రాఘవ ప్రభా.. ఆధ్యాత్మిక శోభ
మంత్రాలయంలోని రాఘవుడి మఠానికి జనం పోటెత్తారు. ఆరాధనోత్సవాలు తిలకించేందుకు బారులుదీరారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి వెయ్యి లీటర్లతో పాలాభిషేకం, ఫల పంచామృతాభిషేకం, మంగళహారతి ఇచ్చారు.
ఆరాధనోత్సవాలకు పోటెత్తిన భక్తులు
నేడు మహారథోత్సవ వైభవం
బంగారు హారాన్ని చూపిస్తున్న పీఠాధిపతి
మంత్రాలయం, న్యూస్టుడే: మంత్రాలయంలోని రాఘవుడి మఠానికి జనం పోటెత్తారు. ఆరాధనోత్సవాలు తిలకించేందుకు బారులుదీరారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి వెయ్యి లీటర్లతో పాలాభిషేకం, ఫల పంచామృతాభిషేకం, మంగళహారతి ఇచ్చారు. డిప్యూటీ ఈవో రమేశ్ బాబు తితిదే తరఫున పట్టువస్త్రాలు, ప్రసాదాలు తీసుకొచ్చారు. వారికి మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, పీఆర్వో ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిచార్లు ఘన స్వాగతం పలికారు. బెంగళూరుకు చెందిన ఎంఎస్ఆర్ పట్టాభిరాం, అనిత దంపతులు రూ.1.50 కోట్ల విలువైన బంగారు హారాన్ని సమర్పించినట్లు పీఠాధిపతి తెలిపారు. భక్తుల పాదకానుకల ద్వారా వచ్చిన సొమ్ముతో నవ వైఢూర్యాలు, వజ్రాలతో చేసిన హారాలు, 350 కిలోల వెండితో చేసిన మండపం, నవరత్నాలతో పొదిగిన బంగారు కవచాన్ని సమర్పించినట్లు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ రాధాకృష్ణ కృపాసాగర్ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం మఠం వీధుల్లో ప్రహ్లాదరాయలను పుష్పమంటప వాహనంపై ఊరేగించారు. అనంతరం వెండి, బంగారు, నవరత్న రథాలపై ఒకదానివెంట ఒకటి తీసుకొచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉత్తరారాధనోత్సవం నిర్వహించనున్నారు. వసంతోత్సవం అనంతరం స్వామివారు మహారథంపై కొలువుదీరి గ్రామ పురవీధుల్లో ఊరేగనున్నారు. హెలికాఫ్టర్ ద్వారా పూలు చల్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక పాలనకు చరమ గీతం పాడాలి
[ 25-04-2024]
రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని మండల తెదేపా నాయకులు నజీర్ సాహెబ్, తిమ్మారెడ్డి, తిరుపతయ్య, రామాంజనేయులు, బేతాళ బడే సాహెబ్ అన్నారు. -
మలేరియాపై అవగాహన
[ 25-04-2024]
మండలంలో అన్ని గ్రామాల్లో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని మలేరియా వ్యాధి సబ్ యూనిట్ అధికారి సాయిబాబా అన్నారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 25-04-2024]
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర అన్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?