logo

ఆదోని పట్టణంలో తిరంగా యాత్ర

ఆదోని పట్టణంలో వివిధ విద్యా సంస్థలు, కళాశాలల ఆధ్వర్యంలో శనివారం తిరంగా యాత్ర  నిర్వహించారు. బాలాజీ, డాక్టర్‌ జోతిర్మయి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో పురపాలక

Updated : 13 Aug 2022 16:48 IST

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణంలో వివిధ విద్యా సంస్థలు, కళాశాలల ఆధ్వర్యంలో శనివారం తిరంగా యాత్ర  నిర్వహించారు. బాలాజీ, డాక్టర్‌ జోతిర్మయి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో పురపాలక ప్రధాన రహదారిపై ర్యాలీ చేశారు. 200 మీటర్ల పొడవు ఉన్న జాతీయ జెండాతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.సరస్వతీ శిశుమందిరం ఆధ్వర్యంలో విద్యార్థులు దేశభక్తి గీతాలతో శివారు ప్రాంతాల్లో ర్యాలీ తీశారు. ఇంటింటిపై ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ జెండాలను ఎగురవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని