రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు
రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని భాజపా నాయకులు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర నిర్వహించారు. కర్నూలు నగరం కల్లూరు చెన్నమ్మ కూడలిలో శుక్రవారం రాత్రి యాత్ర ముగింపు సభ ఏర్పాటు చేశారు.
త్వరలో కర్నూలులో సర్వజనుల సమ్మేళనం
యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో భాజపా నేతలు
శాంతి కపోతాలు ఎగురవేస్తున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,
మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, నాయకులు ఆదినారాయణరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, పార్థసారథి తదితరులు
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని భాజపా నాయకులు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర నిర్వహించారు. కర్నూలు నగరం కల్లూరు చెన్నమ్మ కూడలిలో శుక్రవారం రాత్రి యాత్ర ముగింపు సభ ఏర్పాటు చేశారు. ముందుగా కర్నూలు నగరంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇస్తుండగా ఈ నిధులను ముఖ్యమంత్రి స్వాహా చేస్తున్నారని ధ్వజమెత్తారు. భాజపా రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా విడిపోవడానికి చంద్రబాబు, వైఎస్ జగనే కారణమని ఆరోపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహానుభావుడని అన్నారు. రాష్ట్ర ప్రగతి నిరోధకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుల రాజకీయాలతో రాష్ట్రంలో ప్రగతి కుంటుపడిందని చెప్పారు. వైకాపా ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి చుట్టూ ఉండేవారికి ఏ విషయంపైనా అవగాహన లేదన్నారు. నంద్యాలలో జరిగిన కానిస్టేబుల్ హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలో కర్నూలులో సర్వజన సమ్మేళనం ఏర్పాటు చేసి అందరిని ఒకేతాటిపైకి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామన్నారు. అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
అన్ని పార్టీలను ఏకం చేస్తాం
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, మహిళలకు రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా ముఖ్యమంత్రిని గద్దె దింపాలన్నారు. అవసరమైతే అన్ని పార్టీలను ఏకం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ దేశం, దేశ ప్రజలు ముఖ్యమని భావించే పార్టీ భాజపా అని అన్నారు. భాజపా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాహల్, రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, చంద్రమౌళి, శ్రీనివాస్, పార్థసారథి, రమేష్నాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నుల పండుగగా బెలడోనా భీమలింగేశ్వర స్వామి రథోత్సవం
[ 25-04-2024]
మండలంలోని బెలడోనా గ్రామంలో వెలిసిన భీమ లింగేశ్వర స్వామి రథోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. -
ముగిసిన బండలాగుడు పోటీలు
[ 25-04-2024]
మండలంలోని రామళ్ళకోట గ్రామంలో వనం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా గురువారం బండలాగుడు పోటీలు నిర్వహించారు. -
మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
జాతీయ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని పత్తికొండలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
సెబ్ పోలీసుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవి కుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, అక్రమ మద్యం రవాణా అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. -
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా