కోతకొచ్చినా.. కొనేవారేరీ
టమాటా పంట చేతికొచ్చింది. కోసి విక్రయిద్దామనుకుంటే అడిగే దిక్కులేదు. కూరగాయల సంత మార్కెట్ వద్దకు తీసుకెళ్లి అమ్ముదామంటే కిలో రూ.5 ధరైనా పలికే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ బోర్ల కింద సాగు చేసిన టమాటా ఇప్పటికే పలు గ్రామాల్లో కోతకు రాగా, వర్షాధారం కింద వేసిన పంట మరో వారం,
మొదలుకాని టమాటా కొనుగోళ్లు
బోసిపోయిన పత్తి మార్కెట్యార్డు
ఖాళీగా పత్తికొండ మార్కెట్యార్డు ప్రాంగణం
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: టమాటా పంట చేతికొచ్చింది. కోసి విక్రయిద్దామనుకుంటే అడిగే దిక్కులేదు. కూరగాయల సంత మార్కెట్ వద్దకు తీసుకెళ్లి అమ్ముదామంటే కిలో రూ.5 ధరైనా పలికే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ బోర్ల కింద సాగు చేసిన టమాటా ఇప్పటికే పలు గ్రామాల్లో కోతకు రాగా, వర్షాధారం కింద వేసిన పంట మరో వారం, పదిరోజుల్లో కోతకు సిద్ధంగా ఉంది. వేలకువేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటకు ఆదిలోనే ధరలు వెక్కిరిస్తున్నాయి. పత్తికొండ ప్రాంతంలో టమాటాను అత్యధికంగా సాగు చేస్తారు. ప్రతి రైతూ తనకున్న పొలంలో కనీసం అర ఎకరా టమాటా సాగు చేయటం ఆనవాయితీ. ఈ ఖరీఫ్లో పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, ఆస్పరి ప్రాంతాల్లో సుమారు 2 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు చేశారు. కొనుగోళ్లు ప్రారంభమైతే రోజూ పత్తికొండ వ్యవసాయ మార్కెట్కు 100 నుంచి 120 టన్నుల వరకు సరకు వస్తుంది. రైతుల పంటకోత, సరకు దిగుబడిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 13, 14వ తేదీల్లో పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో వేలాల ద్వారా కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా మార్కెట్లో టమాటా కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
గ్రేడింగ్ చేసి పొలం వద్దే ఉంచిన టమాటాలు
మూడెకరాల్లో సాగు
- రమేశ్నాయక్, గుండుతండా
మూడెకరాల్లో టమాటా సాగు చేశా. పదిహేను రోజుల నుంచి కోత చేపడుతున్నాం. మార్కెట్ సదుపాయం లేకపోవడంతో కూరగాయల మార్కెట్వద్దకు తీసుకెళ్లి విక్రయిస్తున్నా. ఒకరిద్దరు వ్యాపారులే కొనుగోలు చేస్తుండటంతో ధర ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో త్వరితగతిన కొనుగోళ్లు ప్రారంభించాలి.
పొలంలోనే వదిలేస్తున్నాం
- సుభద్రమ్మ, మహిళా రైతు
రెండెకరాల్లో టమాటా సాగు చేశా. ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేశా. పంట దిగుబడి ఆశాజనకంగానే ఉన్నా సరకు కొనుగోలు చేయటం లేదు. దీంతో పండిన పంటను వదిలేయాల్సిన పరిస్థితులు దాపురించాయి.
వ్యాపారులు ముందుకొస్తే ఏర్పాట్లు
- కార్నలీస్, మార్కెట్యార్డు కార్యదర్శి
పత్తికొండ మార్కెట్లో ఏటా టమాటాలు పెద్దఎత్తున కొనుగోలు చేస్తాం. ఈసారి వేలాల విషయమై మా కార్యాలయానికి వ్యాపారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారు ఓ నిర్ణయానికి వచ్చి తమ అభిప్రాయం చెబితే వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆలూరులో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలూరులో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పార్టీ డాక్టర్ సెల్ కార్యదర్శి నెట్టెప్ప ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
[ 29-03-2024]
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
తెదేపాతోనే పేదలకు న్యాయం
[ 29-03-2024]
తెదేపాతోనే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి నర్సప్ప అన్నారు. -
సీ బెళగల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవం
[ 29-03-2024]
మండలకేంద్రమైన సీ బెళగల్లో శుక్రవారం మండల తెదేపా నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
పశ్చిమాన జగన్ పచ్చి మోసం
[ 29-03-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 19 మండలాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయా మండలాల్లో 4,84,619.2 హెక్టార్ల (82.05 శాతం) సాగు భూమి విస్తరించి ఉంది. -
జగనన్నా..కరవు సీమ కష్టాలు చూడవా
[ 29-03-2024]
కనిపించలేదా కరవు రైతు వేదన.. వినిపించలేదా పశ్చిమ పల్లెల కన్నీటి రోదన. పొలాలు బీడుబారాయి.. ఊరిలో పనులు కరవయ్యాయి.. ఇళ్లకు తాళాలు పడ్డాయి.. -
వసతిగృహాల్లో ఆకలికేకలు
[ 29-03-2024]
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మామయ్యలా అండగా వారికి ఉంటానని ఎక్కడికక్కడ ఊదరగొట్టే ప్రసంగాలతో అదరగొట్టే జగన్ పిల్లలకు భోజనాన్ని అందించే వార్డు సంరక్షకుల సమస్యల్ని కూడా పట్టించుకోవడం లేదు -
ప్రయాణికులకు పరీక్ష
[ 29-03-2024]
బస్సులన్నీ మేమంతా సిద్ధం సభకు తరలివెళ్లాయి. ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి వైకాపా వారు అడిగింతే తడవుగా బస్సులన్నింటినీ మళ్లించారు -
ముఖ్యమంత్రి జగన్రెడ్డి క్షమాపణలు చెప్పి పర్యటించండి
[ 29-03-2024]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, తెదేపా హయాంలో రూ.2 వేల కోట్లతో మంజూరు చేసిన ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు పనులకు పైసా నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి పర్యటించాలని ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం
[ 29-03-2024]
తాము 40 ఏళ్లుగా రాజకీయాలకతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నామని, 20 రోజుల ముందు వచ్చిన ఓ వ్యక్తి ప్రజలకు సేవ చేస్తామని.. ఓటేయండి అని అంటున్నారని.. ఆ మాటలు నమ్మొద్దని కర్నూలు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి టి.జి.భరత్ కోరారు. -
తెదేపాను గెలిపించుకుందాం
[ 29-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు -
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత జగన్మోహన్రెడ్డిదే
[ 29-03-2024]
స్కీంలను స్కాంలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనని మంత్రాలయం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు