ అందకపోవడం, అంతర్జాలం సరిగా పనిచేయకపోవడం, సర్వర్ మొరాయింపు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చెంచు గూడేల్లో చరవాణులు పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం తెచ్చిన కొత్త వెర్షన్ అయినా సక్రమంగా పనిచేస్తుందో లేదోనని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాటిమాటికీ మార్పులు..
స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇప్పటి వరకు పలుమార్లు మార్పులు, చేర్పులు చేశారు. మాటిమాటికీ వెర్షన్లు మార్చడం కొత్త నిబంధనలు పెట్టడంతో ఉపాధ్యాయులు సతమతం అవుతున్నారు. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ 1.0 నుంచి 1.1, 1.2, 1.3, 1.4, 1.5 అంటూ ఆరు వెర్షన్లు అప్డేట్ చేశారు. తాజాగా 2.0 వెర్షన్ను తీసుకొచ్చారు. ఉదయం 10.30 గంటలకే హాజరు పూర్తి చేయాలన్న నిబంధన పెట్టారు. ఆలస్యమైతే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు
[ 24-04-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బుధవారం స్వాతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ప్లాస్టిక్ నివారణకు సహకరించండి
[ 24-04-2024]
శ్రీశైలం అటవీ శాఖలో ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని శ్రీశైలం, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్ మూర్తి అన్నారు. -
మైనారిటీల అభివృద్ధిని విస్మరించిన వైకాపా
[ 24-04-2024]
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల నుంచి మైనార్టీల అభివృద్ధిని విస్మరించిందని మండల ముస్లిం మైనారిటీ నాయకులు నజీర్ సాహెబ్, ఫక్రుద్దీన్, బేతాళ భలే సాహెబ్, మదీనా అన్నారు. -
తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు
[ 24-04-2024]
రాష్ట్రంలో తెదేపాను గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. -
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
[ 24-04-2024]
‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి సతీమణి, కౌన్సిలర్ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
కేసీ.. జగన్ నిర్లక్ష్యం చేసి
[ 24-04-2024]
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఐదువందలు కేటాయించలేదు.. కేసీ కాల్వకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని శాసనసభా సాక్షిగా ‘కాగ్’ తేల్చింది.. -
గ్రామ స్వరాజ్యం.. జగనాసుర అరాచకం
[ 24-04-2024]
పంచాయతీ, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు స్థానిక ప్రభుత్వాలుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సి ఉండగా వాటిపై జగన్ కుట్ర పన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం -
బలగం పెంచుకుని బరిలోకి!
[ 24-04-2024]
వైకాపాలో విభేదాలు... ఐదేళ్లుగా ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం.. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మల్చుకొని విజయం దిశగా వెళ్లాలని కోడుమూరు తెదేపా నేతలు వ్యూహాలకు పదునుపెట్టారు. -
డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
[ 24-04-2024]
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. -
కోట్ల గూటికి పాత నేతలు
[ 24-04-2024]
ఇన్నాళ్లు పార్టీని ఉపయోగించుకొని వీడిన వారికి తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా రిటర్న్గిఫ్ట్ ఇస్తామని అధికారపార్టీ నేత హెచ్చరికలు ‘డోన్’ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయి.. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 24-04-2024]
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయమని ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ అన్నారు. మండలంలోని తంగడరడోణ, తుర్వగల్లు, తొగలగల్లు, యాటకల్లు, కల్లపరి, చొక్కనహళ్లి, శంకరబండ తదితర గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు
[ 24-04-2024]
ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. -
పాణ్యం ఎన్నికల్లో ప్రముఖం
[ 24-04-2024]
పాణికేశ్వరస్వామి పేరుతో పాణ్యం గ్రామం ఏర్పడింది. కాలక్రమేణా నియోజకవర్గంగా మారింది. కర్నూలు, నంద్యాల మధ్య వారధిగా ఉన్న పాణ్యం నియోజకవర్గం అత్యంత కీలకం. జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కావడం విశేషం. -
పుస్తక పుటలకు జగనన్న చెద
[ 24-04-2024]
గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. -
కాటసాని ఆస్తులు రూ.75.19 కోట్లు
[ 24-04-2024]
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.75.19 కోట్లుగా చూపారు. సోమవారం నామినేషన్తోపాటు ఇచ్చిన అఫిడవిట్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించిన రిటర్నింగ్ అధికారి నారపురెడ్డి మౌర్య వాటిని సవరించాలని సూచించారు. -
టీజీ భరత్ నామపత్రం దాఖలు
[ 24-04-2024]
కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి మంగళవారం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. తెదేపా అభ్యర్థి టీజీ భరత్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.