671 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేసి 671 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కోవెలకుంట్ల పరిధిలో అక్రమ రవాణా అవుతున్న 170 బస్తాల (95.8 క్వింటాళ్లు) రేషన్ బియ్యం
పట్టుకున్న బియ్యం లారీతో విజిలెన్స్ అధికారులు
కర్నూలు నేరవిభాగం: ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేసి 671 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కోవెలకుంట్ల పరిధిలో అక్రమ రవాణా అవుతున్న 170 బస్తాల (95.8 క్వింటాళ్లు) రేషన్ బియ్యం పట్టుకుని వాహన డ్రైవర్లు వెంకటరాజు, వెంకటసుబ్బయ్యను అరెస్టు చేసి కోవెలకుంట్ల పోలీసుస్టేషన్లో అప్పగించారు. వాహనం యజమాని శివయ్య, రామసుబ్బారెడ్డి ఇందులో సూత్రధారులని తేలింది. కల్లూరు పరిధిలోని బుడగజంగాల కాలనీలో 501 బస్తాల రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. డోన్ మండలం కన్నప్పకుంటకు చెందిన డ్రైవర్ రాజశేఖర్, క్లీనర్ మహేంద్రతోపాటు కల్లూరు ఎస్టేట్కు చెందిన కురువ లింగన్న, ఎరుకలి ఈరన్న, లారీ యజమాని.. ప్యాపిలి మండలం బోయపల్లికి చెందిన శ్రీరాములుతోపాటు లోడు లారీని కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్లో అప్పగించారు. నిందితులు కర్ణాటకకు బియ్యాన్ని తరలించేందుకు పథకం రచించినట్లు విచారణలో తేలింది. బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. రెండు పోలీసుస్టేషన్లలో దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో సీఐలు నాగరాజయాదవ్, శ్రీధర్, ఏజీ సిద్ధయ్య, ఏవో రూపస్, ఎస్సైలు జయన్న, హనుమంతు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎలైట్ స్టోర్లు, టూరిజం రెస్టారెంట్, మద్యం దుకాణాలు 175, బార్లు 49 వరకు ఉన్నాయి. నిత్యం రూ.4.50 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. -
ఎస్పీ ఆదేశాలు బేఖాతరు
[ 25-04-2024]
కర్నూలు జిల్లాలో తాత్కాలిక నియామకాలు (అటాచ్మెంట్లు) రద్దు చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలుకావడం లేదు -
40 ఏళ్ల తర్వాత కడిమెట్టలో కాలు పెట్టిన బీవీ
[ 25-04-2024]
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఏదీ శాసిస్తే.. ఆ గ్రామంలో అదే శాసనమయ్యేది. -
మాన్యంలో నేతల ‘భూ’తాలు
[ 25-04-2024]
ఆలయ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వేల ఎకరాలు నామమాత్రపు ధరకు కౌలుకు తీసుకొన్నారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ విద్యాసంస్థల యజమాని నాయుని చంద్రశేఖర్ మూర్తి బుధవారం తెలిపారు. -
భూకబ్జాదారులను ఇంటికి పంపుతాం
[ 25-04-2024]
కూటమి పార్టీల సమన్వయంతో పాణ్యంలో తెదేపా జెండా ఎగురవేస్తామని పాణ్యం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు -
ఆకాశం బద్దలవుతున్నా.. పట్టించుకోరు
[ 25-04-2024]
ఆదోని పట్టణంలో పాత ఆకాశవంతెనపై వాహనదారులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. వంతెన నిర్మించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది -
బండి కడితేనే.. గొంతు తడిసేది
[ 25-04-2024]
తుంగభద్ర దిగువ కాల్వకు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో హొళగుంద వాసులకు తాగునీటి కష్టాలు వచ్చాయి. హొళగుందలోని కడ్లెమాగి ఎస్ఎస్ ట్యాంకు నుంచి వారానికి ఒకసారి నీరు సరఫరా చేస్తుండటంతో బీసీ, కోటవీధి వాసులు గుక్కెడు నీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సెలవులు.. ఎన్నికలు.. తీరని సమస్యలు
[ 25-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ అవస్థలపాలైంది. విద్యా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి.. విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. -
‘ఘనులు’ తీసిన గోతులు
[ 25-04-2024]
డోన్ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
‘జే’గనాసురుడి విషపు సుక్క
[ 25-04-2024]
‘‘మద్యం కారణంగా అన్యాయానికి గురవుతున్న అక్కచెల్లెమ్మల బాధ చూడలేకున్నా.. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం అమలు చేస్తామని’’ 2017లో ప్రజా సంకల్ప పాదయాత్రకు చాగలమర్రికి వచ్చిన సందర్భంలో జగన్ ప్రగల్భాలు పలికారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి